Publish Date:Oct 31, 2025
జగన్ పాలన గత ఐదేళ్ల పాటు చూశాం. అంతా ఒంటెత్తు పోకడ. ఎక్కడా పారదర్శకత అనేదే ఉండదు. ప్రజాస్వామికత అస్సలు కనిపించదు. అందరూ నోటికి తాళం వేసుకుని ఉండాల్సిందే. ఎందుకంటే ఇటు ఎమ్మెల్యేలు, అటు ఎంపీలు ఇలా ఎవరైనా సరే వారి వారి స్వశక్తితో గెలిచినట్టుగా జగన్ ఎట్టి పరిస్థితుల్లో భావించరు. వారిని సంబంధం లేని ప్రాంతాలకు పంపి పోటీ చేయించడం ఇందులో భాగమే. తాను ఎక్కడ ఎవర్ని నిలబెట్టినా వారంతా తన బొమ్మ మీద గెలుస్తారనే గట్టి నమ్మకం.. మొత్తానికి జగన్ ది నియంతృత్వ పోకడ.
ఇదంతా ఇలా ఉంటే కూటమిలో కేవలం సింగిల్ ఫేజ్ కాదు. ట్రిపుల్ ఫేజ్. ఏదైనా ఒక సమస్య వస్తే స్పందించడానికి ఇక్కడ మూడు రకాల ముఖచిత్రాలున్నట్టు కనిపిస్తోంది. అందులో ఫస్ట్ అండ్ మెయిన్ ఫేస్ సీఎం చంద్రబాబు. ఆయన తన అనుభవమంతా రంగరించి.. మరీ రంగంలోకి దిగుతారు. ఇక్కడ రెండో ఫేస్ పవన్ కళ్యాణ్. పవన్ నేర్చుకోవాలన్న తన ఉత్సాహాన్నంతా వాడి.. ఆయా సమీక్షలు, సమావేశాలు, పరిశీలనలు చేసి ఆదేశాలు ఇస్తుంటారు.
ఇక థర్డ్ ఫేస్ ఆఫ్ కూటమి మంత్రి లోకేష్. నారా లోకేష్ తన తండ్రి ద్వారా నేర్చుకున్నదంతా వాడి.. ఆయా సమస్యలకు పరిష్కార మార్గాలను వెతుకుతుంటారు. చాలా మంది కేంద్ర బీజేపీ, రాష్ట్ర బీజేపీ రెండింటినీ కలిపి డబుల్ ఇంజిన్ సర్కార్ గా చెబుతుంటారు. అలాగే ఇక్కడ ఏపీలో నడిచే కూటమి ప్రభుత్వం ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోందా? అంటే అవుననే చెప్పుకోవాలి. అదే.. జగన్ గవర్నమెంట్ లో అయితే.. కేవలం ఒకే ఒక్క మోనార్క్ జగన్ మాత్రమే నడిపిస్తారు. అన్నీ తనకే తెలుసు అన్న కోణంలో చేసే రొడ్డ కొట్టుడు పరిపాలన మాత్రమే సాగింది.
అదే కూటమిలో చంద్రబాబుకూ, లోకేష్ కీ ఎంతో భిన్నమైన వైరుధ్యంతో కూడిన పవన్ కళ్యాణ్ సడెన్ ఎంట్రీ ఇచ్చి.. ఆయా పనులు చక్క బెట్టడం తెలిసిందే. ఆయన ఒక డిప్యూటీ సీఎంగా ఏ విషయం లోనైనా తన అభిప్రాయాలను వెలిబుచ్చుతుంటారు. ఆపై కొన్ని కొన్ని సంచలన నిర్ణయాలూ తీసుకుంటూ ఉంటారు. ఇది కదా ప్రజాస్వామిక పరిపాలన అంటే.. జగన్ ఒంటెత్తు పాలనకూ.. కూటమి ప్రజాస్వామిక పాలనకూ తేడా ఇక్కడే కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/difference-between-jagan-rule-and-cbns-39-208797.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.