అప్రూవర్ గా మారతా.. జగన్ కు విజయసాయి పరోక్ష హెచ్చరికేనా?

Publish Date:Mar 13, 2025

Advertisement

విజయసాయి రెడ్డి ప్రతి మాటా, ప్రతి కదలికా.. వైసీపీ కాళ్ల కింద భూమిని కదిలించేస్తోంది. విజయసాయి రెడ్డి ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడతాడా అన్న టెన్షన్ వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పేసి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేని వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించిన తరువాత ఆయన ప్రతి కదలికా వైసీపీని గాభరాపెడుతూనే ఉంది. వైసీపీకి గుడ్ బై చెప్పేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన తరువాత ఆయన మొదటిగా కలిసింది వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిలను. ఇది కచ్చితంగా జగన్ ను ఇబ్బంది పేట్టే చర్యేననడంలో సందేహం లేదు. ఆ తరువాత ఆయన వ్యవసాయం చేస్తున్నానంటూ కొన్ని ఫొటోలూ, వీడియోలూ విడుదల చేసినా వైసీపీలో కంగారు, భయం తగ్గలేదు. అందుకు నిదర్శనమే విజయ సాయి పార్టీకి దూరమైన తరవాత చాలా రోజులకు జగన్ ఓ మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి పేరు ప్రస్తావించకుండానే విశ్వసనీయత లేని వ్యక్తి అంటూ విమర్శలు గుప్పించారు. ఆ వెంటనే జగన్ వ్యాఖ్యలను విజయసాయి ఖండించారు. 

ఆ తరువాత మళ్లీ విజయసాయి వైసీపీకి వ్యతిరేకంగా, మరీ ముఖ్యంగా జగన్ కోటరీ అంటూ కొందరు నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పేరుకి కోటరీ అంటూ పేర్లు ప్రస్తావించకుండా విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలపైనే అని ఎవరికైనా ఇట్టే అవగతమౌతాయి. 

కాకినాడ షేర్ల బలవంతపు బదలాయింపు కేసులో సీఐడీ విచారణకు విజయసాయి బుధవారం విజయవాడ సీఐడీ కార్యాలయానికి వచ్చారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ మాటలలో ఆయన వెల్లడించిన విషయాలు, ఆయన వినిపించిన ధిక్కార స్వరం ఇప్పుడు వైసీపీలో కలవరానికి కారణమయ్యాయి.  కాకతాళీయమే అయినా వైసీపీ ఆవిర్భావ దినం అయిన మార్చి 12నే విజయసాయి జగన్ కోటరీ గురించి4 చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నైతిక స్థైర్యాన్ని బాగా దెబ్బతీశాయి. వైసీపీ యువత పోరు కార్యక్రమం నుంచి అందరి దృష్టినీ మళ్లించాయి.    కాకినాడ పోర్టు విషయంలో సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డే ‘కర్త కర్మ క్రియ' అని కుండబద్దలు కొట్టడం, అలాగే జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో ప్రధాన పాత్రధాని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పడం ద్వారా వెనుక ఉన్న సూత్రధాని జగనేనా అన్న అనుమానాలకు తెరతీసేలా చేశారు విజయసాయిరెడ్డి.

ఎందుకంటే వైవీ సుబ్బారెడ్డి, కసిరెడ్డి రాజశేఖరరెడ్డి ఇద్దరూ జగన్ బంధువులే.  వీటికి సబంధించి అవసరమైతే ముందు ముందు మరిన్ని విషయాలు, వివరాలు వెల్లడిస్తానని విజయసాయి చెప్పడం ఒక రకంగా తాను అప్రూవర్ గా మారడానికి కూడా వెనుకాడనని విజయసాయి పరోక్షంగా జగన్ కు హెచ్చరిక జారీ చేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాకినాడ పోర్టు షేర్ల వ్యవహారంలో  జగన్ ప్రమేయం లేదని ఓ వైపు చెబుతూనే.. వైవీ సుబ్బారెడ్డి పుత్రరత్నమే కర్తాకర్మాక్రియా అనడం ద్వారా జగన్ ప్రమేయం, అంగీకారం లేకుండానే విక్రాంత్ రెడ్డి ఇంత పెద్ద వ్యవహారం చక్కబెట్టగలడా అన్న అనుమానాలు అందరిలో వ్యక్తమయ్యేలా చేశారు విజయసాయిరెడ్డి. ఇక్కడే తన వ్యాఖ్యలతో వైసీపీయులు తనపై విమర్శల దాడికి పాల్పడకుండా విజయసాయి చెక్ పెట్టారంటున్నారు పరిశీలకులు.

ఇప్పుడు విజయసాయిరెడ్డిపై వైసీపీయులు తమకు మాత్రమే చేతనైన రీతిలో విమర్శల దాడికి దిగితే.. జగన్ ఇబ్బందుల్లో పడేలా విజయసాయి గళం మరింత పెంచుతారన్న భయం వారిలో పాదుకునేలా చేయడంలో విజయసాయి విజయం సాధించారని చెబుతున్ేనారు. ఇప్పుడు విజయసాయిని రెచ్చగొడితే  జగన్ పై పది సీబీఐ, 11 ఈడీ కేసులలో ఏ2 అయిన విజయసాయి అప్రూవర్ గా మారితో కొంప కొల్లేరౌతుందని వారికి తెలుసు. అందుకే దొంగకు తేలు కుట్టిన చందంగా విజయసాయి వ్యాఖ్యలపై అరకొర ఖండనలకే వైసీపీయులు పరిమితమయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
పాముకు పాలు పొయొద్దు.. పోస్తే అది తిరిగి మనల్నే కాటేస్తుంది. ఇదీ కొన్నాళ్ల క్రితం వైసీపీ నేతలను ఉద్దేశించి చంద్రబాబు తెలుగుదేశం నేతలకు చెప్పిన మాటలు.
రాజ్ కసిరెడ్డి. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి బుధవారం (మార్చి12) సీఐడీ విచారణకు వెళ్లి వచ్చిన తర్వాత నుంచి ఈ పేరు గురించే ఏపీ రాజకీయాల్లో తెగ చర్చ జరుగుతోంది. కాకినాడ పోర్టు అంశంలో విజయసాయి రెడ్డి విచారణకు హజరైనా.. మీడియా అడిగిన ప్రశ్నలకు విజయసాయి రెడ్డి బదులిస్తూ లిక్కర్ స్కాంలో కర్త, కర్మ, క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేనని తేటతెల్లంగా చెప్పేశారు.
అభివృద్ధి పేరుతో అడవుల నరికివేత కారణంగా వన్యప్రాణలు ఆవాసాలు కోల్పోతున్నాయి. జనావాసాలపై పడుతున్నాయి. ఆహార, నీటి కోసం అవి వనాలను వదిలి జనాల నివాసాలవైపు వస్తున్నాయి. ఈ పరిణామం అటు వన్యప్రాణులకు, ఇటు మనుషులకూ కూడా ప్రమాదకరంగానే మారుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో ఐదేళ్ల జగన్ అరాచక పాలనకు చరమగీతం పాడుతూ జనం తెలుగుదేశం కూటమికి అద్భుత విజయాన్ని అందించి అధికారం కట్టబెట్టారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దివ్యంగా ఉంది. జనం స్వేచ్ఛగా, నిర్భయంగా, ప్రశాంతంగా బతుకుతున్నారు. సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాల్లా పరుగులు తీస్తున్నాయి. ప్రజలలో సంతృప్తి స్థాయి పెరుగుతోంది. అయినా ఎక్కడో ఏదో వెలితి.. తెలుగుదేశం శ్రేణుల్లో కించిత్తు అసహనం, అసంతృప్తి వ్యక్తం అవుతున్నాయి.
తన రాజకీయ భవిష్యత్ పై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. యనమల రామృకృష్ణుడు తొలిసారి 1983లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి టీడీపీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చారు. మంత్రిగా, స్పీకర్‌గా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గా అనేక కీలక పదవులు నిర్వహించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రులు తరచూ ఢిల్లీ వెళ్ళడం కొత్త విషయం కాదు. ఇప్పుడే కాదు గతంలోనూ వుంది. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పడు, ముఖ్యమంత్రులు ఒక కాలు ఢిల్లీలో మరో కాలు హైదరాబాద్ లో అన్నట్లు ఇటూ అటూ చక్కర్లు కొడుతూ ఉండేవారని అంటారు.
తెలంగాణ రాజకీయాల్లో ఏమి జరుగుతోంది? ఓ వంక అధికార కాంగ్రెస్ పార్టీలో ఒక విధమైన గందరగోళం నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టి 14 నెలలు పూర్తయినా, ఆయనకు, పరిపాలనపై పూర్తి పట్టు చిక్కినట్లు లేదు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం, వరుస సెలవుల కారణంగా తిరమలేశుని దర్శనం కోసం భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయ్యారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆయనను ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
  ఈ నెల 13 నుంచి 18 వరకు తెలంగాణలో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.  తెలంగాణలో గత కొన్ని రోజులుగా  వింత వాతావరణం  నెలకొంది. పగలు అధిక వేడి, రాత్రి చలి గాలులు, ఉదయం మంచు  దుప్పట్లు కురవడం వంటి వాతావరణం  ఉంది.
  బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్ బయ్యా  సన్నీ యాదవ్  పై సూర్యపేట  పిఎస్ లో కేసు నమోదైంది.  ఇటీవలె బెట్టింగ్ యాప్ ల ద్వారా యువత లక్షలాది రూపాయలను పోగొట్టుకున్నారు.
జగన్ హయాంలో పడకేసిన పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పుడు జోరందుకున్నాయి. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు తన మొదటి పర్యటన పోలవరం సందర్శనతోనే ప్రారంభించారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె డాక్టర్ సునీత, అల్లురు రాజశేఖర్ రెడ్డిపై వివేకా పిఏ కృష్ణారెడ్డి పెట్టింది తప్పుడు కేసని పోలీసులు నిర్ధారించారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.