అప్రూవర్ గా మారతా.. జగన్ కు విజయసాయి పరోక్ష హెచ్చరికేనా?

Publish Date:Mar 13, 2025

Advertisement

విజయసాయి రెడ్డి ప్రతి మాటా, ప్రతి కదలికా.. వైసీపీ కాళ్ల కింద భూమిని కదిలించేస్తోంది. విజయసాయి రెడ్డి ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడతాడా అన్న టెన్షన్ వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పేసి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేని వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించిన తరువాత ఆయన ప్రతి కదలికా వైసీపీని గాభరాపెడుతూనే ఉంది. వైసీపీకి గుడ్ బై చెప్పేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన తరువాత ఆయన మొదటిగా కలిసింది వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిలను. ఇది కచ్చితంగా జగన్ ను ఇబ్బంది పేట్టే చర్యేననడంలో సందేహం లేదు. ఆ తరువాత ఆయన వ్యవసాయం చేస్తున్నానంటూ కొన్ని ఫొటోలూ, వీడియోలూ విడుదల చేసినా వైసీపీలో కంగారు, భయం తగ్గలేదు. అందుకు నిదర్శనమే విజయ సాయి పార్టీకి దూరమైన తరవాత చాలా రోజులకు జగన్ ఓ మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి పేరు ప్రస్తావించకుండానే విశ్వసనీయత లేని వ్యక్తి అంటూ విమర్శలు గుప్పించారు. ఆ వెంటనే జగన్ వ్యాఖ్యలను విజయసాయి ఖండించారు. 

ఆ తరువాత మళ్లీ విజయసాయి వైసీపీకి వ్యతిరేకంగా, మరీ ముఖ్యంగా జగన్ కోటరీ అంటూ కొందరు నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పేరుకి కోటరీ అంటూ పేర్లు ప్రస్తావించకుండా విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలపైనే అని ఎవరికైనా ఇట్టే అవగతమౌతాయి. 

కాకినాడ షేర్ల బలవంతపు బదలాయింపు కేసులో సీఐడీ విచారణకు విజయసాయి బుధవారం విజయవాడ సీఐడీ కార్యాలయానికి వచ్చారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ మాటలలో ఆయన వెల్లడించిన విషయాలు, ఆయన వినిపించిన ధిక్కార స్వరం ఇప్పుడు వైసీపీలో కలవరానికి కారణమయ్యాయి.  కాకతాళీయమే అయినా వైసీపీ ఆవిర్భావ దినం అయిన మార్చి 12నే విజయసాయి జగన్ కోటరీ గురించి4 చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నైతిక స్థైర్యాన్ని బాగా దెబ్బతీశాయి. వైసీపీ యువత పోరు కార్యక్రమం నుంచి అందరి దృష్టినీ మళ్లించాయి.    కాకినాడ పోర్టు విషయంలో సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డే ‘కర్త కర్మ క్రియ' అని కుండబద్దలు కొట్టడం, అలాగే జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో ప్రధాన పాత్రధాని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పడం ద్వారా వెనుక ఉన్న సూత్రధాని జగనేనా అన్న అనుమానాలకు తెరతీసేలా చేశారు విజయసాయిరెడ్డి.

ఎందుకంటే వైవీ సుబ్బారెడ్డి, కసిరెడ్డి రాజశేఖరరెడ్డి ఇద్దరూ జగన్ బంధువులే.  వీటికి సబంధించి అవసరమైతే ముందు ముందు మరిన్ని విషయాలు, వివరాలు వెల్లడిస్తానని విజయసాయి చెప్పడం ఒక రకంగా తాను అప్రూవర్ గా మారడానికి కూడా వెనుకాడనని విజయసాయి పరోక్షంగా జగన్ కు హెచ్చరిక జారీ చేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాకినాడ పోర్టు షేర్ల వ్యవహారంలో  జగన్ ప్రమేయం లేదని ఓ వైపు చెబుతూనే.. వైవీ సుబ్బారెడ్డి పుత్రరత్నమే కర్తాకర్మాక్రియా అనడం ద్వారా జగన్ ప్రమేయం, అంగీకారం లేకుండానే విక్రాంత్ రెడ్డి ఇంత పెద్ద వ్యవహారం చక్కబెట్టగలడా అన్న అనుమానాలు అందరిలో వ్యక్తమయ్యేలా చేశారు విజయసాయిరెడ్డి. ఇక్కడే తన వ్యాఖ్యలతో వైసీపీయులు తనపై విమర్శల దాడికి పాల్పడకుండా విజయసాయి చెక్ పెట్టారంటున్నారు పరిశీలకులు.

ఇప్పుడు విజయసాయిరెడ్డిపై వైసీపీయులు తమకు మాత్రమే చేతనైన రీతిలో విమర్శల దాడికి దిగితే.. జగన్ ఇబ్బందుల్లో పడేలా విజయసాయి గళం మరింత పెంచుతారన్న భయం వారిలో పాదుకునేలా చేయడంలో విజయసాయి విజయం సాధించారని చెబుతున్ేనారు. ఇప్పుడు విజయసాయిని రెచ్చగొడితే  జగన్ పై పది సీబీఐ, 11 ఈడీ కేసులలో ఏ2 అయిన విజయసాయి అప్రూవర్ గా మారితో కొంప కొల్లేరౌతుందని వారికి తెలుసు. అందుకే దొంగకు తేలు కుట్టిన చందంగా విజయసాయి వ్యాఖ్యలపై అరకొర ఖండనలకే వైసీపీయులు పరిమితమయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.