జనన, మరణాలు మన చేతిలో లేవు. కానీ కొన్ని సందర్భాల్లో 108 సిబ్బంది సమయస్ఫూర్తి, ధైర్యంతో ప్రాణం పోస్తారు. అంబులెన్సులోనే సుఖ ప్రసవాలు జరిగేలా చూస్తారు. అటువంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఓ గర్భిణీని అంబులెన్స్ లో తరలిస్తున్న సమయంలో మార్గమధ్యంలో పురిటి నొప్పులు వచ్చాయి.
ప్రసవ వేదనతో బాధపడుతున్న ఆ గర్భిణికి 108 సిబ్బంది సమయస్ఫూర్తితో అంబులెన్స్ లోనే కాన్పు చేసి తల్లి బిడ్డలను సురక్షితంగా కాపాడారు. ఈ సంఘటన రాయచోటిలో జరిగింది. బుధవారం తెల్లవారుజామున ఓ గర్భిణీ ని మెరుగైన చికిత్స కోసం రాయచోటి ఏరియా హాస్పిటల్ నుండి కడప రిమ్స్ హాస్పిటల్ కి 108 అంబులెన్స్ లో తీసుకు వెళ్తున్న సమయంలో ఆమె కు నొప్పులు అధికమ య్యాయి. పరిస్థితిని అర్ధం చేసుకున్న అంబులెన్స్ సిబ్బంది ఈఆర్సిపి డాక్టర్ సింధుకు ఫోన్ చేసి విషయం వివరించారు.
దీంతో డాక్టర్ సింధు సలహా మేరకు అంబులెన్స్ సిబ్బంది జయరామ్ అంబు లెన్స్ లోనే గర్భిణీకి ప్రసవం జరి పారు. ఆ గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ, తల్లి ఇద్దరు క్షేమంగా ఉన్నారు. అనంతరం ఆ మహిళకు ఐవి ఫ్లూయిడ్స్ అందిస్తూ శిశువుకు అవసరమైన ప్రాథమిక సంరక్షణ చేపడుతూ... తల్లి ,బిడ్డలను మెరుగైన చికిత్స నిమిత్తం కడప రిమ్స్ హాస్పిటల్ కి సురక్షితంగా తరలించారు.
అయితే అప్పటికే అంబు లెన్స్ లో ప్రసవించిన మహి ళను చూసి కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. అత్యవసర సమయంలో సమయస్ఫూర్తితో వ్యవ హరించి ప్రసవం చేసిన 108 సిబ్బందిని అభినందించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/delivery-in-an-ambulance-36-216927.html
భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికి పోతున్నది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని జలమయమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.
కాగా వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారిని విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడు, అలాగే.. భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖపట్నానికి చెందిన చిన్న అమ్మోరుగా గుర్తించారు.
తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, అభిషేక్ శర్మ 43 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లోనే.. బెదురూ బెరుకూ లేకుండా జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో సిక్సర్ బాది ఔరా అనిపించాడు.
హైదరాబాద్లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్
సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భావోద్వేగంగా మాట్లాడారు.
చరిత్ర సృష్టించిన వైభవ్.. 15 ఏళ్లకే టీమిండియాలో అరంగేట్రం..!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కనీసం బూడిదైనా ఇవ్వండి.. అంత్యక్రియలు చేసుకుంటా..లేదంటే ఆత్మహత్య చేసుకుంటా..
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన వ్యూహాత్మక గమనంతో సాగుతుంటాయి.
భారీ బ్యాంకు రుణాల మోసాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది.
భార్యాభర్తల బంధం ఎంతో అపురూపమైనది. ఆ బంధంలో చిన్నచిన్న మనస్పర్థలు, గొడవలు సహజమే