మానవత్వం అడుగంటుతున్నసమాజం

Publish Date:Apr 20, 2013

Advertisement

 

డిల్లీ ఘటన తరువాత నిర్భయ చట్టం అమలులోకి వచ్చిన తరువాత కూడా దేశంలో మహిళలపై అత్యాచారాలు ఆగకపోగా అదొక అంటూ రోగంలా దేశమంతటా వ్యాపించి ఇప్పుడు అభం శుభం తెలియని పసిపిల్లలను సైతం బలి తీసుకొంటోంది. ఈ ఆకృత్యాలు సరిపోవన్నట్లు మనుషుల్లో దాగిఉన్న రాక్షస ప్రవృతి కూడా ఇప్పుడు బయటపడుతోంది. డిల్లీలో జరిగిన సంఘటనతో దేశం మరో మారు ఉలిక్కి పడింది.

 

నానాటికి దేశంలో పెరిగిపోతున్నఇటువంటి ఆకృత్యాలకు వెంటనే కటినమయిన శిక్షలు అమలు చేయడంలోచట్టపరంగా జరుగుతున్నఆలస్యమే ఇటువంటి ఉన్మాదులకు మరింత దైర్యం ఇస్తోందని చెప్పక తప్పదు. ప్రభుత్వాలు చట్టాలు చేసి, నష్ట పరిహారం చెల్లించి చేతులు దులుపుకొంటే, న్యాయ వ్యవస్థలో ఉన్న అన్నిఅవకాశాలను, లొసుగులను సంపూర్ణంగా వాడుకొంటూ, తమకు మంచి ఆహారం, పళ్ళు, సౌకర్యాలు కావాలని నిందితులు డిమాండ్ చేయగలుగుతున్నారు. అయినప్పటికీ పటిష్టమయిన మన న్యాయ వ్యవస్థ వారిని ఇంతవరకు శిక్షించలేకపోతోంది. ఈ ఆలస్యమే నేడు మృగాళ్ళను ఇటువంటి దారుణాలకు పాల్పడేందుకు దైర్యం కల్పిస్తోంది.

 

డిల్లీ ఉదంతం జరిగినప్పుడు అక్కడి బార్ అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా ముక్త కంఠంతో దానిని ఖండించడమే కాకుండా, ఆ నేరస్తుల తరపున తామెవరము కూడా వాదించబోమని భీషణ ప్రతిజ్ఞలు కూడా చేశారు. కానీ, నెల తిరిగేసరికి వారి ఆలోచనలలో మార్పులు వచ్చి, ఇప్పుడు ఆ నేరస్తుల తరపున వాదించడానికి పోటీలు పడుతున్నారు కూడా. ఎందుకంటే అటువంటి కేసుల్లో వాదించినప్పుడే మీడియాలో కనబడుతూ, మంచి పేరు సంపాదించుకోవచ్చుననే దురాశ వారిలోమానవత్వాన్ని కబళించివేసింది.

 

ఇటువంటి ఘోర అకృత్యాలు జరిగిన ప్రతీసారి ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు ఆందోళనలు చేస్తే తప్ప మన వ్యవస్థలలో స్వయం చలనం కనబడకపోవడం చూస్తుంటే, మనుషుల్లో మానవత్వం కూడా ఇప్పుడు క్రమంగా అడుగంటిపోతున్నదని అనిపిస్తోంది. అన్నెంపున్నెం ఎరుగని 5ఏళ్ల పసిపాపపై రాక్షసత్యాచారం జరిగిన తరువాత కటినంగా వ్యవహరించవలసిన డిల్లీ పోలీసులు, ఆ పసిపాప తల్లి తండ్రులు పిర్యాదుచేయడానికి వస్తే, “మీ పాప మీకు దక్కింది కదా ఇంకా ఎందుకు ఈ ఏడుపులు? అనవసరంగా కోర్టులు, కేసులు అంటూ ఎందుకు తిరుగుతారు?” అని వారి చేతిలో పోలీసులే ఓ రెండువేలు పెట్టడం చూస్తే ఇక ప్రజలకి దిక్కెవరని అనిపించకమానదు. పైగా నిరసన తెలియజేస్తున్న మహిళలపై కూడా పోలీసులు చెయ్యి చేసుకోవడం వారు ఇటువంటి సంఘటనల పట్ల స్పందన కోల్పోయారని తెలియజేస్తోంది.

 

ఇటువంటి వ్యవస్థలో ఎవరు మాత్రం భద్రత ఆశించగలరు? ఇటువంటి సంఘటన జరిగిన వెంటనే యధావిధిగా మీడియాలో పతక శీర్షికన వార్తలు, టీవీ స్క్రోలింగులు, చర్చలు, పద్దతి ప్రకారం రాజకీయ పార్టీల ఖండనలు, అధికార పార్టీపై విమర్శలు, అధికార పార్టీ నేతల దిగ్బ్రాంతి ప్రకటనలు, హామీలు వగైరాలన్నిమాత్రం అత్యంత నిర్దిష్టమయిన పద్దతిలో జరిగిపోతున్నాయి. మానవత్వంతో స్పందించవలసిన సమాజం, వ్యవస్థలు, ఇటువంటి ఘోర అకృత్యాలు జరిగినప్పుడు కూడాఇంత యాదృచ్చికంగా, ఇంత అమానవీయంగా స్పందించడం చూస్తుంటే అసలు మనమెటువంటి సమాజంలో బ్రతుకుతున్నామనే బాధ కలుగకమానదు.

 

శరీరంలో ఒక భాగానికి కాన్సర్ సోకితే దానిని ముందుగా మందులతో నయం చేసుకొనేందుకు ప్రయత్నించి, నయం అవకపోతే ఆ భాగాన్నే తొలగించుకొని బ్రకాలనుకొంటాము తప్ప చనిపోవాలని ఎవరూ అనుకోము. అదే విధంగా ఇటువంటి అకృత్యాలకి పాల్పడుతున్న వారికి మంచి మాటలతో అర్ధం కానప్పుడు, మరణదండన వంటి కటిన శిక్షలు విధించినప్పుడే, మళ్ళీ అటువంటి నేరాలు చేయడానికి ఎవరూ సాహసించరు. కానీ, అవి కూడా నేరం జరిగిన రెండు మూడు నెలలోగా అమలు చేయగలిగినప్పుడే, మృగాళ్ళలో అటువంటి నేరం చేస్తే ఉరి తప్పదనే ఒక భయం ఏర్పడుతుంది. మన వ్యవస్థలను శక్తివంతం, ప్రక్షాళనం చేసుకోనంతకాలం ఇటువంటి ఘోర అకృత్యాలు జరుగుతూనే ఉంటాయి.

By
en-us Political News

  
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.