Publish Date:Dec 13, 2022
పిల్లలంటే తల్లిదండ్రులకు మురిపెం. పిల్లలేం చేసిన వారికి ముద్దుగానే ఉంటుంది. అందులోనూ తమకు దూరంగా హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న పిల్లలంటే మరీను. వారికి సెవలులెప్పుడొస్తాయా? ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తారా అని ఎదురు చూస్తూనే ఉంటారు. అలాగే పిల్లలకు కూడా ఇంటి మీద బెంగ ఉంటుంది.
గారంగా కోరితే కొండమీది కోతిని కూడా తెచ్చిచ్చే తల్లిదండ్రులకు దూరంగా హాస్టళ్లలో ఉండటం వారికీ ఇబ్బందే. అందుకే హాస్టల్ కు వెళ్లిన రోజు నుంచీ వారు ఎప్పుడు సెలవులు వస్తాయా? ఎప్పుడు ఇంటికి వెడదామా అని రోజులు లెక్కిస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఇంటి దగ్గర అమ్మ తనకు ఇష్టమైనవన్నీ అడిగి మరీ వండి పెడుతుంటే.. ఆ రుచికి అలవాటు పడిన వారు హాస్టళ్లలో తిండి తినలేక ఇంటి ఫుడ్ కోసం మొహంవాచిపోయి ఉంటారు.
అలా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లి ఇష్టమైనవన్నీ తినేద్దామా అన్న ఆత్రంలో ఉన్న ఓ బాలిక హాస్టల్ నుంచి తన తండ్రి ఫోన్ కు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తాను ఫలానా రోజున ఇంటికి వస్తున్నాననీ, ఆ రోజుకు తాను పంపిన మెనూ ప్రకారం ఫుడ్ రెడీ చేయమనీ ఆ మెసేజ్ సారాంశం. శ్వేతాంక్ భూషణ్ అనే వ్యక్తి కుమార్తెను హాస్టల్ ఉండి చదువుకుంటోంది. ఐదు నెలల తరువాత శుక్రవారం (డిసెంబర్16) క్రిస్మస్ సెలవుల కోసం ఇంటికి రానుంది. ఈ సందర్బంగా ఆమె తండ్రికి మెసేజ్ చేసింది. తాను సెలవలకు ఇంటికి వస్తున్నాననీ, తనకు సెలవులలో ఏం ఫుడ్ కావాలో ఓ లిస్ట్ పెట్టింది. ఆ లిస్ట్ చూసిన శ్వేతాంక్ భూషణ్ తొలుత షాక్ అయ్యాడు.
ఆ తరువాత కూతురిపై ప్రేమ పొంగుకొచ్చింది. ఆమె కోరినవన్నీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. తన కూతురు తనకు పంపిన మెసెజ్ ను యథాతథంగా సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాడు. వెంటనే అది వైరల్ అయ్యింది. ఇంతకీ తన తండ్రికి ఆ అమ్మాయి మెసేజ్ చూసిన లిస్ట్.. సెలవుల్లో ఆ అమ్మాయి తినాలనుకుంటున్న ఫుడ్ ఐటెమ్స్. ఆ జాబితా ఏం చిన్నగా లేదండోయ్ చాలా చాలా భారీగా ఉంది. హాస్టల్ తిండి తినలేక రుచికరమైన ఫుడ్ కోసం ఆ అమ్మాయి ఎంతగా తహతహలాడిపోతోందో ఆ లిస్ట్ చూస్తే ఇట్టే అర్దమైపోతుంది.
అందుకే సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయిపోయింది. గతంలో నా కుమార్తే ఇలాగే చేసేది.. ఇప్పుడు పెళ్లై పిల్లలు పుట్టిన తరువాత కూడా ఇంటికి వస్తోందంటే ఇలా తనకు కావలసిన ఫుడ్ ఐటెమ్స్ జాబితా పంపుతుంది.. అయితే ఇప్పుడు తన ఒక్కర్తికే కాదు.. భర్త, పిల్లల కోసం కూడా సెపరేట్ లిస్ట్ పెడుతోందని ఓ తండ్రి స్పందించాడు. ఇక విద్యార్థులైతే మేం కూడా అంతే అని కొందరు...ఇక పై మేమూ ఇదే ఫాలో అవుతామని మరి కొందరూ స్పందించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/daughters-message-to-father-from-hostel-goes-viral-25-148481.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.