తెలంగాణ రాష్ట్రానికి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అన్న నినాదం ఎక్కడో విన్నట్లుగా ఉంది కదా?! నిజమే, ప్రస్తుత ముఖ్యమంత్రి కవ్లకుంట్ల చంద్రశేఖరరావు తన నోటితో చెప్పిన మాటలు ఇవే. కానీ ఆ మాటలు అందరూ మరచిపోయారు. పుష్కరకాలం తరువాత తిరిగి ఆ నినాదం ఊపందుకోబోతోంది. ఈ సారి కేసీఆర్ నోట కాదు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తోంది.
కాంగ్రెస్ పరిస్థితి కర్నాటక ఎన్నికల ఫలితాలతో పూర్తిగా మారిపోయింది. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ కి ఉన్న సంబంధం అపురూపమైనది. దేశమంతా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్న సమ యంలో అప్పటి కాంగ్రెస్ అధినేత్రి ఇందిరా గాంధీని గెలిపించుకున్న ప్రాంతం తెలంగాణ. సహజంగానే కర్నాటక ఫలితాల ప్రభావం పొరుగునే ఉన్న తెలంగాణ రాష్ట్రంపై పడింది. అయితే కాంగ్రెస్ విజయం సాధిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది. రెడ్డి
సామాజికవర్గ రాజకీయ ప్రాబల్యం అధికంగా ఉన్న తెలంగాణలో, అందులో కాంగ్రెస్ లో దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.
రెడ్లలో ఉన్న పోటీని నివారించాలంటే ఇతర సామాజిక వర్గాలకు పదవి ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అదీకాక గతంలో మాట ఇచ్చి తప్పిన బీఆర్ఎస్ అధినేతను ఇరుకున పెట్టాలని, దళిత మహిళను పార్లమెంటు ప్రారంభోత్సవానికి పిలవని బీజేపీకి బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గంలో పోరు జగమెరిగిన సత్యమే. రెడ్ల మధ్య పోరును ఆపడానికి దళిత కార్డును కాంగ్రెస్ వినియోగించబోతోంది. ఇంతకీ కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టిలో ఉన్న దళిత నేత ఎవరంటే, విప్లవ పంధా నుంచి జనజీవన స్రవంతిలోకి అడుగు పెట్టిన ములుగు ఎమ్మెల్యే సీతక్క అనే సమాధానం వస్తోంది. నిజాయితీగా పని చేస్తూ, అందరికీ అందుబాటులో ఉంటున్న సీతక్క పెట్ట కాంగ్రెస్ పెద్దలు సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా కాలంలో తన నియోజకవర్గంలో కాలినడకన ప్రయాణిస్తూ ప్రజలను ఆదుకున్న అడవి బిడ్డ సీతక్క ఇప్పుడు కాంగ్రరెస్ కు ఆశాదీపంగా కనిపిస్తోంది.
ఇటీవల రాహుల్ గాంధీతో కలిసి బారత్ జోడో యాత్రలో పాల్గొన్న సీతక్క దేశంలోని అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులతో పరిచయం పెంచుకున్నారు. రాహుల్ గాంధీ సీతక్కను ప్రత్యేకంగా ఆహ్వానించి భారత్ జోడో యాత్రలో భాగస్వామ్యం చేయడం వెనుక ఆమెను తెలంగాణ సీఎం పీఠంలో కూర్చోపెట్టే వ్యూహమే ఉందంటున్నారు ఢిల్లీ పెద్దలు. సీతక్కకు అన్ని రాజకీయ పార్టీలతో మంచి సంబంధాలు ఉండడం, వివాదాలకు అతీతంగా వ్యవహరించడం కూడా అమెకు ప్లస్ అనేది కాంగ్రెస్ వాదన. మరో వైపు భట్టి విక్రమార్క కూడా పాదయాత్రలు చేస్తూ అధిష్ఠానం కంట్లో పడే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా రెడ్లు, రెడ్లు పోరులో దళితులు ప్రయోజనం పొందడం ప్రస్తత తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/dalit-cm-for-telangana-25-156350.html
ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా? ప్రభుత్వాన్ని రద్దు చేసే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ వున్నారా? అందుకే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ పెట్టుకున్నారా? అయితే ముందస్తుకు ప్రధాని గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? సోషల్ మీడియాలో బాగానే ముందస్తు ఎన్నికలపై చర్చ అయితే జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ఉన్న అనుబంధం ప్రత్యేక మైనది. ఏపీ ముఖ్యమంత్రిగా గత నాలుగేళ్ల పైచిలుకు పాలనలో జగన్ రెడ్డి అరాచకాలకు, అడ్డగోలు అప్పులకు కేంద్రం పెద్దలు వెన్నుదన్నుగా నిలిచారన్న భావన ఏపీలో గట్టిగా వ్యక్తం అవుతోంది.
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో నేడు 20 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. ఈ జాబితాలో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఉన్నారు. ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. పలు కసరత్తుల అనంతరం మిగతా స్థానాలకు కూడా విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించనున్నారు. తెలంగాణలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడం తెలిసిందే.
ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎన్డీయే కూటమిలో చేరేందుకు ఆయన తహతహలాడారనీ, తన కుమారుడు కల్వకుంట్ల తారకరామారావును తెలంగాణ ముఖ్యమంత్రిని చేద్దామనుకుంటున్నాననీ ఆశీర్వదించాలనీ తనను కోరారనీ మోడీ బహిరంగ సభలో వెల్లడించారు.
ఖలిస్థాన్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందంటూ బహిరంగ వివాదానికి ఆజ్యం పోసిన కెనడా .. తదనంతర పరిణామాల్లో భారత్ తీసుకుంటున్న చర్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భారత్ లో పనిచేస్తున్న 41 మంది దౌత్య సిబ్బందిని అక్టోబర్ 10లోపు ఉపసంహరించుకోవాలని కెనడాను భారత్ కోరడం తెలిసిందే. ఈ చర్యలను ఊహించని కెనడా, ఇప్పుడు ప్రైవేటు చర్చలను కోరుకుంటున్నట్టు ప్రకటించింది. నిజానికి హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు విషయంలో భారత్ తో ప్రైవేటుగానే చర్చించాల్సిన కెనడా, దీన్ని బహిర్గతం చేసి వివాదానికి కారణమైనట్టు నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.
మహిళా బిల్లుకు లోకసభలో మద్దత్తు ఇవ్వని మజ్లిస్ పార్టీ పట్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లకుండా పార్టీ నష్ట నివారణ చర్యలు తీసుకుంటుందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే మజ్లిస్ పార్టీ మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాలని ప్రయత్నాలు చేస్తుందని పరిశీలకులు అంటున్నారు.
పెరిగిన యూకే స్టూడెంట్, విజిటింగ్ వీసాల రుసుము నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఆరు నెలలలోపు విజిటింగ్ వీసా రుసుము గతంలో 100 పౌండ్లు ఉంటే ఇప్పుడు అది 115 పౌండ్లకు పెరిగింది. విద్యార్థి వీసా రుసుము గతంలో 363 పౌండ్లు ఉండగా దానిని 490 పౌండ్లకు పెంచుతూ బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. బుధవారం (అక్టోబర్ 4) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 18 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
వారం రోజులలోగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తం ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం వారం రోజులలోగా షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.
కుమారుడి రాజకీయ భవిష్యత్తే ముఖ్యమనుకున్న మైనంపల్లి హన్మంతరావు, రోహిత్ను మెదక్ నుంచి పోటీ చేసేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సేవా కార్యక్రమాలు, ఇతర పనులతో మెదక్ లో రోహిత్ ప్రజల్లో ఉంటున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో రాజకీయాలు రంగులు మారుతున్నాయి. అలాంటి వేళ.. రాజకీయ సమీకరణాలు వాయువేగంతో మారిపోతున్నాయి. ఇప్పటి వరకు ముచ్చటగా మూడోసారి అధికార పీఠాన్ని అందుకొంటామంటూ వస్తున్న కేసీఆర్ అండ్ కో ధీమా సన్నగిల్లిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రిమోట్ కంట్రోల్ హస్తినలో ఉంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రధాని, కేంద్ర హోంమంత్రి ఆయనకు అధిష్ఠానం. నీట ముంచినా, పాల ముంచినా భారం మొత్తం వారి మీద వేసి వారి అండదండలతోనే జగన్ రాష్ట్రంలో తన అరాచక పాలన సాగిస్తున్నారు. ఇదీ జగన్ గత నాలుగేళ్ల పై చిలుకు పాలనపై పరిశీలకుల విశ్లేషణ. ఇప్పుడు చంద్రబాబు అరెస్టుతో జగన్ పాపాలలో బీజేపీకి భాగం ఉందన్న విషయం సర్వులకూ తెలిసిపోయింది.
బీజేపీకి జనసేనానిని కటీఫ్ చెప్పేశారా? ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న తనకు బీజేపీతో మైత్రి పెద్ద ప్రతిబంధకంగా మారుతోందని భావిస్తున్నారా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.