Publish Date:Nov 12, 2024
టెక్నాలజీని పాలనలో సమర్ధంగా వినియోగించుకోవడం ద్వారా అద్భుత ఫలితాలు సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదే పదే చెప్పడమే కాకుండా ఆచరణలో కూడా చేసి చూపుతారు. తాజాగా ఆయన దార్శనికత, టెక్నాలజీ వినియోగంపై ఆయన దార్శనికతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే సంఘటన ఇది. ఇటీవల అమరావతి డ్రోన్ సమ్మిట్ సందర్భంగా చంద్రబాబు డ్రోన్లను విజిబుల్ పోలీసింగ్ తగ్గించేందుకు వినియోగించుకుంటామని చెప్పిన సంగతి తెలిసిందే.
డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి అసాంఘిక శక్తులను అరికట్టవచ్చని చెప్పారు. ఆయన మాటలు అక్షర సత్యాలని పోలీసులు తాజాగా నిరూపించారు. ఐదెకరాల విస్తీర్ణంలో సాగు అవుతున్న గంజాయిని డ్రోన్ల వినియోగం ద్వారా గుర్తించిన పోలీసులు ఆ గంజాయి పంటను దగ్ధం చేశారు. ఈ సంఘటన అల్లూరి సీతారామ రాజు జిల్లాలో జరిగింది. జిల్లాలోని జీ.మాడుగుల మండలం డేగలరాయి గ్రామంలో ఐదెకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్న గంజాయి పంటను డ్రోన్ల వినియోగం ద్వారా గుర్తించారు. వెంటనే దానిని దగ్ధం చేశారు. అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలకు సమాయత్తమౌతున్నారు.
తాజా సంఘటన చంద్రబాబు దార్శనికతకు అద్దం పడుతోంది. టెక్నాలజీ వినియోగంలో చంద్రబాబు అందరికంటే ముందుంటారనేందుకు ఇదో నిదర్శనమని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంత కంటే ముందు గతంలో ఎన్నడూ లేని విధంగా బెజవాడ వరద బాధితులకు ఆహారం, నీరు అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రోన్లను వినియోగించింది. వరద బాధితులను డ్రోన్ల సహాయంతో ఆదుకోవడం అదే తొలిసారి. టెక్నాలజీని సమాజహితం కోసం వినియోగించే విషయంలో చంద్రబాబు అందరికంటే ముందుంటారనడానికి ఇవే తాజా ఉదాహరణలని అంటున్నారు. విజన్ 2020 ద్వారా ఐటీ రంగం అభివృద్ధిని నాడు అందిపుచ్చుకున్న చంద్రబాబు ఇప్పుడు విజన్ 2047 ద్వారా భవిష్యత్ భారత్ ను ఇప్పుడే దర్శించి.. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/crimes-control-through-drone-technology-25-188251.html
వేలమంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రాంతీయ ఆకాంక్షలను, ఉద్యమాలను జనసేన గౌరవించాలని కేటీఆర్ పవన్ కు హితవు పలికారు. అయితే, ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. కేటీఆర్ సంధించిన ప్రశ్నలనే తిరిగి కల్వకుంట్ల కుటుంబానికి గురిపెడుతూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో వైనాట్ 175 అంటూ బీరాలు పలికిన జగన్.. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన ఆయనకు, ఆయన పార్టీకీ కనీసం విపక్ష హోదా కూడా ఇవ్వడానికి జనం నిరాకరించారు.
రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమై రెండేళ్లు గడిచిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు. రాష్ట్ర చరిత్రలో జూన్ 4ని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజుగా అభివర్ణించారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు వంటి మహనీయుడిని సైతం నేడు ఒకే ఒక్క కులానికి పరిమితం చేసే దుస్థితి మన రాష్ట్రంలో నెలకొందన్న పవన్ కల్యాణ్.. కులాల పేరుతో సమాజాన్ని విడదీసే ఈ దుర్మార్గపు రాజకీయాలకు ఎక్కడో ఒకచోట చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కులాల ఐక్యతే జనసేన పార్టీ మూల సిద్ధాంతమన్నారు.
గద్దర్ కుమార్తె వెన్నెల పవన్ కల్యాణ్ మాటలు తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, తన తండ్రి గద్దర్ వారసత్వాన్ని అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా పవన్కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమైన మలుపులతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి.
పవన్ కళ్యాణ్పై తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.
చివరి గింజ ధాన్యం కొంటామన్న కాంగ్రెస్ సర్కార్ అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని విమర్శించిన కేటీఆర్.. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు.
లంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజున ఇక్కడి సెంటిమెంట్ను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ కల్యాణే స్వయంగా చెప్పారనీ.. అలాంటి వ్యక్తి మళ్లీ ఇప్పుడు తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
జగన్ ఎప్పుడెప్పుడు అధికారం నుంచి దిగిపోతారా అని దేవుళ్లకు పూజలు చేశారు, శాపనార్థాలు పెట్టారు. జగన్ అధికారంలో ఉంటే తమ అమరావతి కలలు ఎప్పటికీ ఫలించవని ఆవేదన చెందారు. అలాంటిది, ఇప్పుడు అదే అమరావతికి చెందిన రైతులు తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ నే కాకుండా సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురి చేసింది.
దశాబ్దాలుగా కోలీవుడ్ లో సంపాదించుకున్న తన స్టార్ డమ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో విజయ్ సఫలమయ్యారు. వీటన్నింటికీ తోడు తమిళనాట కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నేతల మరణాల తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యం విజయ్ కు అనుకూలంగా మారింది.
ఈ విజయం కేవలం ఒక పదవి మాత్రమే కాదని, తన దశాబ్దాల కఠిన శ్రమకు, అంకితభావానికి దక్కిన అసలైన ఫలితమని ప్రకటించారు.
గతంలో మాతో పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇప్పుడు పెట్టుకుంటే మూతిపళ్ళు రాలుతాయని కవిత హెచ్చరించారు. అంతేకాకుండా, అక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజధాని కట్టుకోవడం చేతకానివాళ్ళు, తెలంగాణ నవనిర్మాణం చేస్తారా అంటూ ఆమె ఎద్దేవా చేశారు.