Publish Date:Jun 19, 2022
మంచి సంబంధం చూసి పిల్లలకు పెళ్లి చేయడం, రెండు కుటుంబాలు స్నేహపూర్వకంగా వుండడం అనేది అందరం కోరుకుంటాం. కానీ అనేకానేక కారణాల వల్ల పోనీ దురదృష్టవశాత్తూ విడాకుల వరకూ వస్తే విడిపోవడమే మంచిదనుకుంటున్నారు రెండు కుటుంబాల వారూ. చదువు, మంచి వుద్యోగం, ఆర్ధికంగా నిలదొక్కుకున్నప్పటికీ ఏదో కారణంగా విడిపోయే పరిస్థితులు వస్తే అప్పుడు సాధ్యమయినంతవరకూ రెండు కుటుంబాలూ ఆ విపత్తు నుంచి బయటపడాలనే అనుకుంటాయి.
మొన్నటివరకూ అయితే ఇలా తప్పని స్థితిలో విడిపోవడం సజావుగానే జరిగిపోయింది. విడిపోయినపుడు స్నేహపూర్వకంగానే విడిపోయిన కుటుంబాలూ వున్నాయి. అయితే తీసుకున్న వరకట్నం డిమాండ్ చేయడమన్నది ఎప్పూడూ ఎవ్వరూ చేసిన దాఖలాలు లేవు. కానీ చిత్రంగా మొన్నీమధ్యనే బెంగుళూరుకి చెందిన మహిళ వరకట్నంగా ఇచ్చిన సొమ్ముతో పాటు బంగారు ఆభరణాలు డిమాండ్ చేసి కోర్టు ద్వారా పొందింది. ఈ కేసుకు సంబంధించి కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అబ్బాయి కుటుంబంవారు పెళ్లి సమయంలో తీసుకున్న 9 లక్షల కట్నంతో పాటు బంగారు ఆభరణాలు కూడా తిరిగి ఇచ్చేయాలని తీర్పు నిచ్చింది.
విషయమేమంటే ముంబైకి చెందిన ఓ అబ్బాయి 1998లో బెంగుళూరుకి చెందిన అమ్మాయిని పెళ్లాడాడు. 2001 లో ఇద్దరి మధ్యా విభేదాలు రావడంతో అదే ఏడాది సెప్టెంబర్ 10 ఇద్దరూ విడాకుల కోసం ముంబై హైకోర్టు మెట్లు ఎక్కారు. కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. అంతేకాదు భార్యకు 4 లక్షలు జీవభృతిగా ఇవ్వాలని ముంబై కోర్టు ఆదేశించింది. వరకట్నం డబ్బు, పెట్టిన బంగారం కూడా వెనక్కి ఇవ్వమని అమ్మాయి వాళ్లు అడిగితే అబ్బాయి కుటుంబం వారు తిరస్కరించేరు. దీంతో అమ్మాయి కుటుంబంవారు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎం. నాగప్రసన్న ఏకసభ్య ధర్మాసనం కేసు పూర్వా పరాలు విన్న తర్వాత అబ్బాయి కుటుంబం వరకట్నం డబ్బుతో పాటు పెట్టిన బంగారు ఆభరణాలు తిరిగి అమ్మాయి కుటుం బానికి ఇచ్చేయాల్సిందే అని తీర్పునిచ్చింది.
మరంచేత ఇక మగ పెళ్లివారు చాలా జాగ్రత్త పడాల్సి వుంటుదేమో! పిల్లడు పిల్లతో కడు జాగ్రత్తగా మసలు కోవాలి. ఏమాత్రం విభే దించినా, కొట్టడాలు, తిట్టడాలు అతిగా చేసినా కేసు అయి కోర్టుదాకా వెళితే ఇచ్చినదంతా కక్కాల్సి వస్తుంది. బహుపరాక్!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/court-orders-to-give-back-dowry-25-137964.html
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.