నీళ్లు, నిధులు, నియామకాలు.. సీఎం ప్రకటనలో నిజమెంత?
Publish Date:Mar 9, 2022
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ముందుగా ప్రకటించి మరీ నిరుద్యోగ యువటకు ‘తీపి’ కబురు చెప్పారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం, ఎంన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ముఖ్యమంత్రి, శాసన సభ వేదికగా ‘మరో సారి’ నోరూరించే కమ్మని కబుర్లు వడ్డించారు. తీపి కబురు చెప్పారు. అయితే, ప్రతిపక్ష పార్టీలు, గతంలోనూ ముఖ్యమంత్రి ఇదే శాసన సభ వేదిక నుంచి ఇంతకంటే, ‘మహా’ తీపి కబుర్లు చాలానే చెప్పారని గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి మళ్ళీ మరోసారి, మాటల గారడీతో నిరుద్యోగులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే కేసీఆర్’ అయినా ఇంకొకరు అయినా, అందరినీ అన్ని వేళలా మోసం చేయడం అయ్యే పని కాదని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీల నాయకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి, ప్రకటన, పీకే (ప్రశాంత్ కిశోర్) రాజకీయ గారడీలో భాగమని, విద్యార్ధులు, యువకులు నమ్మేలా లేదని ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అలాగే, ముఖ్యమంత్రి చేసిన ప్రకటన టీపీసీసీ చీఫ్, పదే పదేచేపుతున్న విధంగా, ముందస్తు ఎన్నికలకు మరో సంకేతంగా కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. అదలా ఉంటే, ముఖ్యమంత్రి ఉద్యోగ నియామకాల ప్రకటనకు ఉపోద్ఘాతంగా నీళ్ళు, నిధులకు సంబంధించి అర్థ సత్యాలు, అసత్యాలతో సభను తప్పుదారి పట్టించారని, విపక్షాలు విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి జలాలకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో, ఆంధ్రా పాలకులు అన్యాయం చేశారని, అందుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వంత పాడరని ముఖ్యమంత్రి చేసిన ఆరోపణను కాంగ్రెస్ నాయకులు తప్పు పడుతున్నారు. ముఖ్యమంత్రి, కేసీఆర్ ఇంజనీరింగ్ నిపుణుల సలహాలను పక్కన పెట్టి, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టారని, విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పలేదని, ఇప్పుడు ప్రాజెక్ట్ నిర్వహణ వ్యయం తడిసి మోపిడయిందని, దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని అంటున్నారు. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం వలన ఆంధ్రా కాంట్రాక్టర్లకు మాత్రమే ప్రయోజనం జరిగిందన్న తమ ప్రధాన ఆరోపణకు ముఖ్యమంత్రి సమాధానం దాట వేశారని విపక్షాలు తప్పు పడుతున్నాయి. అలాగే, నిధుల విషయంలోనూ ముఖ్యమంత్రి సభను తప్పుదోవ పట్టించారని, ధనిక రాష్ట్రం ఇప్పుడు సకాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చిందో, అప్పుల ఊబిలో ఎందుకు కూరుకు పోయిందో చెప్పాలని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. మరో వంక ముఖ్యమత్రి ప్రకటన ఉహించేదనని, అయినా నమ్మేలా లేదని నిరుద్యోగులు కూడా పెదవి విరుస్తున్నారు.
రాష్ట్రంలో ఒకేసారి తె91,142 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాదు, తెలంగాణలో 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చేస్తున్నట్లు అసెంబ్లీలో వెల్లడించారు. ఇందులో ఎంత నిజం వుందో, విధివిదానాలు వస్తే కానీ తెలియదు. ఉద్యమంలో ప్రాణ త్యాగం చేసిన, 1200 యువకుల కుటుంబాలనే ముఖ్యమంత్రి మోసం చేశారని, ఇస్తాననన్ నష్ట పరిహారం సగం కుటుంబాలకు కూడా చేరలేదని ప్రతిపక్ష పార్టీలు గుర్తు చేస్తున్నాయి. అలాగే, ముఖ్యమంత్రి ఉద్యోగ వయో పరిమితిని పెంచారు. విద్యాశాఖలో 25 నుంచి 30 వేల వరకు పోస్టులు, కొత్త జిల్లాలు, జోన్ల ప్రకారం ఉద్యోగాల భర్తీ చేస్తామని కేసీఆర్ తెలిపారు.
http://www.teluguone.com/news/content/controversy-over-cm-kcr-statement-39-132801.html





