నీళ్లు, నిధులు, నియామకాలు.. సీఎం ప్రకటనలో నిజమెంత?

Publish Date:Mar 9, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ముందుగా ప్రకటించి మరీ నిరుద్యోగ యువటకు ‘తీపి’ కబురు చెప్పారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం, ఎంన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ముఖ్యమంత్రి, శాసన సభ వేదికగా ‘మరో సారి’ నోరూరించే కమ్మని కబుర్లు వడ్డించారు.  తీపి కబురు చెప్పారు. 
రాష్ట్రంలో ఒకేసారి తె91,142 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాదు, తెలంగాణలో 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చేస్తున్నట్లు అసెంబ్లీలో వెల్లడించారు. ఇందులో ఎంత నిజం వుందో, విధివిదానాలు వస్తే కానీ  తెలియదు. ఉద్యమంలో ప్రాణ త్యాగం చేసిన, 1200 యువకుల కుటుంబాలనే ముఖ్యమంత్రి మోసం చేశారని, ఇస్తాననన్ నష్ట పరిహారం సగం కుటుంబాలకు కూడా చేరలేదని ప్రతిపక్ష పార్టీలు గుర్తు చేస్తున్నాయి. అలాగే, ముఖ్యమంత్రి  ఉద్యోగ వయో పరిమితిని పెంచారు. విద్యాశాఖలో 25 నుంచి 30 వేల వరకు పోస్టులు, కొత్త జిల్లాలు, జోన్ల ప్రకారం ఉద్యోగాల భర్తీ చేస్తామని కేసీఆర్ తెలిపారు. 

అయితే, ప్రతిపక్ష పార్టీలు, గతంలోనూ ముఖ్యమంత్రి ఇదే శాసన సభ వేదిక నుంచి ఇంతకంటే, ‘మహా’ తీపి కబుర్లు చాలానే చెప్పారని గుర్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి మళ్ళీ మరోసారి, మాటల గారడీతో  నిరుద్యోగులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే కేసీఆర్’ అయినా ఇంకొకరు అయినా, అందరినీ అన్ని వేళలా మోసం చేయడం అయ్యే పని కాదని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీల నాయకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి, ప్రకటన, పీకే (ప్రశాంత్ కిశోర్) రాజకీయ గారడీలో భాగమని, విద్యార్ధులు, యువకులు నమ్మేలా లేదని ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అలాగే, ముఖ్యమంత్రి చేసిన ప్రకటన టీపీసీసీ చీఫ్, పదే పదేచేపుతున్న విధంగా, ముందస్తు ఎన్నికలకు మరో సంకేతంగా కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు.  

అదలా ఉంటే, ముఖ్యమంత్రి ఉద్యోగ నియామకాల ప్రకటనకు ఉపోద్ఘాతంగా నీళ్ళు, నిధులకు సంబంధించి అర్థ సత్యాలు, అసత్యాలతో సభను తప్పుదారి పట్టించారని, విపక్షాలు విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి జలాలకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో, ఆంధ్రా పాలకులు అన్యాయం చేశారని, అందుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వంత పాడరని ముఖ్యమంత్రి చేసిన ఆరోపణను కాంగ్రెస్ నాయకులు తప్పు పడుతున్నారు. ముఖ్యమంత్రి, కేసీఆర్ ఇంజనీరింగ్ నిపుణుల సలహాలను పక్కన పెట్టి, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టారని, విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పలేదని, ఇప్పుడు ప్రాజెక్ట్ నిర్వహణ వ్యయం తడిసి మోపిడయిందని, దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని అంటున్నారు. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం వలన ఆంధ్రా కాంట్రాక్టర్లకు మాత్రమే ప్రయోజనం జరిగిందన్న తమ  ప్రధాన ఆరోపణకు ముఖ్యమంత్రి సమాధానం దాట వేశారని విపక్షాలు తప్పు పడుతున్నాయి. 

అలాగే, నిధుల విషయంలోనూ  ముఖ్యమంత్రి సభను తప్పుదోవ పట్టించారని, ధనిక రాష్ట్రం ఇప్పుడు సకాలంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చిందో, అప్పుల ఊబిలో ఎందుకు కూరుకు పోయిందో చెప్పాలని ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. మరో వంక ముఖ్యమత్రి ప్రకటన ఉహించేదనని, అయినా నమ్మేలా లేదని నిరుద్యోగులు  కూడా పెదవి విరుస్తున్నారు.

By
en-us Political News

  
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.