ఎస్ఐఆర్‌పై కాంగ్రెస్ జూమ్ సమావేశం

Publish Date:Jun 14, 2026

Advertisement

 

ఓటర్ మ్యాపింగ్, ఓటర్ల జాబితా పరిశీలన, బీఎల్ఏల బాధ్యతలపై కాంగ్రెస్ నాయకత్వం విస్తృతంగా చర్చించింది. ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జూమ్ సమావేశాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.

మూడు పార్లమెంట్ నియోజకవర్గాలను ఒక యూనిట్‌గా తీసుకుని అరగంట చొప్పున మొత్తం ఆరు జూమ్ సమావేశాలు నిర్వహించారు. ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ, బీఎల్ఏలు చేపట్టాల్సిన చర్యలు, బీఎల్‌ఓల పనితీరుపై నిఘా, ఓటర్ల జాబితాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నాయకత్వం దిశానిర్దేశం చేసింది.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎంత శాతం ఓటర్ మ్యాపింగ్ పూర్తైందనే అంశాన్ని సమీక్షించారు. ఇంకా మ్యాపింగ్‌లో చేరని, ఓటు హక్కు కోల్పోయిన అర్హులను గుర్తించి వారికి తిరిగి ఓటు హక్కు కల్పించే విధానంపై వివరించారు.

ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ, ఎన్నికల కమిషన్ కలిసి ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు. సీఈఆర్ పేరుతో ఓట్ల పరిశీలన చేపట్టి కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.

తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని, నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీఎల్ఏలు ఓటర్ మ్యాపింగ్‌ను లోతుగా పరిశీలించి ప్రతి అర్హ ఓటును కాపాడాలని పిలుపునిచ్చారు. ఏదైనా ఓటు తొలగింపునకు గురైతే వెంటనే ఆధారాలతో తిరిగి దరఖాస్తు చేసి పునరుద్ధరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రానున్న ఎన్నికల దృష్ట్యా ప్రతి ఓటు కీలకమని, ఒక్క ఓటు కూడా కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నాయకత్వం స్పష్టం చేసింది.

ఈ జూమ్ సమావేశాలకు గంప వేణుగోపాల్ కోఆర్డినేటర్‌గా వ్యవహరించగా, ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన అంశాలను టీపీసీసీ ఎలెక్షన్ కమిషన్ చైర్మన్ రాజేష్ వివరించారు.

ఇప్పటివరకు సుమారు 90 శాతం బీఎల్ఏ శిక్షణ కార్యక్రమాలు పూర్తయ్యాయని తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుంచి బీఎల్ఏ-2 ప్రతినిధులు ఇంటింటికీ వెళ్లి క్షేత్రస్థాయిలో ఓటర్ ధృవీకరణ కార్యక్రమాలు చేపట్టనున్నారు.

ప్రతి 10 బూత్‌లకు ఒక సూపర్‌వైజర్‌ను, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక కోఆర్డినేటర్‌ను నియమిస్తూ, ఏఈఆర్‌ఓ, ఈఆర్‌ఓలతో సమన్వయం ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రి పొన్నం ప్రభాకర్, ట్రైనింగ్ సెల్ చైర్మన్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, వివిధ పార్లమెంట్ నియోజకవర్గాల డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

By
en-us Political News

  
సీఐ వేధింపులతో మరోకరు బలి అయ్యారు...
అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం కొత్తమురుముళ్ల గ్రామంలో సంచలనం సృష్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి ఫలాలు పేద, మధ్య తరగతి ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి కోల్‌కతా హైకోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలంది.
అమెరికాలోని సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతం న్యూయార్క్ సిటీ సెంట్రల్ పార్క్‌లో ఒక అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరియు అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతూ మద్యం రవాణా కుంభకోణం కేసులో మరో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది.
మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మరోసారి ఊహించని మలుపు తిరిగింది.
తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటూనే ఉంటుంది.
బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్‌లో రెండు, విశాఖపట్నం తీరంలో రెండు చొప్పున మొత్తం నాలుగు బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల పర్యాటక రంగానికి కొత్త ఊపు రావడమే కాకుండా, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని విశ్వసిస్తోంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) మరియు మ్యూచువల్ ఫండ్స్ (SIP)లలో నెలకు ₹12,500 చొప్పున 30 ఏళ్లు పెట్టుబడి పెడితే ఏ పథకం ద్వారా ఎంత ఎక్కువ లాభం వస్తుందో, ద్రవ్యోల్బణం ప్రభావం ఎలా ఉంటుందో పూర్తి గణాంకాలతో తెలుసుకోండి.
తెలంగాణ రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న కోడి చెరువు భూములను పవన్ కల్యాణ్ అక్రమంగా ఆక్రమించారని, స్థానిక భూ రికార్డులను కూడా తారుమారు చేశారంటూ ఆన్‌లైన్ వేదికల్లో ప్రచారం జరిగింది. వైసీపీ, తెలంగాణ రక్షణ సమితి అధినేత్రి కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణల ఆధారంగా ఈ ప్రచారం ఊపందుకుంది.
సరికొత్త 2027 పోర్షే టైకాన్ (Porsche Taycan) ఈవీ అప్‌డేట్స్ వచ్చేశాయి. టెస్లా తరహా NACS ఛార్జింగ్ పోర్ట్, డ్రైవింగ్ కిక్ ఇచ్చే 8 స్పీడ్ వర్చువల్ E Shift గేర్లు, 105 kWh భారీ బ్యాటరీ మరియు AI వాయిస్ కంట్రోల్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ కారు అదరగొడుతోంది. ధర, పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
విండోస్ మరియు లైనక్స్ సిస్టమ్స్‌లో మైక్రోసాఫ్ట్ 2011 సెక్యూర్ బూట్ కీస్ గడువు ముగుస్తోంది. జూన్ 2026 డెడ్‌లైన్ లోపు మీ కంప్యూటర్ మదర్‌బోర్డ్ సెక్యూరిటీని ఎలా అప్‌డేట్ చేసుకోవాలో ఇక్కడ క్లియర్ గైడ్ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.