తమిళనాడు.. బీహార్.. కాంగ్రెస్ పొత్తులు పెటాకులేనా?

Publish Date:Oct 6, 2025

Advertisement

సంకీర్ణ ప్రభుత్వాలను నడిపిన అనుభవం ఉన్నా.. కాంగ్రెస్ పార్టీకి పొత్తు ధర్మం పాటించడం, మిత్రులను కాపాడుకోవడం అన్నది  ఇప్పటికీ వంటపట్టలేదు. భాగస్వామ్య పార్టీలకు ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తూ పొత్తులు విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు చేజేతులా సృష్టించుకుంటోంది. బీహార్ లో ఆర్జేడీతోనూ, తమిళనాడులో అధికార డీఎంకేతోనూ ఇప్పుడు కాంగ్రెస్ బంధం పుటుక్కున తెగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితికి కాంగ్రెస్సే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముందుగా తమిళనాడు విషయం తీసుకుంటే..  ఆ రాష్ట్రంలో రాజకీయ నాయకుడి అవతారం ఎత్తిన సినీ నటుడు విజయ్ ను దగ్గర చేసుకునేందుకు కాంగ్రెస్ చేస్తున్నవిన్యాసాలు, ప్రయత్నాలు అధికార డీఎంకేకు రుచించడం లేదు. విషయమేంటంటే.

కరూర్ తొక్కిసలాట ఘటన తరువాత టీవీకే అధ్యక్షుడు విజయ్ కు రాజకీయంగా ఒకింత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఆయన స్టార్ డమ్ ను ఆ ఘటన మసకబార్చిందనడంలో సందేహం లేదు. అయితే ఆ సంఘటన తరువాత విజయ్ కు సానుభూతి పెరుగుతుందన్న అంచనాతో కాంగ్రెస్ పార్టీ విజయ్ కుమద్దతుగా ప్రకటనలు గుప్పించడం ఆరంభించింది. కరూర్ తొక్కిసలాట ఘటన తరువాత కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ విజయ్ కు ఫోన్ చేసి మద్దతు పలికారన్న ప్రచారం ఉధృతంగా సాగుతోంది. దీనిపై డీఎంకేలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.  

వాస్తవానికి విజయ్ తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకే పార్టీలు తమకు రాజకీయ శత్రువులు అని విజయ్ గతంలోనే ప్రకటించారు. బీజేపీ పట్ల ఒకింత సాఫ్ట్ కార్నర్ చూపుతూ కాంగ్రెస్, డీఎంకేలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.  అయితే  కరూర్ తొక్కిసలాట ఘటనలో  టీవీకే అధినేత విజయ్ తప్పిదాన్ని ప్రజలకు వివరిస్తూ ఆయనను ఇరుకున పెట్టే వ్యూహాన్ని డీఎంకే అమలు చేస్తున్నది. అదే సమయంలో కాంగ్రెస్ విజయ్ పట్ల సానుభూతి వ్యక్తం చేయడం సహజంగానే డీఎంకేకు ఇబ్బందికరంగా మారింది. తమిళనాట డీఎంకేను పక్కన పెట్టి విజయ్ తో పొత్తు కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా కాంగ్రెస్ తీరు ఉంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న నేపథ్యంలో ఈ అనుమానాలు, విజయ్ పట్ల కాంగ్రెస్ సానుభూతి వ్యక్తం చేస్తూ అనుకూల ప్రకటేనలు చేయడం డీఎంకే, కాంగ్రెస్ కూటమి కొనసాగింపునకు ప్రతిబంధకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు.   

ఇక వచ్చే నెలలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలలోనూ కాంగ్రెస్ తీరు వల్ల అక్కడ మహాఘట్ బంధన్ చీలికలు పేలికలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. కూటమి మధ్య సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్న తరుణంలో  కాంగ్రెస్ తీరు వల్ల పొత్తు పెటాకులయ్యే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. ఇప్పటికే ఆర్జేడీ కీలక నేత, ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్.. బీహార్ లో పొత్తుపొసగకుంటే.. ఆర్జేడీ అన్ని స్థానాలలోనూ అభ్యర్థులను నిలబెడుతుందన్న హెచ్చరిక చేశారు. ఈ పరిస్థితి రావడానికి కారణమేంటన్న ప్రశ్నకు పరిశీలకులు ఓట్ అధికార్ యాత్ర తరువాత కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరే ఇందుకు కారణమంటున్నారు.  ఓటర్ అధికార్  యాత్ర రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ ను పెంచేసిందన్న అంచనాతో  కాంగ్రెస్ సీట్ల సంఖ్య విషయంలోనూ,  ఎంపికలోనూ చేస్తున్న ఓవర్ యాక్షనే తేజస్వి ప్రసాద్ హెచ్చరికకు కారణంటున్నారు.  కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ సిట్టింగ్ స్థానాలను కోరడంతో ఆర్జేడీలో అసంతృప్తి భగ్గుమని అవసరమైతే పొత్తే లేకుండా రంగంలోకి దిగాలన్న ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.  
 

By
en-us Political News

  
జూబ్లీ హి ల్స్ ఉప ఎన్నికలో గెలుపొందిన నవీన్ యాదవ్ ను రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ నవీన్ యాదవ్ ను అభినందించారు.
తండ్రి క్రీయాశీల రాజకీయాలకు దూరమైనప్పటి నుంచీ పార్టీ వ్యవహారాలన్నీ తానై నడిపిస్తున్న కేసీఆర్ ఆ విషయంలో విఫలమయ్యారనే చెప్పాలి. జూబ్లీ ఉప ఎన్నిక ఓటమి ద్వారా కేటీఆర్ వరుసగా మూడు ఎన్నికలలో పార్టీని పరాజయం దిశగా సక్సెస్ ఫుల్ గా నడిపించారు.
2023 ఓటమి తరువాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాదాపుగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. పార్టీ వ్యవహారాలన్నీ ఆయన కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావే ముందుండి నడిపిస్తున్నారు. అయితే జూబ్లీ ఉప ఎన్నికలో మాత్రం స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ముందుగా కేసీఆర్ పేరు కూడా ఉంది. దీంతో పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జూబ్లీ ఉప ఎన్నిక ప్రచార సారథ్యం కేసీఆర్ చేపడతారని అంతా భావించారు.
గత అసెంబ్లీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ విజయం వెనుక ఉన్న నిర్ణయాత్మక శక్తి తెలుగుదేశం క్యాడరే అని అప్పట్లో పరిశీలకులు సోదాహరణంగా, గణాంకాలతో సహా వివరించారు. ఇప్పుడు జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్ కు తెలుగుదేశం క్యాడర్ అండగా నిలవడం వల్లనే ఆ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో సునాయాస విజయం సాధించారని అంటున్నారు.
అనిల్ చోఖ్రా ముంబై కేంద్రంగా బినామీల పేర్లతో నాలుగు డొల్ల కంపెనీలను సృష్టించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది.
బీహార్ లోని చిరాగ్ పాశ్వాన్ విజయం సైతం సైతం ప‌వ‌న్ హండ్రడ్ పర్సంట్ స్ట్రైక్ రేట్ తోనే పోలుస్తున్నారు.
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి విజయభేరి మోగించింది.
బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వన్ లోక్ జ‌న‌శ‌క్తి పార్టీ దూసుకెళ్తుంది.
2014 ఎన్నికలలో కేంద్రంలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడానికీ, అలాగే 2019లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికార పగ్గాలు చేపట్టడానికి ప్రశాంత్ కిశోర్ వ్యూహాలే కారణం.
ప్రధాని నరేంద్ర మోడీ వికసిత భారత్ దార్శనికతకు, ఎన్డీయే ప్రగతిశీల పాలనకు ప్రజలు మరోసారి మద్దతు పలికారని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆయన పోస్టు చేశారు.
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయంపై బీజేపీ సైటైర్లు సంధించింది.
జూబ్లీలో బీఆర్ఎస్ ఓటమిపై స్పందించిన కేసీఆర్ కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు, అక్రమ మార్గాలకు, అధికార దుర్వినియోగానికీ పాల్పడ్డారనీ, ఆ కారణంగానే కాంగ్రెస్ పార్టీ గెలిచిందనీ అన్నారు.
ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న ఆధిక్యతల ప్రకారం ఎన్డీయే కూటమి అభ్యర్థులు 191 స్థానాలలో ముందంజలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ 49 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత కనబరుస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.