కాంగ్రెస్‌కు మ‌రో పరీక్ష!.. చేతికి గాయాలు...

Publish Date:Apr 29, 2022

Advertisement

అసెంబ్లీ ఎన్నికలకు ముందు, పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన అంతర్గత సంక్షోభం ఫలితంగా, కాంగ్రెస్ పార్టీ ఒక కీలక రాష్ట్రాన్ని చేజార్చుకుంది. అప్పటి ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర సింగ్, పార్టీ సీనియర్ నాయకుకు, మాజీ మంత్రి నవజ్యోతి సింగ్ సిద్దూ మధ్యతలెత్తిన విబేధాలు, చిలికి చిలికి గాలివానగా మారి పార్టీ ప్రతిష్టను పడగొట్టింది. చివరకు సిద్దూ కోరిన విధంగా ముఖ్యమంత్రిని మార్చినా, సిద్దూకే పీసీసీ పగ్గాలు అప్పగించినా, ఎన్నికలో హస్తం పార్టీకి ఓటమి తప్పలేదు. 

ఇప్పుడు రాజస్థాన్’లో మళ్ళీ అదే పరిస్థితి పునరావృతం అవుతోందా? అంటే అవుననే అంటున్నారు, విశ్లేషకులు. నిజానికి, విశ్లేషకులు అనడం కాదు, మూడున్నరేళ్ళుగా అడపా తడ్ఫపా అసమ్మతి రాగం వినిపిస్తున్న, కేంద్ర మాజీ మంత్రి, మాజీ పీసీసీ చీఫ్ సచిన్ పైలట్’ కూడా అధిష్టానానికి అదే హెచ్చరిక చేస్తున్నారు. తక్షణమే రాజస్థాన్ ముఖ్యమంత్రి పగ్గాలు తనకు అప్పగించాలని లేదంటే రాజస్థాన్’లోనూ పంజాబ్ పరాజయం, పరాభవం తప్పవని నేరుగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకే లేఖ రాసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. నిజానికి, చాలా కాలంగా సచిన్ పైలట్’ అధిష్టానంపై ఆగ్రహంతో రగిలి పోతున్నారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ చీఫ్’గా పగలు రాత్రి కష్టపడి పార్టీని తాను గెలిపిస్తే, ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి పదవి అశోక్ గేహ్లోట్’కు కట్ట బెట్టారని, ఆయన అనేక సందర్భాలో బహిరంగంగానే తమ ఆవేదన, ఆగ్రహం వ్యక్త పరిచారు. ఒక దశలో ఆయన తమ వర్గం ఎమ్మెల్ల్యేలతో ఢిల్లీలో మకాం చేసి తాడో పేడో తేల్చుకుంటానని ప్రకటించారు. అలాగే, ఒక దశలో ఆయన బీజేపీలో చేరుతున్నారనే పుకార్లు వినవచ్చాయి. అయితే పైలెట్’ పార్టీని వదలలేదు కానీ, ముఖ్యమంత్రి పీఠం కోసం పోరాటం మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. 

ఇదే క్రమంలో ఇప్పుడు, అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో, అధిష్టానంపై పైలెట్ వత్తిడి పెంచుతున్నారు. రాజస్థాన్‌లో ఎన్నికలకు పట్టుమని 18 నెలల సమయం మాత్రమే వుంది. ఈ పరిస్థితుల్లో పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే, పంజాబ్’లో చేసిన తప్పు రాజస్థాన్’ లో చేయద్దని, ఎటువంటి జ్యాప్యం లేకుండా తనను  ముఖ్యమంత్రిని చేయాలని, సచిన్ పైలట్ అధిష్ఠానానికి వరసగా వర్తమానం పంపుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి నిత్యం అటు సోనియా, ఇటు రాహుల్, ప్రియాంకలకు సచిన్ పైలెట్ ఏదో ఒక రూపంలో తమ డిమాండ్’ను గుర్తు చేస్తున్నారు. పంజాబ్’లో చివరి రోజుల్లో చరణ్‌జిత్ సింగ్ ఛన్నీని ముఖ్యమంత్రిగా నియమించడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని, రాజస్థాన్‌లో కూడా అదే జరిగే అవకాశం ఉందని సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలకు సచిన్ పైలట్ సూచించినట్టు సమాచారం.

కానీ, కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్ నాయకుడైన అశోక్ గెహ్లాట్ తానేంటో ఇప్పటికే నిరూపించుకున్నారు.పైలెట్ పప్పులు తమ వద్ద ఉడకవని ఇప్పటికే అనేక సందర్భాలలో నిరుపించుకున్నారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఆయనకు ఉందని నిరుపించుకున్న ఆయన పైలెట్’కు ఎక్కడికక్కడ చెక్ పెడుతూ వచ్చారు. అధిష్ఠానం ఆదేశించినా, పైలెట్ వర్గాన్ని మంత్రి వర్గంలో చేర్చుకునే ముహూర్తాన్ని పలుమార్లు వాయిదా వేసి చివరకు ఏదో అయింది అంటే అయింది అన్నట్లుగా కానిచ్చారు. 

మరోవంక పార్టీ అధ్యక్షురాలు  సోనియా గాంధీ నమ్మకాన్ని కూడా ఆయన నిలబెట్టుకున్నారు.రెండు రోజుల కిందట ఆయన మీడియాతో మాట్లాడుతూ..నా రాజీనామా ఎప్పుడూ సోనియా గాంధీ వద్దే ఉంటుందని వ్యాఖ్యానించారు. నిజానికి, గేహ్లోట్ పార్టీలో సీనియర్ నాయకుడు మాత్రమే కాదు, సోనియా గాంధి వీరవిధేయుల్లో ఒకరు. ఒక దశలో జీ 23 నాయకులు పట్టుపడితే పార్టీ పగ్గాలు తాత్కాలికంగానే అయినా గేహ్లోట్’కు అప్పగించాలని సోనియా గాంధీ అలోచన చేసినట్లు వార్తలొచ్చాయి. అంటే, గేహ్లోట్ పవర్ ఏమిటో వేరే చెప్పనక్కర లేదు. మరో వంక సచిన్ పైలట్‌’  తనకు ముఖ్యమంత్రి పదవి తప్ప మరేది వద్దని, అది ఇస్తారో లేదో తేల్చి చెప్పాలని, రాహుల్, ప్రియాంకల వద్ద పట్టుపడుతున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తామన్నా వద్దన్నారు.రాజస్థాన్ పీసీసీ పగ్గాలు ఇస్తామన్నా అది నాకేమన్నా కొత్తనా, ఐదేళ్లు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి, రాజస్థాన్‌లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది నేనని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పుదు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అనేది ఆసక్తికరంగా మారింది.

By
en-us Political News

  
మెగా డీఎస్సీ   ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. , మెగా డీఎస్సీ పట్ల యువతలో బై అండ్ లార్జ్ హర్షం వ్యక్తం అవుతోంది. నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉందన్న భావనే సర్వత్రా గట్టిగా వ్యక్త మౌతోంది. డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలకు వ్యతిరేకంగా జగన్ ఖిల్లా అయిన కడపలో యువత రోడ్డెక్కారు.
 ఒంగోలు ఎమ్మెల్యే  దామచర్ల జనార్ధన్‌రావు, మాజీ మంత్రి,   జనసేన   సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి విభేదాలు ఇరు పార్టీల మధ్యా రాజకీయ రచ్చకు కారణమైంది.  దామచర్ల, బాలినేని మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, అలాగే ఆరోపణలు, ప్రత్యారోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.  
యువ రాజకీయనాయకుడిగా గతంలో ఎదుర్కొన్న విమర్శలను పటాపంచలు చేస్తూ, పరిపాలనా విధానాల్లో సాధించిన పరిణతి, స్పష్టమైన వ్యూహాలతో ఆయన తన రాజీకీయ ఇమేజ్‌ను పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ చేసుకున్నారని ఆ కథనం పేర్కొంంది.
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న  స్థానిక  ఎన్నికల్లో  బీజేపీకి  ఏ పార్టీతోనూ  పొత్తులు పెట్టుకునే ఆలోచన  లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.