తెలంగాణలో నెక్ట్స్ సీఎం సీతక్కే?!

Publish Date:May 26, 2023

Advertisement

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎంగా సీతక్కే అవుతారని ఆ పార్టీలో మెజారిటీ భావిస్తోంది. అందుకు తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న పరిస్థితులే కారణమని చెబుతున్నారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది.

ఈ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.  ఈ సారి ఎలాగైనా తెలంగాణలో కేసీఆర్ పాలనకు చెక్ పెట్టి.. కాషాయం జెండా రెపరెపలాడించాలని కేంద్ర పెద్దల మార్గదర్శనంలో... టీ బీజేపీ నేతలూ ఒక ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. అదే విధంగా  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ  సైతం ప్రజల్లోకి నేరుగా దూసుకుపోతోంది. ఆయన అధ్యక్షతన జరుగుతోన్న సభలు, సమావేశాలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్,  ఆయన ఫ్యామిలీపై నేరుగా విమర్శలు గుప్పించ గల సత్తా తెలంగాణలో ఎవరికైనా ఉందా? అంటే అది రేవంత్ ఒక్కరే అన్న భావన ప్రజలలో బలంగా వ్యక్తమౌతోంది.

 అదీ కాకుండా  రాష్ట్ర ఆవిర్భావం తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ తీసికట్లు అన్నట్లుగా మారిపోయింది. అలాంటి పార్టీ ఇప్పుడు జవసత్వాలు పుంజుకుని  బీఆర్ఎస్, బీజేపీలకు దీటుగా పోటీగా నిలిచిందంటే అందుకు కారణం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వమేనని పార్టీ అధిష్ఠానం సైతం నమ్ముతోంది. వాస్తవానికి   తెలంగాణ తెచ్చింది  తానేనని కేసీఆర్ చెప్పుకుంటున్నా.. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది మాత్రం అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ  అన్న విషయాన్ని ప్రజలకు చేరువ చేయలేకపోవడమే అప్పటి పార్టీ రాష్ట్ర నాయకత్వం తప్పిదమని అప్పట్లోనే కాదు ఇప్పుడూ విమర్శలు ఉన్నాయి.  రాష్ట్రంలో కాంగ్రెస్ అన్ని విధాలుగా దిగజారిపోయిన కాంగ్రెస్ ను తెలుగుదేశం పార్టీ వీడి వచ్చిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా ప్రయత్నాలు సాగించారు. చాలా వరకూ సక్సెస్ అయ్యారు కూడా.

అయితే వేరే పార్టీ నుంచి వ్యక్తికి పీసీసీ పగ్గాలు కట్టబెట్టడాన్ని జీర్ణించుకోలేని ‘సీనియర్లు’ ఆయనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఒక దశలో ఆయన రాజీనామాకు కూడా సిద్ధమయ్యారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే అధిష్ఠానం రేవంత్ కు అనుకూలంగా నిలబడటంతో రేవంత్ నిలదొక్కుకున్నారు. పార్టీని నిలబెట్టారు. ఈ క్రమంలోనే కర్నాటక ఫలితాల తరువాత ఒక్క సారిగా కాంగ్రెస్ పార్టీలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. రేవంత్ దూకుడును నియంత్రించుకున్నారు. సీనియర్లు ధిక్కారాన్ని తగ్గించుకున్నారు. ముందు రాష్ట్రంలో అధికారం ఆ తరువాతే అధికారం, పెత్తనం గురించి ఆలోచిద్దాం అన్న ధోరణి కనబరుస్తున్నారు.

కర్నాటకలో డీకే , సిద్ధూ ఐక్యంగా పార్టీని విజయపథంలో నడిపించిన తీరును అనుకరించాలని నిర్ణయించుకున్నారు.  ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే నేత ఎవరన్న దానిపై పార్టీలో జరిగిన చర్చలో సీతక్క పేరు తెరమీదకు వచ్చిందని ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు ఎమ్మెల్యే సీతక్క  మావోయిస్టుగా ఉన్నా  అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి హయాంలో జన జీవన స్రవంతిలోకి అడుగుపెట్టారు. అనంతరం  తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

రాష్ట్ర విభజన.. అనంతరం చోటు చేసుకొన్న వరుస పరిణామాల నేపథ్యంలో తెలంగాణలోని పలువురు టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ గూటికి చేరారు.   ఆ కొద్ది రోజులకే రేవంత్‌కి పీసీసీ చీఫ్ కట్టబెట్టడంపై అప్పటికే పార్టీలోని సీనియర్లు, సూపర్ సీనియర్లు.. అంతా అలిగి  ధిక్కార స్వరం వినిపించిన నేపథ్యంలో సీతక్క, వేం నరేంద్రరెడ్డి తదితరులు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. కాంగ్రెస్ లోనే కొనసాగుతూ రేవంత్ నాయకత్వానికి అండదండగా మద్దతుగా నడుస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరినా రేవంత్ విషయంలో వ్యక్తమైన వ్యతిరేకత కాంగ్రెస్ పాత కాపుల నుంచి సీతక్కకు ఎదురు కాలేదు. ఎందుకంటే  గతంలో ఆమె మావోయిస్టుగా ఉన్నప్పడూ.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సైతం ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారు.

అలాగే కరోనా సమయంలో ఆమె ప్రజలమధ్యే నిత్యం ఉంటూ.. వారి కోసం అహర్నిశలు కష్టపడ్డారు....  ఎవరూ బయటకు అడుగుపెట్టేందుకు కూడా సాహసం చేయని ఆ సమయంలో నెత్తిన ఆహార పదార్థాలు, ఔషదాలు గంప పెట్టుకుని కొండల్లో కోనల్లో ఉంటున్న గిరిజనులకు అందజేయడానికి మైళ్లకు మైళ్లు ఒక్కర్తే నడిచి వెళ్లారు. ఇప్పుడూ ఆమె జనం కష్ట నష్టాలకు వెంటనే స్పందించి ఆదుకోవడానికి ముందుంటారు. గత ఏడాది సంభవించిన భారీ వరదల సమయంలో వరద బాధితులను ఆదుకోవడానికి ఎంతో సాహసోపేతంగా పడవపై వరద నీటిలో బాధితుల వద్దకు వెళ్లిన సందర్భాలున్నాయి.  అంతే కాదు వాదాలకు, వివాదాలతో సంబంధం లేకుండా జనం మధ్యే ఉండే ఆమె పార్టీలో అందరికీ అభిమానపాత్రురాలే అంటారు. ఈ నేపథ్యంలోనే  2023 ఏడాది చివర జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటి.. అత్యధిక స్థానాలను గెలుచుకొంటే.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా సీతక్క పేరు పరిశీలించే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. 

By
en-us Political News

  
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు ఇప్పుడు హస్తిన పర్యటనలో పార్లమెంటులో ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీ కూడగట్టడం కోసం.. వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు ఆయన హస్తినకేగుతున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
మాస్కుల కొరతపై మాట్లాడిన కొద్ది రోజులకే విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రహదారిపై డాక్టర్ సుధాకర్‌ను పోలీసులుఆయనను అదుపులోనికి తీసుకుని, చొక్కా లేకుండా ఉన్న ఆయన చేతులను వెనక్కి విరిచి కట్టడం, వీధిలో ఈడ్చుకెళ్లి ఆటోలో పడేయడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి జాతీయ స్థాయిలో నిరసనలకు దారితీశాయి.
సదరు వివాదాస్పద ఏఈఈ స్థాయి అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్దుబాట్లు, పోస్టింగ్‌లలో ఆయనకు కీలక స్థానం దక్కింది. ప్రస్తుతం ఆయన టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈఈ హోదాలోనే అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.