తాడేపల్లి ప్యాలెస్ డొంకలు కదులుతున్నాయా?

Publish Date:May 26, 2023

Advertisement

వివేకా హత్య కేసులో తాడేపల్లి ప్యాలెస్ డొంకలు కదులుతున్నాయా? అంటే సీబీఐ శుక్రవారం(మే26) తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన అడిషనల్ కౌంటర్ అఫిడవిట్ ఔననే అంటోంది. అవినాష్ సీబీఐ విచారణకు సహకరించకపోవడం, అరెస్టును తప్పించుకోవడానికి ఉన్న దారులన్నీ ఉపయోగించుకుంటూ.. చివరకు ఆ దారులన్నీ మూసుకుపోయిన తరువాత అనుచరులు, పోలీసులను అడ్డుపెట్టుకుని కర్నూలు విశ్వ భారతి ఆస్పత్రిలో షెల్టర్ పొంది.. ముందస్తు బెయిలు విచారణ వేకేషన్ బెంచ్ చేపట్టేలా ఆదేశాలివ్వాలంటూ సుప్రీంను ఆశ్రయించడం తోలిపిందే. ఒక ఎంపి, అదీ అధికార పార్టీ ఎంపీ కేంద్ర దర్యాప్తు సంస్థను ఇలా ముప్పు తిప్పలు పెట్టడమేమిటన్న ఆనుమానాలు అందరిలో వ్యక్తమయ్యాయి. చివరకు తెలంగాణ హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో ఈ అనుమానాలకు సమాధానాలు దొరికాయి. ఆ కౌంటర్ అఫిడవిట్ లో సీబీఐ జగన్ పేరు ప్రస్తావించింది. వివేకా హత్య గురించి జగన్ కు ప్రపంచానికి తెలియడం కంటే ముందే తెలుసునన్నది తమ అనుమానమని, ఆ విషయాన్ని అవినాష్ రెడ్డే ఆయనకు తెలిపాడని సీబీఐ పేర్కొంది. వివేకా హత్యను మందుగా చూసినట్లుగా చెబుతున్న ఎంవీ కృష్ణారెడ్డి ఆ విషయాన్ని బయటకు వెళ్లడించడానికి ముందే..   హత్య జరిగిందన్న విషయాన్ని అవినాష్ జగన్ కు చెప్పారా అనేది దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ తన అడిషనల్ కౌంటర్ అఫిడవిట్ లో పేర్కొంది.   శుక్రవారం సీబీఐ తప వాదనలు వినిపించలేదు. అవినాష్ రెడ్డి, సునీత తరపు లాయర్లు వాదనల అనంతరం కోర్టు అవినాష్ ముందస్తు బెయిలు విచారణను శనివారం (మే 27)కు వాయిదా వేసింది. దీంతో శనివారం(మే27) సీబీఐ తరపు లాయర్లు వాదనలు వినిపించనున్నారు. ఈ సందర్భంగా వివేకా కేసులో జగన్ అంశంపై మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే వివేకా హత్య జరిగిన రోజు తెల్లవారుజామున నాలుగున్నర గంటలకే జగన్  హత్య గురించి.. తనతో పాటు సమావేశంలో ఉన్న వారికి చెప్పారన్న ప్రచారం జరిగింది. ఆ నలుగురిలో ఒకరైన మాజీ సీఎస్, ప్రభుత్వ సలహాదారు కల్లాం అజేయరెడ్డి ఇటీవల మీడియా సమావేశం పెట్టారు. తాను సీబీఐకి వాంగ్మూలం ఇచ్చానని వెల్లడించారు కూడా. అలాగే జగనే తమకు వివేకానందరెడ్డి చనిపోయారని చెప్పారని..అయితే గుండెపోటా కాదా అన్నది మాత్రం చెప్పలేదన్నారు. మరో వైపు ఉదయమే వివేకా హత్య గురించి బయట ప్రపంచానికి తెలియక ముందే అవినాష్ రెడ్డి .. జగన్‌, భారతి పీఏలకు ఫోన్లు చేసి.. మాట్లాడారని గుర్తించిన సీబీఐ గుర్తించి వారినీ విచారించింది. ప్రశ్నించింది. దీంతో శనివారం (మే 28) తెలంగాణ హైకోర్టులో అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్ విచారణలో మరిన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.

ఇలా ఉండగా  సీఎం జగన్మోహన్ రెడ్డి  ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇక  అవినాష్ రెడ్డి తన తల్లిని హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించి అక్కడే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి ముందు సీన్ హైదరాబాద్ ఆస్పత్రి ముందు రిపీట్ అవుతుందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి.  ఇందుకూ కారణాలు లేకపోలేదు.

  వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా కడప ఎంపీ  అవినాష్ రెడ్డికి నోటీసులు ఇస్తే చాలు ఏపీ సీఎం జగన్ తన పర్యటనలను, కార్యక్రమాలను రద్దు చేసేసుకుంటారు. గతంలో   మూడుసార్లు అదే జరిగింది.  అందులో రెండు సార్లు ఆయన హుటాహుటిన హస్తిన బయలుదేరి వెళ్లారు. అలా వెళ్లిన ప్రతి సారీ సీబీఐ దర్యాప్తులో వేగం మందగించింది.  ఇక ఈ నెల 19 నుంచి అవినాష్ సీబీఐతో టామ్ అండ్ జెర్రీ ఆట ఆడుతున్నారు. మే 19న ఆయన సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉండగా తల్లి అనారోగ్యం కారణంతో విచారణకు డుమ్మా కొట్టారు. సరే మే 22న విచారణకు రావాలని సీబీఐ మరో సారి నోటీసులు ఇస్తే వాటినీ ఖాతరు చేయలేదు. సుప్రీం ను ఆశ్రయించి హైకోర్టులో పెండింగ్ లో ఉన్న తన ముందస్తు బెయిలు పిటిషన్ విచారణ పూర్తయ్యే వరకూ సీబీఐ అరెస్టు చేయకుండా ఆదేశించాలని కోరారు.

అరెస్టు చేయకుండా ఆదేశాలు జారీ చేయకుండానే.. ముందస్తు బెయిలు పిటిషన్ విచారించి ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా సుప్రీం కోర్టు తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఈ లోగా అవినాష్ సీబీఐకు రాసిన లేఖలో తల్లి అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేననీ, మే 27 తరువాత ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానంటూ లేఖ రాశారు. ఆ లేఖే మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ఎందుకంటే జగన్ ముందుగా శుక్రవారం( మే26) నుంచి మూడు రోజుల పాటు హస్తిన పర్యటనలో ఉంటారు. అంటే ఆయన హస్తిన పర్యటనకూ అవినాష్ సీబీఐ విచారణకు హాజరు కాకపోవడానికి లింకు ఉందని పరిశీలకులు గత సంఘటనలను ఉటంకిస్తూ విశ్లేషిస్తున్నారు. జగన్ ఏ కారణాలు చెప్పి హస్తిన వెళ్లినా.. ఆయన పర్యటన లక్ష్యం మాత్రం ఎలాగోలా సీబీఐ అరెస్టు నుంచి అవినాష్ ను బయటపడేయడమేనని పరిశీలకులు అంటున్నారు. ఆ పని  జగన్ చేసుకు వస్తారన్న ఆశతోనే మే 27 వరకూ విచారణకు హాజరు కాలేనని అవినాష్ సీబీఐకి లేఖ రాశారని అంటున్నారు.

తండ్రి భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్టు చేసి ఇంత కాలమైనా ఇప్పటి వరకూ ఆయనకు బెయిలు కోసం కనీసం దరఖాస్తు కూడా చేయని అవినాష్ రెడ్డి, జైలులో ఉన్న తండ్రిని ఒక్కసారి కూడా ములాఖత్ ద్వారా కలవని అవినాష్ రెడ్డి.. తన దాకా వచ్చే సరికి మాత్రం  బెంబేలెత్తిపోతున్నారు. జైలులో ఉన్న అవినాష్ రెడ్డి తండ్రి అస్వస్థతకు గురి కావడంతో ఆయనకు ఉస్మానియాలో చికిత్సకు శుక్రవారం (మే26) తీసుకువచ్చి తిరిగి జైలుకు తరలించారు. ఆ సందర్భంగా కూడా అవినాష్ కనీసం ఆయనకు చూడటానికి ఉస్మానియాకు వెళ్లలేదు. ఇవన్నీ చూస్తుంటే అవినాష్ జగన్ హస్తిన పర్యటనపై చాలా ఆశలు పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కానీ ఇప్పుడు సీబీఐ తన అడిషనల్ కౌంటర్ అఫిడవిట్ లో స్వయంగా తన పేరే ప్రస్తావించడంతో జగన్  అవినాష్ ను కాపాడేందుకు ఢిల్లీ పెద్దల వద్ద ఒక వేళ ఏమైనా ప్రయత్నాలు చేసినా అవి ఫలిస్తాయా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. 

By
en-us Political News

  
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు ఇప్పుడు హస్తిన పర్యటనలో పార్లమెంటులో ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీ కూడగట్టడం కోసం.. వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు ఆయన హస్తినకేగుతున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
మాస్కుల కొరతపై మాట్లాడిన కొద్ది రోజులకే విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రహదారిపై డాక్టర్ సుధాకర్‌ను పోలీసులుఆయనను అదుపులోనికి తీసుకుని, చొక్కా లేకుండా ఉన్న ఆయన చేతులను వెనక్కి విరిచి కట్టడం, వీధిలో ఈడ్చుకెళ్లి ఆటోలో పడేయడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి జాతీయ స్థాయిలో నిరసనలకు దారితీశాయి.
సదరు వివాదాస్పద ఏఈఈ స్థాయి అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్దుబాట్లు, పోస్టింగ్‌లలో ఆయనకు కీలక స్థానం దక్కింది. ప్రస్తుతం ఆయన టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈఈ హోదాలోనే అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.