Publish Date:Nov 18, 2024
వైసీసీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై టెక్కలి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. దువ్వాడ శ్రీనివాస్ కు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. దివ్వెల మాధురితో ఆయన సాన్నిహిత్యం, అనుబంధం కారణంగా ఎపిసోడ్ గత కొన్ని నెలలుగా దువ్వాడ శ్రీనివాస్ పేరు నిత్యం వార్తలలో వినిపిస్తోంది. కనిపిస్తోంది. ఆయన అనుచిత వ్యాఖ్యలపై తాజాగా టెక్కలి పోలీసు స్టేషన్ లో జనసేన నాయకుడు కణితి కిరణ్ కుమార్ ఫిర్యాదు చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆ ఫిర్యాదులో కోరారు. పవన్ కల్యాణ్ పైనా, ఆయన కుటుంబం దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై వరుసగా కేసులు నమోదౌతున్నాయి. నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు. పలువురిని ఇప్పటికే అరెస్టు చేశారు. కోర్టులకు వెళ్లినా కూడా ఊరట లభించడం లేదు. ఇష్ఠారీతిగా నోరు పారేసుకుని శిక్షించవద్దంటూ కోర్టును ఆశ్రయిస్తే ఎలా అని ఏపీ హైకోర్టు కూడా ఇటీవల వ్యాఖ్యానించింది. రామ్ గోపాల్ వర్మ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ కోర్టును ఆశ్రయిస్తే.. తరువాత అవసరమనుకుంటే బెయిలు పిటిషన్ దాఖలు చేసుకోండి, అంతే కానీ అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఉత్తర్వ్యులు జారీ చేయలేమని కోర్టు విస్పష్టంగా చెప్పింది.
అలాగే సోషల్ మీడియా వ్యాఖ్యలపై అరెస్టులను ఆపాలంటూ సీనియర్ జర్నలిస్టు విజయబాబు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగానూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడి, ఇప్పుడు కోర్టును ఆశ్రయించి ఏం లాభం అంటూ చీవాట్లు పెట్టింది. న్యాయమూర్తులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేసింది. దీంతో అధికారం అండతో ఇష్టారీతిగా చెలరేగిపోయిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులకు, వైసీపీ నేతలకు ఇప్పుడు అరెస్టుల భయం వెంటాడుతోంది. ఆ క్రమంలోనే తాజాగా దువ్వాడ శ్రీనివాస్ పై టెక్కలిలో ఫిర్యాదు నమోదైన నేపథ్యంలో ఆయనకు కూడా నేడో రేపో పోలీసులు విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/complaint-regestered-on-duvvada-in-tekkali-39-188563.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!