అంబేడ్కర్ స్ఫూర్తితోనే ప్రజా పాలన... దళిత సంక్షేమమే లక్ష్యం : సీఎం రేవంత్

Publish Date:Apr 14, 2026

Advertisement

 

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాల సాధనే ధ్యేయంగా తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగిస్తూ, దేశాభివృద్ధిలో అంబేడ్కర్ పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు.

 

 

 

భారతదేశానికి మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రెండు కళ్ల వంటి వారని ముఖ్యమంత్రి అభివర్ణించారు. స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ ఎంతటి కీలక పాత్ర పోషించారో, ఆధునిక భారతదేశ నిర్మాణంలో అంబేడ్కర్ అంతే ప్రధాన పాత్ర పోషించారని గుర్తుచేశారు. తెలంగాణ గడ్డపై సామాజిక చైతన్యాన్ని రగిలించిన ప్రజా కవి గద్దర్ సేవలను కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్మరించుకున్నారు.

 

 

 

 

గత ప్రభుత్వ హయాంలో అణగారిన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని రేవంత్ రెడ్డి తీవ్రంగా ఎండగట్టారు. గత పదేళ్ల కేబినెట్‌లో దళితులకు సరైన ప్రాధాన్యత లభించలేదని, కానీ తమ ప్రభుత్వంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలకు కీలక పదవులు కట్టబెట్టామని పేర్కొన్నారు. ఒక దళిత బిడ్డ (భట్టి విక్రమార్క) రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడాన్ని చూసి విపక్షాలు భరించలేకపోతున్నాయని ఆయన విమర్శించారు.

ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు స్పీకర్‌గా లేదా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపడితే ప్రతిపక్షాలకు ఎందుకు అంత కడుపుమంట అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో భట్టి విక్రమార్క సీఎల్పీ నేతగా ఉన్నప్పుడు ఆయన హోదాను తగ్గించేందుకు కుట్రలు జరిగాయని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే డైట్ ఛార్జీలను పెంచామని, విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని వివరించారు.

నిరుద్యోగిత నిర్మూలనపై స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఇప్పటివరకు 67,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ ఉద్యోగాల్లో 87 శాతం పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ వర్గాల వారికే దక్కడం విశేషమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ద్వారా పేద బిడ్డల భవిష్యత్తును మారుస్తామని, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.

మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్రాన్ని నిలదీస్తూ, రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసేందుకు కుట్ర జరుగుతోందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా మరియు రాష్ట్రాల జిఎస్‌డిపి ఆధారంగా హైబ్రిడ్ మోడల్‌లో నియోజకవర్గాల పునర్విభజన  చేపట్టాలని డిమాండ్ చేశారు. గత పదేళ్లలో జరిగిన పాలనా విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు తాము అహర్నిశలు శ్రమిస్తున్నామని తెలిపారు.

ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, విద్యా రంగంలో తీసుకొస్తున్న మార్పుల పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని సీఎం ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం మరిన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటామని, అంబేడ్కర్ ఆశించిన సమసమాజ స్థాపనే లక్ష్యంగా అడుగులు వేస్తామని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.

By
en-us Political News

  
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ప్రాజెక్ట్ 17 సిరీస్‌లో ఆరవ స్టెల్త్ యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి అధికారికంగా నౌకాదళంలో చేరబోతున్నది. విశాఖపట్నం వేదికగా.. ఈ నెల 11న అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని నౌకాదళంలోకి కమిషన్ చేయనున్నారు.
ప్రత్యేకంగా వివాహ ఆహ్వాన పత్రికలు అంటే శుభలేఖలు ముద్రించి, వాటిని బంధువులు, గ్రామస్థులకు పంచి పెళ్లికి రండంటూ ఆహ్వానించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పూజారుల సమక్షంలో మంగళసూత్రం కట్టించడం, తలంబ్రాలు పోయించడం, హారాలు మార్చించడం వంటి అన్ని వివాహ తంతులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.