పరకాలలో కాంగ్రెస్ కు భంగపాటు తప్పదా?
Publish Date:May 22, 2012
Advertisement
పరకాల ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఏర్పాటు చేసిన సిఎం బహిరంగసభ గాలిదుమారం కారణంగా అర్థాంతరంగా ఆగిపోయింది. ఇదీ ఒకందుకు మంచిదేనని, అసలు జనంలేని ఆ సభను చూసి మిగిలిన అభ్యర్థులు దుష్ప్రచారం చేయటానికి అవకాశమే లేకుండా పోయిందని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. గట్టిగా జనాన్ని తీసుకురాలేని స్థితికి కాంగ్రెస్ చేరటానికి సురేఖ కార్యకర్తలను ఆకట్టుకోవటం ఒక కారణమైతే, తెలంగాణా ఉద్యమం ఈ ప్రాంతంలో బలంగా నాతుకుపోవడం మరో కారణంగా వారు తేలుస్తున్నారు. ఈ తెలంగాణా పేరుచెప్పి టి.ఆర్.ఎస్. ఒక పక్క మరోపక్క కార్యకర్తలను ఆకర్షిస్తున్నాయి. ఇక ఉన్నది పెరగకపోయినా తన క్యాడర్ ను అలానే కాపాడుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఇక్కడ శ్రమపడింది. ఈ శ్రమ ఫలితంగా ఆ పార్టీ కొత్తగా పెరగకపోయినా గతంలో ఉన్న ఓట్లను తిరిగి సంపాదించుకోగలమనే ధీమాతో ఉంది. మొత్తమ్మీద వై.ఎస్.ఆర్. కాంగ్రెస్, టిడిపి, టి.ఆర్.ఎస్., బిజెపి ప్రధానంగా ఈ నియోజకవర్గంలోని ఓట్లను చీలుస్తాయి. ఆ నాలుగు పార్టీలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోటీలో ఉన్నందున గెలిచే అభ్యర్థికి వచ్చేది తక్కువ మెజారిటీనే అన్నది అర్థమవుతోంది. కానీ, ఆ నాలుగు పార్టీలు పోటీలో ఉండటం వల్ల కాంగ్రెస్ నాయకులు తమ కార్యకర్తలను తిప్పుకోవటమే ఇక్కడ ఇబ్బందికరంగా మారిందని ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు సిఎం దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది. దీంతో ఈ ఒక్క స్థానాన్ని వదులుకుని మిగిలిన సీమాంధ్రపై ఎక్కువ ద్రుశితి పెట్టాలని నాయకులు నిర్ణయించుకున్నారనీ తెలుస్తోంది. ఏమైనా ఇటీవల కాలంలో సిఎం సీమాంధ్ర వైపు మొగ్గినందున అక్కడేమి ప్రసంగిస్తారన్న అంశంపై ఎదురుచూసిన వారికి మాత్రం నిరాశే మిగిలింది. అందుకనే సిఎం తిరిగి బయలుదేరేటప్పుడు వరంగల్ లో పాత్రికేయులతో మాట్లాడుతూ బిజెపి, టి.ఆర్.ఎస్., జగన్ లపై నిప్పులు చెరిగారు.
http://www.teluguone.com/news/content/cm-kiran-kumar-reddy-parakala-tour-24-14214.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





