బిల్లుకి వ్యతిరేఖంగా తీర్మానం చేసి పంపినట్లయితే

Publish Date:Jan 26, 2014

Advertisement

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణా బిల్లుని తిరస్కరిస్తూ దానిని వెనక్కి త్రిప్పిపంపాలని రూల్.77 క్రింద సభాపతి నాదెండ్ల మనోహర్ కు నోటీసు అందజేశారు. రేపు బిజినస్ అడ్వయిజరీ కమిటీ సమావేశమయ్యి దీనిపై ఒక నిర్ణయం తీసుకొనవచ్చును.

 

ఒకవేళ శాసనసభలో ఈ తీర్మానం ప్రవేశపెట్టి సీమాంధ్ర శాసనసభ్యులందరూ బిల్లును ఏకగ్రీవంగా తిరస్కరించి రాష్ట్రపతికి పంపగలిగినట్లయితే, గతంలోనే కొంతమంది బిల్లుపై సుప్రీం కోర్టులో పిటిషన్లు వేసినందున, ఇప్పుడు ఆయన శాసనసభ అభ్యంతరాలను పట్టించుకోకుండా, సభ చేత తిరస్కరింపబడిన బిల్లుపై ఆమోదముద్ర వేసినట్లయితే, న్యాయపరమయిన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. గనుక బిల్లుపై రాష్ట్ర శాసనసభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలపై కేంద్రాన్నిపూర్తి వివరాలు, సంజాయిషీ కోరవచ్చును. లేదా పూర్తి వివరాలతో కూడిన బిల్లును తిరిగి రాష్ట్ర శాసనసభకు పంపమని కేంద్రాన్నిఆదేశించవచ్చును. 

 

రాజ్యాంగం ప్రకారం నడుచుకొనే రాష్ట్రపతి శాసనసభ అభ్యంతరాలను పట్టించుకోకుండా, సభ చేత తిరస్కరింపబడిన బిల్లుపై ఆమోదముద్ర వేసి కేంద్రానికి పంపుతారని భావించలేము. తెలంగాణా బిల్లుపై రాష్ట్ర శాసనసభ ఎటువంటి అభిప్రాయాలు, అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ఎటువంటి సమస్య ఉండబోదని దిగ్విజయ్ సింగ్ శలవిస్తున్నపటికీ, అటువంటి బిల్లుని రాష్ట్రపతి నిరభ్యంతరంగా ఆమోదిస్తారని కానీ, దానికి పార్లమెంటులో బీజేపీ మద్దతు ఇస్తుందని గానీ నమ్మకం లేదు. ఈలోగా బిల్లుకి వ్యతిరేఖంగా సుప్రీం కోర్టులో పిటిషన్లు పడితే సమస్య మరింత జటిలమయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే వచ్చేపార్లమెంటు సమావేశాలలో బిల్లును ప్రవేశపెట్టడం సాధ్యం కాదు. తెలంగాణా ఏర్పాటు కూడా అసంభవమే అవుతుంది. అందువల్ల శాసనసభలో తెలంగాణా సభ్యులందరూ ఎట్టి పరిస్థితుల్లో తీర్మానం ప్రవేశపెట్టనీయకుండా గట్టిగా అడ్డుకోవచ్చును, ఆ ప్రయత్నంలో వారు సభలో ఆందోళన చేసి సభను స్తంభింపజేయవవచ్చును.

 

సీమాంధ్ర కాంగ్రెస్ శాసనసభ్యులలో బొత్ససత్యనారాయణ వంటి అధిష్టానానికి విదేయులయినవారు కూడా టీ-బిల్లుకి వ్యతిరేఖంగా ఓటువేస్తామని మొదటి నుండి చెపుతున్నపటికీ, ఎంతమంది ఈ తీర్మానానికి మద్దతు ఇస్తారనేది సభలో తీర్మానం ప్రవేశపెట్టినప్పుడే తేలుతుంది. ఇక మొదటి నుండి బిల్లుపై ఓటింగుకి పట్టుబడుతున్నవైకాపా సభ్యులు, ముఖ్యమంత్రిని సీమాంధ్ర ప్రజల దృష్టిలో సమైక్య ఛాంపియన్ గా అవతరింపజేసే ఈ తీర్మానానికి మద్దతు ఇస్తారో లేదో? అనుమానమే.

 

ఈ లెక్కలన్నీ సరిచూసుకొని సభలో ఆంధ్ర-తెలంగాణా సభ్యుల బలాబలాలు సరిసమానమయ్యేట్లు ఉంటే, తెలంగాణా శాసనసభ్యులు కూడా ఈ తీర్మానం సభలో ప్రవేశపెట్టడానికి అంగీకరించవచ్చును. సభలో బిల్లుకి అనుకూలంగా, వ్యతిరేఖంగా సగం సగం మంది ఓటు వేసినట్లయితే, రాష్ట్రపతి కూడా నిరభ్యంతరంగా బిల్లుపై అమోధముద్ర వేసి కేంద్రానికి పంపేయవచ్చును. ఆ తరువాత బిల్లుకి బీజేపీ మద్దతు ఇస్తుందా లేదా? అనేది కేంద్రం సమస్య తప్ప దానితో రాష్ట్రపతికి ఎటువంటి సంబంధం ఉండదు.

 

కానీ సభలో తీర్మానం పెట్టడం జరిగితే, సీమాంధ్ర నేతలందరూ బిల్లుని వ్యతిరేఖిస్తూ ఓటువేసే అవకాశాలే ఎక్కువ గనుక, బహుశః రేపటి నుండి గడువు పూర్తయ్యేవరకు శాసనసభలో బిల్లుపై ఎటువంటి చర్చ జరుగనీయకుండా తెలంగాణా సభ్యులందరూ అడ్డుపడవచ్చును. వారినందరినీ సభ నుండి సస్పెండ్ చేసి మిగిలినవారు ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించి పంపితే, ఆ తీర్మానానికి రాష్ట్రపతి విలువీయకుండా బిల్లును యధాతధంగా కేంద్రానికి పంపేసే అవకాశం ఉంది. గనుక, సభాపతి తెలంగాణా సభ్యులను సభ నుండి సస్పెండ్ చేయకపోవచ్చును. అంటే రేపటి నుండి గడువు పూర్తయ్యేవరకు ఇక సభలో రచ్చరచ్చే! తెలంగాణా సభ్యులందరూ కలిసి బిల్లుపై చర్చ ముగిసినట్లు సభలో రేపు ఒక తీర్మానం ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తాజా సమాచారం.

 

కేంద్రం రాష్ట్ర విభజన అంశం భుజానకెత్తుకొన్నపటినుండి నేటి వరకు కూడా ప్రతీ దశలో కూడా చాలా సందేహాత్మకంగా సస్పెన్స్ తోనే కొనసాగుతూ ఇంతవరకు వచ్చింది. బహుశః ఈ అనుమానాలు, ఊహాగానాలు, సస్పెన్స్ అన్నీ కూడా కేంద్రం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి, ఓటింగ్ జరిగేవరకు కూడా తప్పకపోవచ్చును.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.