ఉట్టికెగరలేనమ్మ...

Publish Date:Jan 27, 2014

Advertisement

 

ఉట్టికెగరలేనమ్మస్వర్గానికి ఎగురుతానన్నట్లు, రాష్ట్ర విభజన బిల్లు శాసనసభకు వచ్చినప్పుడు ‘మెరుపు సమ్మెలు చేస్తాం, లక్షల మందితో శాసనసభను దిగ్బందిస్తాం’ అంటూ ఉత్తరకుమార ప్రగల్భాలు పలికిన ఏపీ ఎన్జీవో ఉద్యోగుల నాయకుడు అశోక్ బాబు, ఇప్పుడు ఫిబ్రవరి 11, 12, 13 తేదిల్లో ఛలోడిల్లీ అంటూ వెళ్లి జంతర్‌మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామని భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నారు.

 

ఏపీఎన్జీవో ఉద్యోగులు మొదట నిరవధిక సమ్మె మొదలుపెట్టినప్పుడు ఎవరూ ఆయన చిత్తశుద్ధిని శంఖించలేదు. ఆయన హైదరాబాదులో లక్షమందికి పైగా ఉద్యోగులతో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ నిర్వహించినప్పుడు, అందరూ ఆయన నాయకత్వ లక్షణాలను ప్రశంసించారు. ఈ ఉద్యమం సందర్భంగా ఆయన అనేక మంది మంత్రులను, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, జాతీయ నాయకులను తరచూ కలుస్తుండటంతో క్రమంగా ఆయన ఆలోచన ధోరణిలో మార్పు రాసాగింది. వారి సహకారంతో ఆయన అనేక సభలు, సమావేశాలు అవలీలగా నిర్వహించిన తరువాత అధికారంలో ఉన్నరుచి, శక్తి ఏమిటో ఆయనకు బాగా అర్ధమయినట్లుంది. అప్పుడే తాను కూడా ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలనే కోరికను ఆయన బయటపెట్టుకొన్నారు. అందులో తప్పేమీ లేదు. కానీ, లక్షలాది ఉద్యోగులు చేసిన త్యాగాలకి, పడిన కష్ట నష్టాలకి ఆయన వ్యక్తిగతంగా ప్రతిఫలం ఆశించడమే అక్షేపనీయం.

 

ఇక ఆయన ఉద్యమానికి బ్రేకులు వేసి నడుపుతున్నతీరు కూడా ఆయన చిత్తశుద్దిని శంకించేదిగానే ఉంది. రాష్ట్ర విభజన జరగకుండా అడ్డుకొంటానని లక్షలాది మంది ఉద్యోగులను సమ్మెబాట పట్టించి, రాష్ట్రాన్ని దాదాపు స్థంభింపజేసిన అశోక్ బాబు, అకస్మాత్తుగా ఉద్యోగుల సమ్మెను విరమింపజేసి, అంతకాలంగా ఉద్యోగులు చేసిన ఉద్యమానికి విలువ లేకుండా చేసారు. రాష్ట్ర విభజన బిల్లు శాసనసభకు వచ్చినప్పుడు దాని అంతు తేల్చుతానని చెపుతూ డిల్లీలో రాష్ట్ర విభజన ప్రక్రియను సజావుగా సాగేందుకు పరోక్షంగా సహకరించారు. ఆ తరువాత బిల్లు శాసనసభకు వచ్చినప్పుడు ముందు చెప్పినట్లుగా ఏ మెరుపు సమ్మెలు చేయలేదు పైగా శాసనసభ్యులందరూ బిల్లుపై చర్చలో తప్పనిసరిగా పాల్గొనాలని ఆయన హుకుంలు కూడా జారీ చేసారు. ఇక త్వరలో బిల్లు తిరిగి సజావుగా డిల్లీకి వెళ్ళిపోతోంది గనుక, ఇంతవరకు దానికి సహకరించిన తాము డిల్లీ వరకు దానిని సాగనంపి వస్తామని ముహూర్తాలు కూడా ప్రకటిస్తున్నారిప్పుడు. అయితే బిల్లు రాష్ట్రంలో ఉండగా ఏమీ చేయలేని ఆయన, డిల్లీ వెళ్లి ఏవిధంగా అడ్డుకొంటారో ఆయనే చెప్పాలి. ఇదెలా ఉందంటే ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లుంది.

 

ప్రొఫెసర్.కోదండ రామ్, స్వామీ గౌడ్ వంటి ఉద్యోగులు తెలంగాణా పోరాటాలను, ప్రజల భావోద్వేగాలను ఆసరాగా చేసుకొని ఏవిధంగా రాజకీయంగా పైకి ఎదిగారో అదేవిధంగా అశోక్ బాబు కూడా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ వారికీ అశోక్ బాబుకి ఉన్నతేడా ఏమిటంటే, నేడు కాకపోతే రేపయినా వారి పోరాటాల వలన తెలంగాణా రాష్ట్రం ఏర్పడవచ్చును. కానీ, టీ-బిల్లు పార్లమెంటు గుమ్మం ఎక్కిన తరువాత కూడా ఇంకా సమైక్యాంధ్ర కోసం పోరాడతామని చెపుతూ ఆయన ఏ ప్రయోజనం ఆశిస్తున్నారో ప్రజలకు, ఉద్యోగులకు కూడా బాగా తెలుసు. ఆయనకు రాజకీయంగా పైకి ఎదగాలనే కోరికే ఉంటే, అందుకు ఎన్నికలు రానే వస్తున్నాయి. ఆయన నిరభ్యంతరంగా అందులో పోటీ చేసుకోవచ్చును. గెలిస్తే మంత్రో, ముఖ్యమంత్రో కావచ్చును కూడా. అప్పుడు ఆయనను ఈవిధంగా విమర్శించేవారు కూడా ఉండరు. కానీ, ఇంకా సమైక్యాంధ్ర పేరు చెప్పుకొని ప్రజల, ఉద్యోగుల భావోద్వేగాలతో ఆడుకొందామని ప్రయత్నిస్తే, ఏదో ఒకరోజు వారి చేతిలోనే భంగపాటు తప్పదు. ప్రజలలో రాజకీయ చైతన్యం ఇంతగా పెరిగిన తరువాత, ప్రసార మాధ్యమాలలో ప్రతీ రాజకీయ అంశంపై సామాన్యుడికి కూడా అర్ధమయ్యే రీతిలో అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు రాజకీయ పరిశీలకులు, నిపుణులు విశ్లేషించి చెపుతున్నపుడు కూడా, ప్రజలకు, ఉద్యోగులకు ఈ రాజకీయాలు, తమ ఆలోచనలు అర్ధం కావని అశోక్ బాబు వంటి వారు భావిస్తే అది వారికే నష్టం.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.