ఇంతకీ సమైక్య పార్టీ ఎందుకు స్థాపిస్తునట్లు?

Publish Date:Jan 17, 2014

Advertisement

 

కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నారని మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నపటికీ, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం అదేమి పట్టనట్లు, రాష్ట్ర విభజన వ్యవహారంలో తలమునకలవడం గమనిస్తే, బహుశః ఈ కొత్త పార్టీ స్థాపన కూడా దాని వ్యూహంలో భాగమేనని అనుమానం కలుగుతుంది. అదేవిధంగా వచ్చేఎన్నికలలోగా ఎలాగయినా రాష్ట్ర విభజన జరిపితీరుతామని కాంగ్రెస్ అధిష్టానం దృడంగా చెపుతుంటే, ముఖ్యమంత్రి తదితరులు సమైక్యపార్టీ స్థాపనకు పూనుకోవడం రాష్ట్ర విభజనను అడ్డుకోవడం కోసం కాక, కాంగ్రెస్ పార్టీతో విభేదించి ఎన్నికలలో పోటీ చేయడానికే బయటకి వచ్చినట్లుంది. కాంగ్రెస్ చెపుతున్నట్లు ఎన్నికలలోగా రాష్ట్ర విభజన జరిగినా, జరగకున్నా ఈ కొత్త సమైక్యపార్టీ ఆవిర్భావం తధ్యమని తెలుస్తోంది గనుక, దాని ప్రదానోదేశ్యం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమో లేక రాష్ట్ర విభజనను అడ్డుకోవడమో ఎంతమాత్రం కాదని స్పష్టమవుతోంది.

 

ఒకవేళ కొత్త పార్టీ పెట్టకుండా అందరూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగి ఎన్నికలకు వెళ్ళినట్లయితే, కాంగ్రెస్ పట్ల సీమాంధ్ర ప్రజలలో ఉన్న వ్యతిరేఖత కారణంగా అందరూ ఘోరంగా ఓడిపోయే ప్రమాదం ఉంది. గనుకనే కాంగ్రెస్ తాత్కాలికంగా రెండుగా చీలిపోయి, ఒకదానితో మరొకటి విభేధిస్తున్నట్లు నటిస్తూ, ప్రజలలో ఉన్నకాంగ్రెస్ వ్యతిరేఖతను, సమైక్యాంధ్ర సెంటిమెంటుని ఉపయోగించుకొని కాంగ్రెస్ నేతలందరూ వచ్చేఎన్నికలలో గెలవాలని భారీ వ్యూహమే రచించినట్లు కనబడుతోంది. తద్వారా కాంగ్రెస్ ను వ్యతిరేఖిస్తున్న ప్రజలు మళ్ళీ అదే కాంగ్రెస్ నేతలకు ఓటువేసి గెలిపించేలా చేయాలనే ఆలోచన చాలా గొప్పగా ఉంది. అదేదో సినిమాలో హీరో, విలన్ వెతుకుతున్నమనుషులను విలన్ కి అనుమానం కలగని విధంగా అతని ఇంట్లోనే సురక్షితంగా దాచిపెట్టినట్లుగా, కాంగ్రెస్ పార్టీపై గుర్రుగా ఉన్న సీమాంధ్ర ప్రజల భారి నుండి కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి, వారి కంటి ముందే రెండుగా చీల్చి ఒక సరికొత్త పార్టీగా వారి ముందుకు తీసుకు వచ్చిగండం గట్టెక్కాలనుకోవడం నిజంగా గొప్ప విషయమే. కానీ, సీమాంధ్ర ప్రజలు ఇది అర్ధం చేసుకోలేని తెలివి తక్కువవారని భావించడమే కూడా చాలా అవివేకమే.

 

కాంగ్రెస్ పార్టీ నుండి బయటకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి వైకాపా పెడితే, ఆయనదీ కాంగ్రెస్ డీ.యన్.ఏ.అని బల్లగుద్ది చెపుతున్నపుడు, కిరణ్ కుమార్ రెడ్డో మరో కాంగ్రెస్ నాయకుడో పార్టీ నుండి బయటకి వచ్చి సమైక్య పార్టీ పెడితే అది కాంగ్రెస్ డీ.యన్.ఏ. కాకుండా పోతుందా? ఎన్నికల తరువాత కాంగ్రెస్ లో కలిసిపోకుండా ఉంటుందా?

 

రాష్ట్ర విభజన జరగకుండా ఆపేందుకయితే కొత్త పార్టీ స్థాపించనవసరం లేదు. ఆ పని కాంగ్రెస్ లో ఉంటూనే కూడా చేయవచ్చును. కానీ రాష్ట్ర విభజన జరుగబోతోందనే సంగతి ముఖ్యమంత్రితో సహా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరికీ చాలా ముందే తెలిసి ఉన్నపటికీ అధికారం కోసం, మంత్రి పదవుల కోసం, పార్టీ టికెట్ల కోసం కాంగ్రెస్ అధిష్టానానికి అమ్ముడుబోయి, ఇంతవరకూ ప్రజలను మభ్య పెడుతూ వచ్చారు. ఇప్పుడు కొత్త పార్టీతో ఇంకా మభ్యపెట్టాలని ప్రయత్నించబోతున్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరి లక్ష్యం తిరిగి అధికారం సంపాదించడమే తప్ప, రాష్ట్రాన్నిసమైక్యంగా ఉంచడం మాత్రం కాదు. అందుకే రాష్ట్ర విభజన జరిగి తెలంగాణా ఏర్పడిన తరువాత కూడా ప్రజల మనోభావాలను బలహీనతలుగా భావించి సమైక్యమంటూ ఓట్లు నొల్లుకోవాలని వస్తున్నారు.

 

కాంగ్రెస్ వ్యతిరేఖతను తట్టుకొని స్వంత బలంతో గెలవగలమనే ధీమా ఉన్నవాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే, మరి కొందరు ఈ కొత్త సమైక్యపార్టీలోకి, మరి కొందరు వైకాపాలోకి దూకి ఎన్నికల గండం గట్టెక్కాలని ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తను గెలవలేనప్పుడు ప్రధాన ప్రతిపక్షం గెలవకుండా ఉండేందుకు ఎన్నికల సమయానికి ఇటువంటి కొత్త డమ్మీ పార్టీలను సృష్టించి ఓట్లు చీల్చడం అలవాటు. ఇప్పుడు కూడా అదే చేస్తోంది. మంద కృష్ణ మాదిగ ఇటీవలే కొత్త రాజకీయ పార్టీ స్థాపించారు. అమాద్మీ పార్టీ కూడా రంగ ప్రవేశం చేస్తునట్లు ప్రకటించింది. ఇక కిరణ్ కుమార్ రెడ్డో మరొక కాంగ్రెస్ నాయకుడో సమైక్య పార్టీ స్థాపించడమే మిగిలి ఉంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.