పక్కదారి పట్టిన అమాద్మీ

Publish Date:Jan 20, 2014

Advertisement

 

దేశంలో ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థను ఆవిష్కరిస్తామని, డిల్లీ ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిగద్దెనెక్కిన ఆమాద్మీపార్టీ ఇంకా నెల రోజులయినా పూర్తికాక మునుపే, స్వయంగా అనేక సమస్యలలో చిక్కుకోవడమే కాకుండా, అనేక కొత్త సమస్యలు సృష్టిస్తోంది కూడా.

 

ప్రభుత్వ పాలనపై దృష్టి కేంద్రీకరించవలసిన అరవింద్ కేజ్రీవాల్, విధినిర్వహణలో అలసత్వం చూపిన నలుగురు పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయమని ధర్నాకు సిద్దమయ్యారు. హోంశాఖ అధీనంలో ఉండే డిల్లీ పోలీసులపై అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నేరుగా ఎటువంటి చర్య తీసుకోలేదు గనుక, ఆయన వారిపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ వ్రాసారు. ఆయన లేఖపై స్పందించిన హోంమంత్రి సుషీల్ కుమార్ షిండే మీడియాతో మాట్లాడుతూ ఆ పోలీసులపై దర్యాప్తుకు ఆదేశించామని, దర్యాప్తులో వారు దోషులుగా తేలినట్లయితే వారిపై చర్యలు తీసుకొంటామని అన్నారు. కానీ, ఎటువంటి దర్యాప్తు జరపకుండా పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవడం వలన చట్టపరమయిన సమస్యలు వస్తాయని, అందువల్ల అరవింద్ కేజ్రీవాల్ తన పది రోజుల ధర్నాఆలోచనను విరమించాలని ఆయన విజ్ఞప్తి చేసారు. కానీ, అరవింద్ కేజ్రీవాల్ మరియు ఆయన సహచర మంత్రులు కూడా ధర్నాకే సిద్దపడుతున్నట్లు తాజా సమాచారం.

 

మంచి ప్రజాదారణ కలిగి ఉన్నఅరవింద్ కేజ్రీవాల్ ప్రజలను ఆకట్టుకోనేందుకు ఇటువంటి ప్రయత్నాలు చేయడం అనవసరం. తాము ప్రజలకు తాము ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలుచేసేందుకు కృషి చేసినట్లయితే, అవే ఊహించనంత సత్ఫలితాలు ఇస్తాయి. వ్యవస్థలో లోపాలను సరిదిద్దాలని ప్రయత్నించడం మంచిదే. కానీ, అందుకు ఇదే సరయిన పద్ధతి కాదని ఆయన గ్రహించడం అవసరం. ఈ రోజు నలుగురు పోలీసు అధికారుల కోసం ఆయన, ఆయన సహచర మంత్రులు నడిరోడ్డు మీద పదిరోజులు ధర్నాకు దిగినంత మాత్రాన్నసమస్య సమూలంగా పరిష్కారమయిపోదు. డిల్లీకి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి కల్పించేందుకు కృషి చేస్తామని ఆమాద్మీ పార్టీ చేసిన ఎన్నికల హామీని నిలబెట్టుకొనేందుకు ఆయన కృషి చేసి ఉంటే, పోలీసు వ్యవస్థ డిల్లీ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోకి వస్తుంది. అప్పుడు ఇటువంటి సమస్యలు పునరావృతమవవు.

 

దాదాపు 50 లక్షల మంది జనాభా ఉన్నడిల్లీ సమస్యలన్నీ పరిష్కరించాలంటే ముఖ్యమంత్రితో సహా ప్రభుత్వంలో అధికారులందరూ నిరంతరం పనిచేస్తూ ఉండాలి. కానీ, సాక్షాత్ ముఖ్యమంత్రి, ఆయన సహచర మంత్రులు తమ పనులను పక్కనబెట్టి, ఈవిధంగా ధర్నాలు చేయడం వలన ప్రజలకు ఎటువంటి మేలు జరుగదు. అరవింద్ కేజ్రీవాల్ బృందానికి ప్రజలు ఒక అపూర్వమయిన అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ఆమాద్మీ ప్రభుత్వానికి ఎన్నికలు సమీపించే వరకు, మహా అయితే మరో మూడు నెలల ఆయువు మిగిలి ఉంది. దేశ ప్రజలకి తమ ప్రభుత్వ పనితీరుని మచ్చు చూపించగల అపూర్వమయిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని అమాద్మీ పార్టీ ఎన్నికలకు వెళ్ళినట్లయితే అందుకు తగిన ప్రతిఫలం ఆశించవచ్చును. కానీ, ప్రజలను ఆకర్షించడానికి ఇటువంటి చవకబారు పనులకు పూనుకొంటే, వచ్చే ఎన్నికలలో ఆమాద్మీ పార్టీ నామ రూపాలు లేకుండా పోవచ్చును.

 

గుజరాత్ రాష్ట్రంలో సమర్ధమయిన పాలన అందించినందుకే నరేంద్ర మోడీ వైపు దేశ ప్రజలు మొగ్గుచూపుతున్నారనే సంగతిని అరవింద్ కేజ్రీవాల్ మరియు ఆయన పార్టీ సభ్యులు గ్రహించినట్లయితే, వారు ఇటువంటి అంశాలను పట్టుకొని వృధా కాలక్షేపం చేయరు.డిల్లీ ప్రజలు ఆమాద్మీ నుండి చాలా ఆశించి అధికారం కట్టబెట్టారు. ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఇప్పుడు విఫలమయినట్లయితే, దేశ ప్రజలు మళ్ళీ ఇక ఇటువంటి ప్రయోగానికి ఆసక్తి చూపరు. అప్పుడు దేశ ప్రజలకు మళ్ళీ అవే కాంగ్రెస్, బీజేపీలు గతవుతాయి. 

 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.