ఇసుక రవాణాతో ఏపీ ప్రభుత్వంలో సరికొత్త ఉద్యోగ అవకాశాలు అందించనున్న సీఎం జగన్...

Publish Date:Oct 2, 2019

Advertisement

 

గత ప్రభుత్వం ఇసుక విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో ఇసుక విధానం ప్రజలకు మద్దత్తు ఉండేలా జగన్ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. ఇసుక పంపిణీ విధానంలో పెను మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న జగన్ సర్కార్ మరో కొత్త నిర్ణయం తీసుకోబోతోంది. ప్రతి జిల్లాలోని రెండు వేల మంది నిరుద్యోగ బీసీ, ఎస్సీ, ఎస్టీ యువకులు ఆయా కార్పొరేషన్ ల ద్వారా ఇసుక రవాణా వాహనాలను ఇప్పించి వారికి ఇసుక కాంట్రాక్టు ఇవ్వాలని సీఎం అధికారులకు సూచించారని సమాచారం. దీని పై త్వరలో మార్గదర్శకాలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఏపిలో తీవ్ర చర్చలు జరిపిన తరువాత ఇసుక అమ్మకాలు ప్రారంభించిన జగన్ సర్కారు దీన్ని పటిష్టంగా అమలు చేసేలా అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తోంది. దీంతో పాటు ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా సీఎం జగన్ మరో కొత్త నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం ఇక పై ప్రతి జిల్లాలో రెండు వేల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగుల యువకులను గుర్తించి వీరికి కాపు కార్పొరేషన్ తో పాటు సంబంధిత కార్పొరేషన్ ద్వారా ఇసుక రవాణా వాహనాలు అందించనున్నారు. వీరికే ఇసుక రవాణ కాంట్రాక్టులు ఇవ్వడం ద్వారా ఇసుక రవాణాలో అక్రమాలను పూర్తిస్థాయిలో అరికట్టాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలిచ్చారు. దీనికి సంబంధించిన మార్గ దర్శకాలను రూపొందించాలని సూచించారు. 

ఇసుక అమ్మకాలు ప్రారంభమైన ఇంకా రాష్ట్రంలో పలుచోట్ల ఇసుక పంపిణీలో ఆటంకాలు ఏర్పడటం పై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిలోమీటరుకు నాలుగు రూపాయల తొంభై పైసలు చొప్పున ఇసుక రవాణా చేస్తామంటూ ఎవరు ముందుకొచ్చినా వారికి అవకాశం ఇవ్వాలని జగన్ ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని రీచ్ లను తెరవాలని జిల్లాలో ఇసుక సరఫరా రవాణా బాధ్యతను జేసీ స్థాయి అధికారికి అప్పగించారని సూచించారు. ఆ ఆధికారి కేవలం ఇసుక సరఫరా రవాణాలను మాత్రమే చూడాలన్నారు. కృష్ణా, గోదావరి నదిలో వరదలు తగ్గాయి కాబట్టి ఇసుక లభ్యత ఉందని దానిని తక్కువ రేటుకు అందించారని సీఎం చెప్పారు. వచ్చే అరవై రోజుల్లో కచ్చితంగా మార్పు రావాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఇక్కడ రాజకీయ జోక్యాన్ని ఎక్కడ అనుమతించరాదని సీఎం ఆదేశాలిచ్చారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కచ్చితంగా కనిపించాలని ఆయన వెల్లడించారు. ఇసుక మాఫియా ఎట్టి పరిస్థితిల్లోనూ కనిపించకూడదని,ప్రోత్సహించకూడదని సీఎం ఆదేశాలు జారీ చేశారు.ఈ విషయంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నానని వెల్లడించారు. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక సరఫరా ఉండకూడదని ఈ మేరకు చెక్ పోస్టుల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలో అవసరానికి తగిన ఇసుక లేదన్న విషయం గుర్తించి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఈ అంశంపై జగన్ తనదైన గట్టి నిర్ణయాన్ని తెలియజేశారు.

By
en-us Political News

  
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.