చంద్రబాబుకు నిజంగానే పదవీ గండం ఉందా?

Publish Date:Sep 14, 2015

Advertisement

 

చంద్రబాబుకు పదవీ గండం ఉందని, 2017లో అంతర్గత కుమ్ములాటలు పెరిగి, అనూహ్య పరిస్థితుల్లో...టీడీపీ ప్రభుత్వం పడిపోయే అవకాశాలున్నాయని, అదే సమయంలో లోకేష్ ని ముఖ్యమంత్రిని చేస్తే, సర్కార్ నిలబడుతుందని, లేదంటే ఇబ్బందికరమేనంటూ జ్యోతిష్కుడు రమణారావు చేసిన వ్యాఖ్యలు టీడీపీ వర్గాల్లో కలవరం రేపుతున్నాయి. జ్యోతిష్యాన్ని నమ్మడం, నమ్మకపోవడం వ్యక్తిగతమే అయినా, వాటిని తూచా తప్పకుండా ఆచరించేవాళ్లు మాత్రం ఈ జ్యోతిష్కుడి మాటలతో అయోమయంలో పడ్డారు. అలా జ్యోతిష్కుడు రమణారావు చెప్పిన మాటలపై నమ్మకం కుదిరే...మూడేళ్లలో తానే సీఎం అవుతానంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధీమాగా చెబుతున్నాడని గుర్తుచేస్తున్నారు. పైగా చంద్రబాబు గ్రహస్థితి అంతగా బాగో లేదని, గ్రహాలు బలహీనంగా ఉన్నాయని చెప్పిన రమణారావు...జగన్ గ్రహస్థితి మాత్రం అద్భుతంగా ఉందని చెబుతున్నారు. పైగా 2017లోనే జగన్ సీఎం అవుతారంటూ చెప్పడంతో, చంద్రబాబుకు నిజంగానే పదవీ గండం ఉందా అనే చర్చజరుగుతోంది.

అయితే జ్యోతిష్కులు చెప్పేవి అన్ని సందర్భాల్లోనూ నిజం కాకపోయినా, ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేసే వ్యక్తుల గురించి వాళ్లు చెప్పే విషయాలు సంచలనంతోపాటు ఆసక్తిని రేకేత్తిస్తుంటాయ్. ఇప్పుడు చంద్రబాబు, జగన్ విషయంలో జ్యోతిష్కుడు రమణారావు చెప్పిన విషయాలూ అంతే సంచలనం కలిగిస్తున్నాయి. ఒకప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కు జిగిరీ దోస్త్ అయిన రమణారావు...2009లో టీడీపీ-టీఆర్ఎస్ కు పొత్తు కుదర్చడంలో కీలక పాత్ర పోషించారట. అంతేకాదు 2014లో కచ్చితంగా తెలంగాణ ఏర్పడటం ఖాయమని ముందే చెప్పానని ప్రచారం చేసుకునే రమణరావు... వైఎస్ విమాన ప్రమాదాన్ని కూడా ముందుగానే ఊహించి చెప్పారట.దాంతో పక్కా క్రిస్టియన్ అయిన జగన్ కు కూడా రమణారావుపై గురి కుదిరిందని, అందుకే బెంగళూర్ లోని జగన్ ఎస్టేట్స్ లో శాంతి హోమం చేయిస్తున్నారట. జగన్ కు కూడా వాళ్ల నాన్నలాగే ఆకాశ యానంలో ప్రమాదం ఉందని రమణారావు హెచ్చరించడంతోనే శాంతి హోమం నిర్వహిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

మరి రమణారావు చెప్పినట్లుగా టీడీపీలో తిరుగుబాటు వస్తుందో? మూడేళ్లలో జగన్ సీఎం అవుతాడో తెలియదు కానీ...జ్యోతిష్యాన్ని  నమ్మేవాళ్లు మాత్రం...చంద్రబాబు శాంతి హోమం చేయించాలంటున్నారు. గ్రహాల అనుగ్రహం కోసం హోమం చేయడం తప్పుకాదంటున్న టీడీపీ నేతలు...టీ-సీఎం కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటూ 2014కి ముందు ఇలాంటి హోమాలు ఎన్నో చేశారని గుర్తుచేస్తున్నారు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో ఆయా ప్రభుత్వాలు కూలిపోవాలంటూ...రహస్య హోమాలు చేసిన వాళ్లూ ఉన్నారని, అలాంటి వాటికి విరుగుడుగా హోమం చేయడం మంచిదంటున్నారు. రమణారావు కూడా ఇదే విషయం చెప్పారని, కొన్ని పనులు చేస్తే రాజధాని నిర్మాణం త్వరగా పూర్తయి, చంద్రబాబు మంచిపేరు తెచ్చుకుంటారన్న మాటలను గుర్తుచేస్తున్నారు. మరి రమణారావు చెప్పిన జాతకం ఎంతవరకు నిజమవుతుందో తెలియాలంటే మూరో మూడేళ్లు ఆగాల్సిందే.

By
en-us Political News

  
మోడీ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ కూడా జవాబుదారీ తనంగా చెప్పుకోవడం లేదు. ఇక దేశ యువత ప్రజా నిరసనలకు మోడీ సర్కార్ దిగి వచ్చిందని చెబుతున్నారు. అయతే ఒక్క వైసీపీ మాత్రమే బీజేపీ విషయంలో.. కాదు కాదు మోడీ విషయంలో రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తోంది.
బీజేపీకి ఆర్ఎస్ఎస్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక విధానపరమైన నిర్ణయాల వెనుకా ఆర్ఎస్ఎస్ ఉంటుందని అందరూ అంగీకరిస్తారు. అయితే.. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆర్ఎస్ఎస్ ఆసంతృప్తిగా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఈ ఆందోళనలకు నేరుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, స్వయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఐదేళ్ల పాలనలో వైసీపీ నిర్వాకాన్ని అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సభలో ఎండగడుతుందన్న భయంతోనే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మావిగన్ ప్రతిపాదన పట్ల సాధారణ ప్రజల నుండి మద్దతు సంగతి అటుంచితే.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ మళ్లీ మడమ తిప్పేశారు. మాట మార్చేశారు. నష్టనివారణ కోసం సీఆర్డీయేకు జై అంటూ మరోసారి నెట్టింట ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు.
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్.. తాజాగా చంద్రబాబు పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.