Publish Date:Oct 13, 2022
కర్ణాటకాలో హిజాబ్ ధరంచడంపై సుప్రీం కోర్టులో గురువారం వెలువడిన తీర్పు రెండు రకాలుగా వచ్చిం ది. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడం నిషేధనపై రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధాంశు ధూలి యా విరుద్ధంగా తీర్పునిచ్చారు. విద్యార్ధులు హిజాబ్ను విద్యాసంస్థలకు వచ్చినపుడు ధరించ రాదని ఆయన తీర్పునిచ్చారు. ఇపుడు ఈ అంశాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో పెట్టను న్నారు. ఈ అంశంపై భారత ప్రధాన న్యాయమూర్తి విచారించి తీర్పు నివ్వవలసి ఉంటుంది.
ఈ అంశానికి సంబంధించి కర్ణాటక హైకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా వచ్చిన 26 అప్పీళ్లను జస్టిస్ హేమంత్ గుప్తా కొట్టివేశారు. విద్యాసంస్థల్లో పిల్లలు హిజాబ్ను ధరించడం అనేది ఇస్లాంలో ప్రత్యేకంగా చెప్పలేదని, అది అక్కడ ధరించి తీరాలన్నదేమీ ప్రస్తావించలేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై తాను 11 ప్రశ్నలతో ప్రశ్నావళిని తయారు చేయగా అందిన సమాధానాలన్నీ అప్పీళ్లకు వ్యతిరేకంగా వచ్చా యన్నారు.
అయితే రాష్ట్ర హైకోర్టు ఈ విషయంలో వేరే మార్గంలోకి వెళ్లిందని జస్టిస్ ధూలియా అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పును ఆయన త్రోసిపుచ్చారు. విద్యార్ధులు హిజాబ్ను ధరించడం అవసరమా కాదా అన్నది ఇస్లామ్లో పేర్కొన్నారా లేదా అన్న అంశం కూడా ఈ వివాదానికి అప్రస్తుతమన్నారు. ఈ అంశం వారి విద్యార్థుల అభిమతానికి, ఆర్టికల్ 14, ఆర్టికల్ 19కి సంబంధించినదని ఆయన అన్నారు. విద్యార్ధిని జీవి తం మెరుగుపరుస్తున్నామా అన్నదే ఆలోచించానని, ఫిబ్రవరి 5న ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాన్ని రద్దు చేసి, ఆ నిషేధాన్ని తొలగించాలని ఆదేశించానని జస్టిస్ ధూలియా అన్నారు.
కాగా హిజాబ్ పై విరుద్ధ తీర్పులపట్ల కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. ఇంతకంటే మంచి తీర్పు ఉండ దని, మహిళలంతా హిజాబ్ను ధరించడం ఇష్టపడడం లేదని మంత్రి బిసి నగేష్ అన్నారు. కోర్టు తీర్పు హర్షణీయమని అయితే, సుప్రీం కోర్టు ఇంకా తుది తీర్పు ఇవ్వాల్సి ఉంది అన్నారు.
కర్ణాటకాలో విద్యాలయాలకు ఆడపిల్లలు హిజాబ్ ధరించి తరగతులకు హాజరుకావడం మీద ఈఏడాడి ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం నిషేధాజ్ఞలు జారీ చేసింది. దాన్ని ప్రశ్నిస్తూ వచ్చిన అప్పీళ్లపై హైకోర్టు కూడా నిషేధాజ్ఞలు సరయినవేనని తీర్పునిచ్చింది. ప్రస్తుతం ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో సవాలు చేశారు. ఈ అంశంలో సుప్రీం కోర్టు తుది తీర్పు ఇవ్వవలసి ఉంది. కాగా ప్రస్తుతం దేశంలో నిషేధించిన పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పి ఎఫ్ ఐ) ముస్లిం విద్యార్ధులు హిజాబ్ ధరించాల్సిందే అంటూ వివా దాన్ని లేవనెత్తిందని కర్ణాటక ప్రభుత్వ సుప్రీం కోర్టులో వాదన వినిపించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cji-to-give-verdict-on-hijab-case-of-karnataka-25-145346.html
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.