అక్షరాలు గుండ్రంగా రాయడం అందరికీ అంత సులభంగా వచ్చే కళ కాదు. చిన్నపుడు స్కూల్లో కాపీ రైటింగ్ పేర టీచర్లు పిల్లలకు పెద్ద శిక్షే వేసేవారు. ఎవరు గుండ్రంగా రాస్తే వారికి క్లాసులో గౌరవం, లీడర్ అయ్యే అవకాశాలుండేవి. అదో పెద్ద హోదా. తెలుగు టీచర్లకు అక్షరాలు గుండ్రంగా రాసే వారంటే మహాయిష్టం. బాల్యంలో ఇంత ప్రాధాన్యతిచ్చిన హ్యాండ్ రైటింగ్కి క్రమేపీ పెద్ద చదువుల్లోకి వెళ్లగానే అంత ప్రాధాన్యత కనపడదు. ఫలితంగా చేతికి వచ్చిన విధంగా వేగంగా రాసే యడం అలవడి అదే పద్ధతి వృత్తి, ఉద్యోగాల్లోనూ కొనసాగిస్తూంటాము. ఇది తప్పు కాదు. కానీ ఆ అలవాటు డాక్టర్ వృత్తి లో ఉన్నవారికే మరీ ఇబ్బంది.
ఏదో చిన్నజ్వరంతోనో, పెద్ద ఆరోగ్య సమస్యతోనో వీధి చివర్నున్న డాక్టర్ దగ్గరికో, ఆస్పత్రికో వెళతాం. మన సమస్య వివరిస్తాం. డాక్టర్ వీలయినంతగా పరీక్ష చేసి పెన్ను పట్టి కాయితం మీద వీలయినంత వేగంగానో, వీలయినంత నెమ్మదిగానో మందులు రాసిస్తారు. అది చూస్తే చైనా, జపాన్ భాషల్లో ఏదో రాశా డనే ఫీలింగ్ వచ్చి పేషెంట్లు విసుక్కోవచ్చు. ఎందుకంటే ఆ మందుల పేర్లు ఆయన రాసిన విధానంలో బొత్తిగా అర్ధంగావు గనుక. దాన్ని చదివే బ్రహ్మ ఒక్కడే.. అతగాడే మందుల దుకాణంవాడు. అతనికి డాక్టర్కి వున్న అక్షరాలను అర్ధంచేసుకునే లింకు మనబోటివారికి ఎవ్వరికీ అర్ధం కాదు. కానీ అతగాడు టెన్త్ చది వినా, ఎంబీబీఎస్ రాసిన కాయితాన్ని అమాంతం చేతిలోంచి లాక్కుని అదే వేగంగా వాటిపేర్లు చదువుతూ అసిస్టెంట్ చేత తీయించి బిల్లు ఇంతయిందని అంటాడు.
అప్పటిదాకా ఏదో మంత్రాలు విన్నట్టే ఉం టుంది. అంత చదువుకున్నవాడు ఛండాలంగా రాసింది అంతగా చదువుకోని వాడు ఎలా అర్ధంచేసుకు న్నాడు? అనే సందేహంతోనే ఊగిసలాడుతూ ఇల్లు చేర తాం. అదే చిత్రం. మందుల పేర్లు దుకాణం వాడి కి కంఠతా ఉంటాయా? ఫలానా డాక్టర్ ఫలానా ఆరోగ్య సమస్యకి ఫలానా మందులే రాస్తాడన్న అపూర్వజ్ఞానం కలిగి ఉండడమేనా? బహుశా అదే అయి ఉంటుంది.
ఏమయినప్పటికీ, చిన్నప్పటి టీచర్ల బెత్తం దెబ్బలు ఇపుడు తడుముకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పుడు అన్ని తిట్లు, దెబ్బలు తిని నేర్చుకున్న బహుచక్కని రాత క్రమేపీ తగలడిందేమిటా అని! గుండ్రంగా చూడముచ్చటగా రాయడం జీవితాంతం ఆ నేర్పు కలిగి ఉండేవారు తక్కువమందే ఉంటారు. ప్రొఫెషన్ని అనుసరించి రాయడంలో వేగం పుంజుకుని అక్షరాలు అవతలివారికీ అర్ధం కావాలన్న ధ్యాసపోతోంది. టెన్త్పరీక్షల్లో గుండ్రంగానే రాయాలి, మందులు రాసే డాక్టర్ గుండ్రం గానే రాయాలి. కానీ ఈ రెండు ఎన్నడూ ఒకే పంథాలో జరగవు. దీన్ని గురించే ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ఒక ట్వీట్ కూడా చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/changing-styles-of-handwriting-25-143310.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.