ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సత్తుపల్లి టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..సమయం లేకపోయినా సండ్ర వెంకటవీరయ్య విజయం కోసం సత్తుపల్లి వచ్చానని,నీతీ నిజాయితీకి సండ్ర మారుపేరని అన్నారు. 15 మంది గెలిస్తే 14మంది పార్టీ మారిపోయినా సండ్ర వెంకటవీరయ్య మాత్రం ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగకుండా టీడీపీలోనే కొనసాగారని తెలిపారు.
తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్లకు ఓటు బ్యాంకు, క్యాడర్ బలంగా ఉన్నాయని.. ఈ రెండు పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేసి తెరాసకు డిపాజిట్లు రాకుండా ఓడించాలని పిలుపునిచ్చారు. "తెరాసను భవిష్యత్తులో కనుమరుగయ్యేలా చేయాలి. ఈ ఎన్నికలే కేసీఆర్కు చివరి ఎన్నికలు కావాలి. కేసీఆర్ అస్తవ్యస్త విధానాల వల్ల తెలంగాణ బాగా దెబ్బతింది. ధనిక రాష్ట్రం అప్పుల పాలైంది. రాష్ట్రంలో కేసీఆర్ ఒక్క పని కూడా చేయలేదు. రాష్ట్రంలో అద్భుతంగా ఫాం హౌజ్ కట్టుకోవడమే ఆయన చేసిన ఏకైక పని. వచ్చే ఎన్నికల్లో ఓడిపోయినా అందులోనే కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటారు. ఈసారి గెలిచేది ప్రజా కూటమే. ఇందులో అనుమానమే లేదు.’
"సత్తుపల్లిని ఎందుకు జిల్లా కేంద్రం చేయలేదో నాకు అర్థం కావడం లేదు. సింగరేణి కోసం భూములు కోల్పోయిన కుటుంబాలకు పోలవరం తరహాలో ప్యాకేజీ అందించే బాధ్యత మహా కూటమి తీసుకుంటుంది. మీడియా ప్రతినిధులకు కూడా ఇళ్లు కట్టించే బాధ్యత ప్రజా కూటమిదే. ఏపీలో లాగా పాత్రికేయులకు జీవిత బీమా, ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అశ్వారావుపేటలోని బహిరంగసభకు కేసీఆర్ వచ్చినప్పుడు తెరాస అభ్యర్థినే వేదికపైకి రావొద్దని.. నువ్వొస్తే ఓట్లు పోతాయని బెదిరించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా అంతే కదా..! రేవంత్ రెడ్డి ఇంట్లో రాత్రి 3 గంటల సమయంలో ఆయన బెడ్రూంలోకి పోలీసులు ప్రవేశించారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని ఈ ఘటనపై హైకోర్టే ప్రశ్నించిందంటే.. ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తోందో అర్థం చేసుకోవచ్చు. .’’ అని చంద్రబాబు అన్నారు.
లగడపాటి రాజగోపాల్ వెల్లడించిన తెలంగాణ ఎన్నికల సర్వేపై కూడా చంద్రబాబు స్పందించారు. లగడపాటి సర్వే సైతం మహాకూటమి విజయం తథ్యమని చెప్పిందన్నారు. ఇక తెరాస పని అయిపోయిందని వ్యాఖ్యానించారు. రెండున్నర నెలల క్రితం లగడపాటి చేసిన సర్వే ప్రకారం తెరాసకు 90 సీట్లు వస్తాయంటే ఆనందపడిన కేసీఆర్.. ఇప్పుడు తెరాస ఓడిపోతుందని చెబితే ఆయనపై విమర్శలకు దిగుతున్నారని వ్యాఖ్యానించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-naidu-at-mahakutami-public-meeting-in-sathupally-39-84729.html
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
ఈ వివాదం కాస్తా ముదరడంతో తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిగానైనా బరిలోకి దిగుతుందని, అవసరమైతే ఏ పోరాటానికైనా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. తెలంగాణ సెంటిమెంట్ను టచ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో.. పవన్ కళ్యాణ్ ఈ సవాల్ను స్వీకరించడం సంచలనం సృష్టించింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కేవలం 80 స్థానాలకే పరిమితమైన టీఎంసీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అసమ్మతి గళాలు రోడ్డెక్కాయి. పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మెజారిటీ టీఎంసీ నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. గడిచిన 15 ఏళ్లుగా బెంగాల్ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన దీదీ, ఇప్పుడు సొంత పార్టీపై పట్టు కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.