Publish Date:Oct 17, 2019
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చి ఐదు నెలలైంది. ఇప్పుడు పార్టీ ఓటమి పై సమీక్షలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు మొదలుపెట్టారు. కార్యకర్తలపై అధికార పార్టీ నేతల దాడులు బాధితులకు పరామర్శ పేరుతో చంద్రబాబు జిల్లాల పర్యటన చేపట్టారు. తూర్పు గోదావరితో మొదలైన ఈ పర్యటన విశాఖ, నెల్లూరు జిల్లాలో కొనసాగాయి.
రెండు రోజుల పాటు పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. నియోజక వర్గాల వారీగా సమీక్ష కార్యకర్తల కుటుంబాలకు భరోసా ఇచ్చే ప్రయత్నం ఈ సమావేశాల్లో జరిగింది. ఇదంతా ఒకెత్తయితే నెల్లూరు జిల్లాలో పార్టీ ఓటమికి కారణాలు ఏంటి అని చంద్రబాబు నేతలు అడిగారు. జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు ఎంపీ సీట్లను వైసీపీ గెలుచుకుంది.
పార్టీ ఇంతగా నష్టపోవటానికి కారణాలు ఏంటి అని నేతలను సూటిగా చంద్రబాబు ప్రశ్నించారు. దీంతో కొందరు నేతలు సమాధానం చెప్పలేక బిక్కమొహం వేశారు. అయితే కొంత మంది నేతలు మాత్రం మనసు విప్పి మాట్లాడారు.
పార్టీ అధిష్టానం పరంగానే తప్పులు జరిగాయని తప్పులన్నీ మీరే చేసి మమ్మల్ని అడగటం బాగోలేదని కొందరు వాదనలు వినిపించారు. కొన్ని నియోజకవర్గాలు అభ్యర్ధులను మార్చాలనీ ఎన్నికల ముందు పదేపదే చెప్పినా పట్టించుకోలేదని ఏక పక్షంగా అభ్యర్ధులను నిర్ణయించి తమపై రుద్దారని కొందరు కార్యకర్తలు వాపోయారు.
ఇప్పుడు తాము వద్దన్నా నేతల్లో పోటీలోకి దించి వారు ఓడిపోతే తమనడగటం బాలేదని అన్నారు. సూళ్లూరుపేటలో వైసీపీకి అరవై ఒక్క వేల మెజార్టీ ఎలా వచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులు వెంటనే జోక్యం చేసుకొని క్యాండిడేట్ ను మార్చమని పదేపదే విజ్ఞప్తలు చేసినా పట్టించుకోలేదని దాని ఫలితమే అరవై ఒక్క వేల మెజార్టీ అని చెప్పారు. ఎన్నికల ముందు రిజల్ట్ ఊహించి చెప్తే అధిష్ఠానం పట్టించుకోలేదని ద్వితీయ శ్రేణి నాయకత్వం సూచనలకు కనీసం విలువ ఇవ్వలేదని వాపోయారు.
అధిష్టానం తప్పులు చేసి ఇప్పుడు సమీక్షల పేరిట తాము తప్పు చేశామని కలరింగ్ ఇవ్వడం బాగోలేదని సమావేశంలో కార్యకర్తలు కుండ బద్దలు కొట్టారని తెలుస్తుంది. జిల్లాలో ద్వితీయ శ్రేణి నాయకత్వానికి పార్టీ పరంగా సపోర్ట్ లేదని, ఇలాంటి పరిస్థితుల్లో మంచి అవకాశాలు వస్తే పక్క పార్టీ చెంత చేరటానికి నేతలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు ముందే కొందరు కార్యకర్తలు చెప్పినట్లు సమాచారం. మొత్తానికి నెల్లూరు సమీక్ష సమావేశాలు వాడీవేడిగా జరిగాయని తెలుస్తోంది. ఇవి విన్న చంద్రబాబు ఇక పై ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారో చూడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/chandrababu-naidu-25-90185.html
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ నేతల ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్రం నలుమూలలా అభ్యర్థులు గెలుపుకోసం ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఏపీ మొత్తం ఒక ఎత్తయితే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ నియోజకవర్గ ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ, మేధావి వర్గమూ ఎక్కువే. అలాంటి పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో జగన్ పార్టీకి రైతులు ఓట్లు పడే అవకాశాలు ఎంతమాత్రం లేకుండా పోయాయి.. దీని వెనుక ఎన్నో
చిన్నారుల్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించటం తప్పుగా పేర్కొన్న నిరంజన్ రెడ్డి ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించింది. జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. దీంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాకు ఆదేశాలు జారీ చేశారు. అమిత్ షాతో పాటు.. మరో నలుగురిపైనా మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేసి.. ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
పదవి ఊడబోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నవరత్నాల పేరుతో ఏవేవో పథకాలు అనౌన్స్ చేసి 2019లో
తన అన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మానసిక పరిస్థితి మీద తనకు అనుమానంగా వుందని ఆయన సోదరి,
ఈ ఏడాది దీపావళి పండగ కొద్ది నెలల ముందే రాబోతోంది. ఈ ఏడాది మే 13న నరక చతుర్దశి, జూన్ 4న దీపావళి రానున్నాయి
ఇది ప్రపంచ వింతల్లో ఎన్నో నంబర్ అవుతుందో తెలియదుగానీ, ఇది నిజంగానే ప్రపంచ వింతే! మజ్లిస్ పార్టీ అధినేత,
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఇప్పటికే పార్లమెంట్లో ఉన్నారు. ఇప్పుడు తాను కూడా పోటీ చేసి గెలిస్తే. గాంధీ కుటుంబలో ఉన్న ముగ్గురూ. చట్టసభలో కూర్చున్నట్టు అవుతుంది. ఇది బీజేపీకి మరో అస్త్రంగా మారుతుందని ప్రియాంక గాంధీ భయపడ్డారు.
అమెరికాలో నర్సుగా పనిచేసిన 41 ఏళ్ళ హీథర్ ప్రెస్డీ అనే మహిళకు కోర్టు 7 వందల సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
గంజాయి వ్యాపారం సామ్రాజ్యాన్ని సృష్టించిన వారిని గుంజీలు తీయిస్తానని పెమ్మసాని హెచ్చరించారు. గుంటూరులో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి గుట్కా, గంజాయి అమ్ముతున్నాడని ఘాటుగా విమర్శించారు. గుంటూరు జిల్లాను గంజాయి మత్తులో ముంచుతారా అంటూ నిలదీస్తున్నారు. గంజాయి మొక్కలను పీకి పారేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్ నుయూటీ చేసే కుట్ర జరుగుతున్నదని,దాన్ని తిప్పి కోట్టాలని బీఆర్ఎస్ అందుకున్న కొత్త పల్లవి కేవలం తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లోక్ సభ ఎన్నికలలో లబ్ధి పొందే ఎత్తుగడేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని యూటీ చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల ఆరోపించారు.
స్త్రీ, పురుషుల వైవాహిక స్థితి ఎలా వున్నప్పటికీ, పరస్పర అంగీకారంతో ఇద్దరు స్త్రీ పురుషులు శారీరక సంబంధం కలిగి వుంటే దాన్ని నేరం
రాజకీయ నాయకులంటే జనం చెవుల్లో పూలు పెట్టకపోతే కుదరదు. తెలంగాణ ప్రజల చెవుల్లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు