తుపాను బాధితులకు పరామర్శల వెల్లువ
Publish Date:Nov 5, 2012
Advertisement
తుపాను బాధితుల్ని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు, వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఒకేసారి కదిలారు. ముగ్గురూ వాళ్ల పర్యటనలకోసం హైదరాబాద్ నుంచి ఒకేసారి వస్తున్నారన్న వార్తతో గన్నవరం విమానాశ్రయంలో కోలాహలం కనిపిస్తోంది. సీఎం పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని తుఫాను బాధిత ప్రాంతాలలో పర్యటిస్తారు. చంద్రబాబు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో పర్యాటిస్తారు. వైయస్ విజయలక్ష్మి ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. నేతల రాక కోసం గన్నవరం విమానాశ్రయం వద్దకు ఆయా పార్టీల నేతలు చేరుకుంటున్నారు. నీలం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటివరకూ 27మంది మరణించారు. విశాఖ జిల్లాలో వరాహ, శారద, తాండవ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కరెంట్ లేక జనం అల్లాడుతున్నారు. చాలా ప్రాంతాల్లో భోజనం, తాగడానికి మంచినీళ్లు దొరక్క జనం తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాకుళంలో నెల్లిగడ్డ వాగు పొంగిపొర్లుతోంది. విజయనగరంలో పదికి పైగా చెరువులకు గండ్లు పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. పంట మునిగిపోయింది. చంపావతి నదికి వరద పోటెత్తింది. నీలం తుఫాను ప్రభావంతో గారలో అత్యధిక వర్షపాతం నమోదైంది. తుఫాను బాధిత ప్రాంతాలను సందర్శించనున్న నేపథ్యంలో చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర ఈ రోజు రద్దయింది.
http://www.teluguone.com/news/content/chandra-bau-yatra-23-18880.html
58 సంవత్సరాల వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్
పెంపుడు కుక్క యజమానిని కాల్చింది అంటే ఏదో ఫన్ని వీడియో అనుకుంటారు చాలా మంది. ఎందుకంటే ఫన్ని వీడియోలలో ఎక్కువగా అలాంటి సన్నివేశాలు చూసి నవ్వుకుంటాం. నిజజీవితంలో కూడా ఇలాంటి సంఘటన జరిగిందని తెలిసి ఆశ్చర్యపడుతున్నారు.
ఢిల్లీ లో గత నెల 16 వ తేదీన జరిగిన పారా మెడికల్ స్టూడెంట్ ఫై జరిగిన అత్యాచారంలో ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.
ఓ హత్య కేసులో నిందితునిగా ఉన్న గుంటూరు జిల్లా గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు బెయిల్ ప్రయత్నాలకు పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గండి కొట్టారు. కాంగ్రెస్ నాయకుడు ఉన్నం నరేంద్ర హత్య కేసులో యరపతినేని మూడవ నిందితునిగా ఉన్న విషయం తెలిసిందే.
గత నెల 28 న ఢిల్లీ లో తెలంగాణాఫై జరిగిన అఖిల పక్ష సమావేశంలో తెలంగాణా అనుకూల వైఖరి తీసుకొని ఆ ప్రాంతంలో ఎలాగో గట్టేక్కామని తెలుగు దేశం పార్టీ భావిస్తున్న సమయంలో ఆ పార్టీకి చెందిన ఆంధ్రా ప్రాంత నేతల నుండి పార్టీకి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇంతవరకు చంద్రబాబు ‘రెండుకళ్ళ’ సిద్దాంతంతో తెలంగాణా ప్రజలను మోసంచేస్తున్నాడని నిందించిన తెరాస, మొన్నజరిగిన అఖిలపక్షసమావేశంలో తెలుగుదేశంపార్టీ తెలంగాణాకి అనుకూల వైఖరిని ప్రకటించిన తరువాత, ఆపార్టీని మెచ్చుకోలేక, వ్యతిరేకించనూ లేక తెరాస ఇబ్బందుల్లో పడినట్లు కనిపిస్తోంది.
అసలే పోర్న్ స్టార్..ఇక జిస్మ్ల్ చిత్రంలో తన అందాలతో యువతను మత్తెక్కించి చిత్తుచేసింది. అలాంటి పోర్న్ స్టార్ డిసెంబరు 31న ఓ వేదిక మీద డాన్స్ చేయాలంటే మాటలా. తన ఫాలోయింగ్ ను బట్టి తను కూడా ఉంటుంది. అందం ఉన్నప్పుడు చూపిస్తేనే ఎవరయినా చూస్తారు.
అమెరికాకు చెందిన యువతి ఒలీవియా కల్ఫో మిస్ యూనివర్స్-2012గా ఎంపికయ్యారు. ఫిలిప్పిన్స్, వెనిజులాకు చెందిన యువతులు మిస్ యూనివర్స్ పోటీల్లో రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. భారత్కు చెందిన అందాల సుందరి శిల్పాసింగ్ టాప్-16వరకు వచ్చి నిలిచిపోయారు.
ఈ నెల 28 న ఢిల్లీ లో జరిగే అఖిల పక్ష సమావేశంలో తెలంగాణా కు వ్యతిరేకంగా మాట్లాడితే, తెలుగు దేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణా లో చేస్తున్న పాదయాత్రలు కాస్తా పరుగు యాత్రలుగా మారతాయని తెలంగాణా రాష్ట్ర సమితి ఎంఎల్ఎ కే. తారక రామా రావు హెచ్చరించారు.
అగ్రరాజ్యం అమెరికాలో ఉన్మాదుల కాల్పుల పర్వం కొనసాగుతూనే ఉంది. అమాయకుల ప్రాణాలకు అక్కడ విలువ లేదని వరుస సంఘటనలు రుజువు చేస్తున్నాయి.
మాజీ ఎం ఎల్ సి కాసాని జ్ఞానేశ్వర్ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారు.
ఇబ్రహీంపట్నంలో ఓ యువకుడు తనను ప్రేమించడం లేదని ఓ విద్యార్ధిని గొంతు కోసి చంపేశాడు. ఇబ్రహీంపట్నం కు చెందిన బాలరాజ్, భాగ్యలతల మొదటి కుమార్తె నిఖిత బికాం చదువుతూ, సిఏ కోచింగ్ తీసుకొంటోంది. బుధవారం సాయంత్రం రాఘవేందర్ ఆమె ఇంట్లోకి వచ్చి గొంతు కోసి చంపాడు.
నా తండ్రి విగ్రహాన్ని పార్లమెంటులో పెట్టి ఒక్కదాన్నే క్రెడిట్ కొట్టేయాలన్న ఆలోచన నాకు లేదు. నా తమ్ముడు బాలకృష్ణ అన్న మాటలు నాకు చాలా బాధకలిగించాయి. ఎన్టీఆర్ విగ్రహం అందరం కలిసి ఇద్దామని నా ఇంటికి వచ్చింది నిజమే. అయితే కుటుంబ సభ్యులు రాసిన లేఖ మీద సంతకం చేయాలని నన్ను అడగలేదు.





