ఇప్పటికైతే... ఓ.కె.!
Publish Date:Sep 20, 2012
Advertisement
ఈ మధ్యకాలంలో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా అంతా ఊగిసలాటధోరణే. ఏ క్షణంలో పడిపోతుందో తెలియదు, ఏ క్షణంలో ఎవరు అండగా వుంటామని వచ్చి చేతికి చేయూత ఇస్తారో తెలియదు. సినిమాలో ఒక్కరే అని పాత్రలు వేస్తే ఎలా వుంటుందో అలా అంతా గందరగోళం. ప్రజా సంక్షేమం, ప్రజాసేవ కంటే తమ ప్రభుత్వం నిలబడటానికి ఎంతమంది కావాలో లెక్కాపద్దులు చూసుకోవడంతోనే సరిపోతోంది కేంద్రప్రభుత్వానికి...! ఇదంతా ఎందుకంటే.. స్వయంకృతాపరాధాలే! ప్రజాభిప్రాయాలను ఏ మాత్రం పట్టించుకోకుండా, వారి సమస్యలను ఏ మాత్రం పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ప్రభుత్వంలో మిత్రపక్షమైన తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. గతంలో రిటైల్ మార్కెట్లోకి ఎఫ్డిఐలను అనుమతించడం వంటి చర్యను ఉపసంహరించుకోవాలని అందుకై ప్రభుత్వానికి గడువు ఇచ్చింది. అయినా ఎటువంటి స్పందన రాకపోవడంతో తన మద్దతును ఉపసంహరించుకుంది. తృణమూల్ మద్దతు ఉపసంహరించుకున్నా తమ ప్రభుత్వానికి ఏ ఢోకా లేదని ప్రభుత్వంలోని పెద్దలు చెబుతున్నారు. తృణమూల్ మద్దతు ఉపసంహరించుకున్నా మిత్రపక్షాలతో పాటు బయటనుండి మద్దతు ఇచ్చే మరో మూడు పార్టీల సంఖ్యాబలం కలుపుకుంటే సాధారణ మెజారిటీకంటే అధికబలం ఉన్నట్లే అవుతుంది. సంఖ్యాపరంగా బాగానే ఉన్నప్పటికీ, ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ఇచ్చి తమ మనుగడను మిగతా పార్టీలు ప్రశ్నార్ధకం చేసుకుంటాయో, లేదా మేము ప్రజాపక్షమని అందుకే ప్రజావ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా మద్దతు ఉపసంహరించుకున్నామని ప్రజలకు నిజాలను చెప్పే ప్రయత్నం చేస్తాయో.. వేచి చూడాల్సిందే...! ప్రభుత్వ నేతలు మాత్రం పరిపాలన విషయాలను పక్కనపెట్టి తమ ప్రభుత్వ మనుగడ కోసం చిట్కాలెక్కలతో కాలం గడిపేస్తున్నారన్నది విమర్శకుల విశ్లేషణ...!
http://www.teluguone.com/news/content/central-government-24-17510.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





