డబుల్, డూప్లికేట్ ఓట్లు తొలగించండి..ఈసీకి బీఆర్ఎస్ విజ్ఞప్తి..!

Publish Date:Jul 10, 2026

Advertisement

 

తెలంగాణలో ఓటరు జాబితాలో ఉన్న డబుల్, డూప్లికేట్ ఓట్లను తొలగించి ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రతినిధి బృందం శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి వినతిపత్రం సమర్పిం చింది. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో సమావేశమై తెలంగాణలో ఓటరు జాబితాలో ఉన్న అవకతవకలపై తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల విశ్వసనీయత ఓటరు జాబితా స్వచ్ఛతపై ఆధారపడి ఉంటుందని, అందువల్ల డబుల్, డూప్లికేట్ ఓట్లను వెంటనే గుర్తించి తొలగించే చర్యలు చేపట్టాలని కోరారు.

ఓటరు గుర్తింపు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడం ద్వారా ఒకే వ్యక్తి పేరుతో వేర్వేరు ప్రాంతాల్లో నమోదైన ఓట్లను సులభం గా గుర్తించి తొలగించవచ్చని బీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘానికి వివరించారు. ఈ విధానం అమలులోకి వస్తే నకిలీ, డూప్లికేట్ ఓట్ల సమస్యకు సమర్థవంతమైన పరిష్కారం లభించడంతో పాటు ఎన్నికల ప్రక్రియ మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా మారుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి పలు సూచనలు చేశారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించడంతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. 

అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో అనర్హులు, డూప్లికేట్ నమోదులను తప్పకుండా తొలగించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక, పారదర్శక ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టాలని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కోరింది. తాము సమర్పిం చిన వినతిపత్రంలోని అంశాలను సానుకూలంగా పరిశీలించి తగిన నిర్ణ యాలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది.
 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అమరావతి రాజధాని అంశం మళ్లీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎవరూ ఊహించని ఒక అనూహ్యమైన ఘోర ఘటన చోటుచేసుకుంది.
డీఎస్పీ భీమ్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ఆయన నివాసంతో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో పలుచోట్ల సోదాలు నిర్వహించారు.
మహిళా హక్కుల పరిరక్షణ, సమాజంలో లింగ సమానత్వాన్ని పెంపొందించే దిశగా అస్సాం
ఖమ్మం జిల్లా చింతకానిలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని కోరుతూ టీడీపీ నేతలు విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు
గగనతలంలో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య విమానంలో ఊహించని సాంకేతిక లోపం తలెత్తి తీవ్ర కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా చేపడుతున్న కూల్చివేతల వ్యవహారం మరోసారి రాజకీయ వేడిని రాజేసింది.
1000 కి.మీ. ప్రయాణించి.. గూగుల్ మ్యాప్స్‌తో వెతికి.. అప్పు తీర్చిన కేరళ స్నేహితుడు..!
పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం మధ్యాహ్నం చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి ఆయన విడుదలయ్యారు.
తెలంగాణలోని జనగామ జిల్లా కేంద్రంలో ఊహించని రీతిలో ఒక వింత ఘోరం జరిగింది.
ఓ యువకుడిని హీరోగా సినీ పరిశ్రమకు పరిచయం చేస్తానని నమ్మించి, అతని కుటుంబం నుంచి 3.5 కోట్లకు పైగా డబ్బులు తీసుకుని మోసం చేశారనే ఆరోపణలతో దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై కేసు నమోదైంది.
తమిళనాడు రాజకీయాల్లో కరూర్ తొక్కిసలాట ఉదంతం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.