ఏపీ ప్రభుత్వం అప్పుల కోసం కేంద్రం చుట్టూ ఎన్ని ప్రదక్షిణాలు చేసినా ఫలితం లేని పరిస్థితి తెలిసిందే. లెక్కల చిట్టాలు విప్పితే తప్ప కొత్త అప్పులకు నో అంటూ కేంద్రం ఏపీకి దాదాపుగా అప్పులకు మార్గం లేకుండా దారులు మూసేసింది. అయితే ధనిక రాష్ట్రం అయిన తెలంగాణకూ అప్పుల తిప్పలు తప్పడం లేదు.
రెండు రాష్ట్రాల అప్పుల తిప్పలకు కారణాలు వేరు వేరు అయినా ఫలితం మాత్రం ఇరు రాష్ట్రాలకూ ఒకేలా ఉంది. ధనిక రాష్ట్రమే అయినా, తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించే స్తోమత ఉన్నా కూడా తెలంగాణకు కేంద్రం మొండి చేయే చూపిస్తోంది. ఇక ఏపీ సంగతి తెలిసిందే. ఎందుకు అప్పు తీసుకుంటోందో అందుకు వ్యయం చేస్తుందన్న గ్యారంటీ లేదు. విపత్తు నిధులను సైతం సంక్షేమ పద్దుకు మరళించి వచ్చే ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి ఇన్వెస్ట్ చేసేసిన చరిత్ర ఏపీది. ఏపీకి రుణం అందక అవస్థలు పడటం ఆ రాష్ట్ర ప్రభుత్వ స్వయం కృతాపరాధమే. మరి తెలంగాణకూ అదే పరిస్థితి ఎందుకు? ఈ నిరాకరణ వెనుక రాజకీయం ఉందా?
మొదటి మూడు నెలల్లో ఆర్బీఐ నుంచి రూ. పదిహేను వేల కోట్లు అప్పు తెచ్చి పరిస్థితిుల్నిచక్క బెట్టుకుందామనుకున్న తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ఫలించలేదు. ఏప్రిల్ నెలలో రూ. ఐదు వేల కోట్ల అప్పు కోసం చేసిన ప్రయత్నాలకూ సేమ్ రిజల్ట్. తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేసి.. తమ అప్పులు.. గ్యారంటీలు.. కార్పొరేషన్ల అప్పుల వివరాలన్నింటినీ కేంద్రానికి పంపించినా, ఎఫ్ఆర్బీఎం లిమిట్స్ దాటేసిందన్న నెపంతో కేంద్రం కొత్త రుణాలకు మోకాలడ్డింది. ధనిక రాష్ట్రంగా చెప్పుకుంటూ, తాము చేసే అప్పులు భవిష్యత్ అభివృద్ధికి పెట్టుబడే నంటూ చెబుతున్న తెలంగాణ రాష్ట్రం కూడా నిబంధనలకు నీళ్లొదిలేసి పరిమితిని మించి అప్పులు చేసేసిందనడానికి ఇదే నిదర్శనం. తెలంగాణ కూడా అభివృద్ధి కంటే ఎన్నికల ముంగిట ఉచిత పందేరాల పథకాలకే అగ్ర తాంబూలమిచ్చి..మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చేస్తోందన్న విపక్షాల విమర్శలకు ఎఫ్ఆర్బీఎం లిమిట్ దాటేసి మరీ అప్పులు చేసిందన్న సమాచారం ఊతమిస్తోందని పరిశీలకులు అంటున్నారు. కేంద్రం నిర్వాకం కేవలం రాజకీయమేనని తెరాస ఎదురుదాడికి దిగినా గణాంకాల ఆధారంగా రాష్ట్ర పన్నుల వాటాలో కోత అనివార్యమని అర్దమౌతున్నది. తెలంగాణ పన్నుల రూపంలో రాష్ట్రానికి చెల్లించిన మొత్తం లెక్కలను చెబుతూ, గుజరాత్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలకు అప్పులకు అనుమతి చేసి తెలంగాణకు ఎందుకివ్వరన్న తెరాస విమర్శలు రాజకీయ ప్రయోజనాలకు పని కొస్తాయేమో కానీ, అప్పు పుట్టడానికి కాదు.ఇక ఏపీ అయితే ఏపీకి మాత్రం అలా తీసుకున్న అప్పులు, వాటిని వ్యయం చేసిన వివరాలు వెల్లడిస్తే.. అసలింక అప్పుపుట్టే పరిస్థితే ఉండదు. ఈ పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలు ఈ ఆర్థిక అడ్డంకులను అధిగమించడానికి ఏం చేస్తాయన్నది రానున్న రోజుల్లోనే తెలుస్తుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/center-demies-permission-for-new-debta-to-telangana-akso-39-135292.html
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో యూనిట్ ఇంఛార్జ్లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్రాజ్లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.