Publish Date:Jan 24, 2025
రాష్ట్రాల నుంచి ఉన్నత విద్యను లాగేసుకోవడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నది. ఇందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ను అలంబన చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. వీసీల ఎంపిక, నియమకాలకు సంబంధించిన నిబంధనల సవరణకు యూజీసీ సమాయత్తమైంది. ఈ మేరకు ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసింది. యూజీసీ ప్రస్తుత మార్గదర్శకాల మేరకు ప్రొఫెసర్గా కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉన్న విద్యావేత్తలు మాత్రమే వైస్ ఛాన్సలర్ పదవికి అర్హులౌతారు. అయితే కొత్త ప్రతిపాదన మేరకు పారిశ్రామిక రంగంలో లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో అదీ కాకపోతే పబ్లిక్ పాలసీ రంగంలో పదేళ్లకు పైగా అనుభవం ఉన్న వారిని కూడా వీసీల నియామకం విషయంలో పరిగణనలోనికి తీసుకునే అవకాశం ఉంటుంది. అనుభవం ఉన్న నిపుణులను కూడా పరిగణనలోకి తీసుకుంటామని యూజీసీ ప్రతిపాదించింది.
ఏ విధంగా చూసినా ఈ ప్రతిపాదన ఉన్నత విద్యలో రాష్ట్రాల హక్కులను, నిర్ణయాధికారాన్ని కాలరా స్తాయ నడంలో సందేహం లేదు. ఈ ప్రతిపాదనలు రాజ్యాంగ మూల సూత్రాలకు, ఫెడరల్ స్ఫూర్తికీ పూర్తిగా విరుద్ధం. ఈ కొత్త మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను, విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తికి భంగం కలిగిస్తాయి. ఈ కారణంగా యూజీసీ ప్రతిపాదనలను న్యూఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, తెలంగాణ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నాన్ అకడమిక్ వీసీల నియామకం, రాష్ట్ర ప్రభుత్వాలకు వీసీలసెర్చ్ కమి టీలతో సంబంధం లేకుండా చేయడం వంటి ప్రతిపాదనలు నిజంగా ఆందోళనకరంగానే ఉన్నాయి.
చట్టబద్ధమైన స్వతంత్ర సంస్థ అయిన యూజీసీని కేంద్రం తన సొంత ఎజెండా అమలుపరచేందుకు పావులా మార్చే ప్రయత్నమే ఇదన్న విమర్శలు విద్యాధికుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను కేంద్రం తన అధీనంలోకి తీసుకుంటూ రాష్ట్రాలపై తన విధానాలను బలవంతంగా రుద్దడానికి జరుగుతున్న కుట్రలా ఈ ప్రతిపాదనలను చూడాల్సి ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాలు, పౌర ప్రజా సంఘాలు, మేధావులు, రాష్ట్రాలలో అధికార, ప్రతిపక్ష ప్రభుత్వాలు తమ నిరసన తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/center-conspiracy-to-monopoly-on-higher-education-25-191767.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.