Publish Date:Mar 18, 2025
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతకు ఫిదా అయిన పారిశ్రామిక వేత్తలలో బిల్ గేట్స్ ఒకరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొలి సారిగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా బిల్ గేట్స్ తో చంద్రబాబు అనుబంధం కొనసాగుతూనే ఉంది. తొలి సారి బిల్ గేట్స్ తో భేటీకి చంద్రబాబు అప్పాయింట్ మెంట్ కోరినప్పుడు గేట్స్ అయిష్టంగానే అంగీకారం తెలిపారు. అయితే ఆ తొలి భేటీలోనే చంద్రబాబు విజనరీ బిల్ గేట్స్ ను ఆకట్టుకుంది. ఈ విషయాన్ని స్వయంగా గేట్స్ పలు సందర్భాలలో చెప్పారు.
ఇటీవల విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తరువాత చంద్రబాబు బిల్ గేట్స్ తో దావోస్ లో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గేట్స్ ఫౌండేషన్ కీలక రంగాలలో సహకారం అందించేందుకు అంగీకారం కుదిరింది. ఆ సందర్భంగా చంద్రబాబు పట్ల తనకు ఉన్న అభిమానాన్నిబిల్ గేట్స్ ఒక అపురూప బహుమతితో చాటారు. ఔను బిల్ గేట్స్ చంద్రబాబుకు తాను కాలేజీని వీడిన తరువాత మైక్రోసాఫ్ట్ కంపెనీని ఫ్లోట్ చేయడం నుంచి, తన జర్నీకి సంబంధించిన అనుభవాలు, విశేషాలతో కూడిన సోర్స్ కోడ్ బుక్ ను చంద్రబాబుకు బహుమతిగా ఇచ్చారు. బిల్ గేట్స్ ఇచ్చిన ఆ ఆపరూప కానుక నవ్యాంధ్ర పురోగతికి తాను చేసే కృషికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చంద్రబాబు ఆ సందర్భంగా చెప్పారు. అటువంటి అనుబంధం ఉన్న గేట్స్, చంద్రబాబు మరోసారి భేటీ కానున్నారు. ఈ భేటీకి ఢిల్లీ వేదిక కానుంది.
చంద్రబాబు మంగళవారం (మార్చి 18) సాయంత్రం హస్తిన పర్యటనకు బయలుదేరుతున్నారు. ఈ పుర్యటనలో భాగంగా చంద్రబాబు కేంద్ర మంత్రి, మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబంలో జరిగే ఓ వివాహ వేడుకకు హాజరౌతారు. ఆ తరువాత కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. అదే విధంగా ప్రధాని మోడీని కలిసి అమరావతి పనుల పున: ప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానిస్తారు. అలాగే బుధవారం (మార్చి 19) మధ్యాహ్నం బిల్ గేట్స్ తో సమావేశమౌతారు.
ఈ సమావేశంలో విద్య, వైద్యం, ఆరోగ్య రంగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య సహకార ఒప్పందం చేసుకుంటారు. ఈ కీలక రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ ఏపీ సర్కార్ కు సహకారం అందించే విషయంపై దావోస్ లో భేటీలో అంగీకారం కుదిరిన సంగతి తెలిసిందే. అనంతరం అదే రోజు సాయంత్రం సీఎం చంద్రబాబు హస్తిన నుంచి అమరావతికి తిరిగి వస్తారు. ఆ మరునాడు అంటే గురువారం (మార్చి20) అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు. అనంతరం అదే రోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెడతారు. శుక్రవారం (మార్చి 21) తిరుమలేశుని దర్శించుకుంటారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cbn-to-meet-bill-gates-in-delhi-39-194578.html
Publish Date:Mar 11, 2026
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండుసార్లు, కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.