బాబు మొదలెట్టేశారు.. పాలన ఇక పరుగులే!

Publish Date:Jun 28, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన మార్క్ పని తీరును చూపుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై   వరుస సమీక్షలు నిర్వహించనున్నారు. అలాగే శాఖల వారీగా సమీక్షలకు సైతం ఆయన రెడీ అయిపోయారు. వర్షా కాలం కావడంతో ఆయన తొలుత వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష చేయాలని నిర్ణయించారు. శుక్రవారం (జూన్ 28) సాయంత్రం నాలుగు గంటలకు ఆయన వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నివారణకు తీసుకోవలసిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. అలాగే ఆ శాఖలో తక్షణం చేపట్టాల్సిన చర్యలు, దీర్ఘకాళిక ప్రణాళికపై చర్చించనున్నారు. 

అదలా ఉండగా ఆయన అధికారుల నియామకాలపై కూడా దృష్టి పెట్టారు. ఇప్పటికే తన ముఖ్య కార్యదర్శిగా పీయూష్ కుమార్ ను నియమించారు. ఆర్థిక శాఖ బాధ్యతలను కూడా ఆయనకు అదనంగా అప్పగించారు. ఇక కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్ గా మహేష్ చంద్ర లడ్డాను నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే చంద్రబాబు లడ్డాను కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేసి రాష్ట్రానికి పంపాలని లేఖ రాశారు. ఆయన లేఖ మేరకు లడ్డాను రాష్ట్ర సర్వీసుకు పంపిస్తే కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 1988 ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన లడ్డా 2019లో విశాఖ పోలీసు కమిషనర్ గా పని చేశారు.  నిజయతీపరుడు, సమర్ధుడైన అధికారిగా పేరున్న లడ్డాను ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించే అవకాశాలున్నాయని అంటున్నారు. 

ఇక జగన్ హయాంలో  ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు అధికారులకు సైతం చంద్రబాబు సర్కార్ పోస్టింగులు ఇచ్చింది.  వారిలో జగన్ ఆడమన్నట్లల్లా ఆడి ఆయన తొత్తుగా పని చేశారన్న ఆరోపణలు ఎదుర్కొని చంద్రబాబు సర్కార్ వచ్చాకా సెలవుపై వెళ్లిన మాజీ సీఎస్ జవహర్ రెడ్డికి సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పోస్టింగ్ లభించింది. ఆయన త్వరలో పదవీ విరమణ చేయనున్న సంగతి విదితమే. ఇక జగన్ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్యకు సాధారణ పరిపాలన శాఖలో ప్రధాన కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు.  

అదే విధంగా తొలి కేబినెట్ లో నిర్ణయించిన విధంగా శ్వేతపత్రాల విడుదల విషయంలోనూ చంద్ర బాబు స్పీడ్ పెంచారు. ముందుగా ప్రకటించినట్లుగా పోలవరంపై శుక్రవారం (జూన్ 28) శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులపై వాస్తవాలను చంద్రబాబు సర్కార్ ఈ శ్వేత పత్రంలో విడుదల చేయనుంది. కేంద్రం నియమించిన అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరం పరిశీలనకు శనివారం (జూన్ 29)న రానున్న సంగతి తెలిసిందే. పోలవరం నిర్మాణాలను పరిశీలించి ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కేంద్ర బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా పోలవరం పునులను చేపట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. 

By
en-us Political News

  
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం.
2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.
ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.