జవహర్ రెడ్డి పట్ల బాబు ఉదారత.. మాజీ సీఎస్ సిగ్గుతో చితికిపోయి ఉంటారుగా?

Publish Date:Jun 28, 2024

Advertisement

జగన్ అధికారంలో ఉన్నంత కాలం ఆయన అడుగులకు మడుగులొత్తి, ఆయన తొత్తులుగా పని చేసిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇప్పుడు జగన్ సర్కార్ కూలిపోయిన తరువాత చంద్రబాబు సర్కార్ లోనూ మంచి హోదాలలో కొనసాగుతున్నారు. సహజంగానే ఇది తెలుగుదేశం అభిమానులు, శ్రేణులలో తీవ్ర అసంతృప్తికి కారణమైంది.  ఎందుకంటే ఈ అధికారులు జగన్ కు వీర భక్త హనుమాన్ స్థాయిలో జగన్ కు ఊడిగం చేశారు. జగన్  చూసి రమ్మంటే వీరు కాల్చి వచ్చిన చందంగా వ్యవహరించారు. జగన్ మెప్పు పొందడమే లక్ష్యంగా విపక్ష నేతలను, కార్యకర్తలను నానా ఇబ్బందులకూ గురి చేశారు. నిబంధనలనేవి ఉండవనీ, జగన్ కు నచ్చినట్లుగా వ్యవహరించడమే ఏపీలో ఉన్న ఏకైక నిబంధన అని వాళ్లు నమ్మడమే కాుద, జనం కూడా నమ్మి తీరాలు, విపక్షాలూ అందుకు అంగీకరించాలని అన్నట్లుగా కొందరు అధికారుల తీరు జగన్ హయంలో ఉండింది. 

గతంలో అంటే ఎన్నికలకు ముందు పలు సందర్భాలలో చంద్రబాబు క సీనియర్ మోస్ట్ అధికారి ఒకరు హైదరాబాద్ లో తన నివాసానికి మారు వేషంలో వచ్చి జగన్ తీరు గురించి వివరించి ఆయన ఆదేశాలు పాటించకుంటే ప్రాణాలతో ఉంటామన్న నమ్మకం లేదని అన్న సంగతిని చెప్పారు. అయితే చంద్రబాబు ఆ అధికారి పేరు బయటపెట్టలేదు. అదీ చంద్రబాబు మంచితనం, హుందాతనం. ఇప్పుడు కూడా చంద్రబాబు అదే హుందాతనాన్ని మంచి తనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయన తీరు పట్ల సొంత పార్టీ నేతలూ, క్యాడర్ లో ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతున్నప్పటికీ బై అండ్ లార్జ్ చంద్రబాబు తీరు ఆయన గొప్పతనానికి నిదర్శనమన్న అభిప్రాయమే వ్యక్తం అవుతోంది. 

జగన్ హయాంలో ఆయనకు తొత్తుగా, నిబంధనలు అన్నవి ఉంటాయన్న స్ఫృహే లేకుండా ఇష్టారీతిగా వ్యవహరించిన మాజీ సీఎస్ జవహర్ రెడ్డికి బాబు ఎంతో ఉదారంగా, హుందాగా ఆయన రిటైర్ అయ్యే చివరి రోజు పోస్టింగ్ ఇచ్చారు. అలాగే నిబంధనలను తుంగలోకి తొక్కి జగన్ అడుగులకు మడుగులొత్తేలా పని చేసిన మరో ఐఏఎస్ అధికారిణి పూనం మాలకొండయ్యకూ ఆమె రిటైర్మంట్ కు ముందు రోజే పోస్టింగ్ ఇచ్చి గౌరవంగా రిటైర్ అయ్యే అవకాశం కల్పించారు. 

కక్షలూ కార్పణ్యాలూ తన నైజం కాదనీ ఈ చర్యల ద్వారా చంద్రబాబు విస్పష్టంగా చాటారు. సరిగ్గా రిటైర్మెట్ రోజున పోస్టింగ్ ఇచ్చి మర్యాదగా, గౌరవంగా రిటైరయ్యే అవకాశం దక్కడం నిజంగా జవహర్ రెడ్డి కూడా ఊహించి ఉండరు. చంద్రబాబు హుందాతనం, ఉదారత్వం చూసి ఆయన సిగ్గుతో తలదించుకునే ఉంటారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీవీ విషయంలో జగన్ ఆదేశాల మేరకు తానెంత కర్కశంగా, కృూరంగా వ్యవహరించానో జవహర్ రెడ్డికి గుర్తొచ్చే ఉంటుంది. అప్పటి తన తీరు పట్ల కచ్చితంగా రిపెంట్ అయ్యే ఉంటారు. సిగ్గుతో చితికిపోయే ఉంటారు.

By
en-us Political News

  
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం.
2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.
ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.