నందమూరి బాలకృష్ణకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీమణి, బాలకృష్ణ సోదరి అయిన నారా భువనేశ్వరి ఫ్యామిలీ పార్టీ నిర్వహించారు. ఈ కుటుంబ వేడుకలకు చంద్రబాబు హాజరయ్యారు. అలాగే ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, నారా, నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ ఫ్యామిలీ పార్టీ ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. నవ్వుల పారిజాతాలు పూశాయి. ముఖ్యంగా చంద్రబాబు లోని హాస్యచతురత ఈ పార్టీలో అదనపు ఆకర్షణగా నిలిచింది. చంద్రబాబు చమత్కార బాణాలకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి కూడా దీటుగా హాస్యస్ఫోరకంగా ఇచ్చిన సంభాషణలు పార్టీలో నవ్వులు పూయించాయి.
ఈ పార్టీకి ముఖ్యఅతిథిగా హాజరైన చంద్రబాబుకు మైక్ అందిస్తూ నారా భువనేశ్వరి ఇది రాజకీయ పార్టీ కాదు.. బాలకృష్ణ గురించి మాట్లాడండి, రాజకీయ ప్రసంగంలా గంటలతరబడి కాదు కేవలం ఐదు నిముషాలు మాత్రమే మాట్లాడండి అంటూ టైమ్ లిమిట్ విధించారు. నవ్వుతూ మైక్ అందుకున్న చంద్రబాబు తానిప్పుడు ఇద్దరి మధ్యా ఇరుక్కు పోయానంటూ చమత్కరించారు. ఒక వైపు బాలా మరోవైపు భువనేశ్వరి మధ్యలో నేను అంటూ తన ప్రసంగం మొదలెట్టిన చంద్రబాబు వీళ్లిద్దరి మధ్యన ఉంటే చాలా డేంజర్ అన్నారు. ఆ తరువాత బాలకృష్ణపై ప్రశంసల వర్షం కురిపించారు. నిన్నటిదాకా అల్లరి బాలయ్య… ఇప్పుడు పద్మభూషణుడు అన్న చంద్రబాబు, ఎన్టీఆర్ ను గుర్తుపెట్టుకునేలా బాలయ్య నడుచుకుంటున్నారనీ, అందుకు ఎంతో గర్వంగా ఉందనీ చెప్పారు. బాలకృష్ణకు పద్మభూషణ్ రావడం మా కుటుంబానికి గర్వకారమన్నారు.
అక్కడితో ఆగకుండా బాలకృష్ణ తనకంటే సీనియర్ అంటూ ఆటపట్టించారు. తన పొలిటికల్ కెరియర్ కంటే బాలకృష్ణ సినిమా కెరియరే ముందు మొదలైందన్నారు. ఇక బసవరామతారకం క్యాన్సర్ ఆస్పత్రిని అద్భుతంగా తీర్చిదిద్దారంటూ బాలకృష్ణ ను పొగడ్తలతో ముంచెత్తారు. బాలకృష్ణ ఈ ఆస్పత్రి బాధ్యతలు చేపట్టిన తరువాతే దేశంలో అగ్రగామి ఆస్పత్రులలో ఒకటిగా బసవరామతారకం ఆస్పత్రి నిలిచిందన్నారు. బాలకృష్ణ తరచుగా తన అర్ధాంగికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని సిఫారసు చేస్తుంటారనీ, అయితే ఆమెను మెప్పించడానికే ఆయన అలా చేస్తున్నారని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cbn-helarious-jokes-in-family-party-39-192258.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!