తప్పు చేస్తే వదలను.. తన, పర బేధం ఉండదు.. చేతలతో చెప్పిన చంద్రబాబు!

Publish Date:Apr 27, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు హుందాతనంతో మెలగాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదే పదే  చెబుతున్నారు. ఎవరైనా తప్పు చేస్తే తాను వదిలిపెట్టననీ, వారిపై చర్యలు తీసుకునే విషయంలో తన, పర బేధం చూడననీ స్పష్టం చేస్తున్నారు. ఆ విషయాన్ని మాటలతోనే కాకుండా చేతల ద్వారా చేసి చూపుతున్నారు.  తాజాగా తిరుపతి జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఒక ఘటనపై చంద్రబాబు స్పందించిన తీరు సర్వత్రా ప్రశంసలందుకుంటోంది.  కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అనుచరులు టోల్ ప్లాజా సిబ్బందిపై దౌర్జన్యానికి దిగడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  కఠినంగా స్పందించారు.

తిరుపతి హైవేపై ఉన్న ఒక టోల్ ప్లాజా వద్ద  ఎమ్మెల్యే సురేంద్ర బాబు అనుచరులు, టోల్ సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే వర్గీయులు సహనం కోల్పోయి, అక్కడి సిబ్బందిపై  భౌతిక దాడికి దిగారు. టోల్ చెల్లింపు విషయంలో లేదా వాహనం వెళ్లే క్రమంలో తలెత్తిన చిన్న వివాదం చినికి చినికి గాలివానలా మారి, ఎమ్మెల్యే అనుచరుల వీరంగమాడారు. ఇందుకు  సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల అనుచరులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఏమాత్రం సహించబోమని ఆయన స్పష్టం చేశారు.

ఈ వివాదంపై తక్షణమే విచారణ జరపాలని,  బాధ్యులైన వారిపై  కేసులు నమోదు చేయాలని ఉన్నతాధికారులను   ఆదేశించారు. కేవలం ఆదేశాలతో ఆగకుండా..  కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబును పిలిపించి చంద్రబాబు గట్టిగా మందలించినట్లు తెలుస్తోంది. పార్టీ ఇమేజ్ దెబ్బతినేలా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదనీ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

గతంలో వైసిపి నేతల అహంకారపూరిత ధోరణి వల్ల ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించున్న సంగతి తెలిసిందే. తప్పు చేసిన తమ పార్టీ నేతలను జగన్ వెనకేసుకు వచ్చిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అయితే  చంద్రబాబు మాత్రం అందుకు భిన్నం.  పాలనలో పారదర్శకత, అధికారుల పనితీరుపై నిరంతరం సమీక్షలు నిర్వహించడమే కాకుండా  ఇప్పుడు సొంత పార్టీ నేతలైనా సరే తప్పే చేస్తే సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు,  వారి అనుచరులు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్న సంకేతాన్ని తన తాజా చర్య ద్వారా చంద్రబాబు విస్పష్ట సంకేతం ఇచ్చారు. 

చంద్రబాబు ఆదేశాలతో కదిలిన పోలీసు యంత్రాంగం  టోల్ ప్లాజా సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై   కేసులు నమోదు చేసే ప్రక్రియ ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాడికి పాల్పడిన వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు అయినప్పటికీ.. వెనక్కి తగ్గకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన ఆదేశాలు అందడంతో పోలీసులు వేగంగా కదులుతున్నారు. 

By
en-us Political News

  
యూసుఫ్ అఫ్రిది ఎల్ఈటీలో ఫీల్డ్ కమాండర్ మాత్రమే కాదు.. ఆ సంస్థకు ఒక మేధావిగా, సిద్ధాంతకర్తగా కూడా గుర్తింపు పొందాడు. ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రాంతంలో ఉగ్రవాదుల నియామకాలు, వారికి ఆయుధ శిక్షణ, స్థానిక నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంలో కీలకంగా వ్యవహరించేవాడు.
కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
ఈ సమీక్షకు పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సివిల్ సప్లై ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమస్య పరిష్కారానికి ఆదివారం రాత్రి నుంచి ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలపై సీఎం అధికారులను వివరణ కోరారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అంబర్‌పేట్ చే నంబర్ చౌరస్తా వద్ద సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
సాంకేతిక నిపుణులకు ఆండ్రాయిడ్ అందించే డెవలపర్ ఆప్షన్స్ ఒక అద్భుతమైన వరం. ఐఫోన్‌లో ఇటువంటి నియంత్రణ పొందాలంటే ఎక్స్-కోడ్ వంటి పరికరాల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆండ్రాయిడ్‌లో నేరుగా ఫోన్ నుండే యానిమేషన్ వేగాన్ని మార్చుకోవడం.. బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ నియంత్రించడం వంటి వాటి ద్వారా ఫోన్ వేగాన్ని పెంచుకోవచ్చు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం ఈసారి ఆసక్తికర సంకేతాలను ఇస్తోంది.
అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) అంచనా ప్రకారం, ఒకవేళ ఈ దిగ్బంధనం ఇలాగే కొనసాగితే యూరప్ వద్ద ఉన్న నిల్వలు మరో ఆరు వారాలకు సరిపోవడమే గగనం. ఇది చరిత్రలోనే అతిపెద్ద ఇంధన భద్రతా సంక్షోభంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారతీయ సంస్కృతిలో మాతృదేవో భవ అనే వాక్యానికి అక్షర రూపం ఇచ్చారు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు సోదరులు.
ఐటీ వర్సెస్ ఏఐ అనేది ఒక యుద్ధంలా కాకుండా, ఒక పరిణామంలా చూడాలంటారు నిపుణులు. నిజం చెప్పాలంటే.. ఏఐ వల్ల ఉద్యోగాలు పోవు, కానీ ఉద్యోగాల స్వ‌రూప‌- స్వభావాలు మారిపోతాయంటున్నారు.
హైదరాబాద్ నగరంలో మళ్ళీ ఇంధన సంక్షోభం మొదలైంది.
గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 7 శాతం అధికం. రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ ఆదాయం 2025-26 సంవత్సరంలో రూ.40,209 కోట్లకు పెరిగింది. తెలంగాణ ఏర్పడిన అనంతరం తొలిసారిగా రూ. 40 వేల కోట్ల ఆదాయానికి చేరుకోవడం ఒక కొత్త రికార్డు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.