తాడేపల్లి ప్యాలెస్ డొంకలు కదులుతున్నాయా?

Publish Date:May 26, 2023

Advertisement

వివేకా హత్య కేసులో తాడేపల్లి ప్యాలెస్ డొంకలు కదులుతున్నాయా? అంటే సీబీఐ శుక్రవారం(మే26) తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన అడిషనల్ కౌంటర్ అఫిడవిట్ ఔననే అంటోంది. అవినాష్ సీబీఐ విచారణకు సహకరించకపోవడం, అరెస్టును తప్పించుకోవడానికి ఉన్న దారులన్నీ ఉపయోగించుకుంటూ.. చివరకు ఆ దారులన్నీ మూసుకుపోయిన తరువాత అనుచరులు, పోలీసులను అడ్డుపెట్టుకుని కర్నూలు విశ్వ భారతి ఆస్పత్రిలో షెల్టర్ పొంది.. ముందస్తు బెయిలు విచారణ వేకేషన్ బెంచ్ చేపట్టేలా ఆదేశాలివ్వాలంటూ సుప్రీంను ఆశ్రయించడం తోలిపిందే. ఒక ఎంపి, అదీ అధికార పార్టీ ఎంపీ కేంద్ర దర్యాప్తు సంస్థను ఇలా ముప్పు తిప్పలు పెట్టడమేమిటన్న ఆనుమానాలు అందరిలో వ్యక్తమయ్యాయి. చివరకు తెలంగాణ హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో ఈ అనుమానాలకు సమాధానాలు దొరికాయి. ఆ కౌంటర్ అఫిడవిట్ లో సీబీఐ జగన్ పేరు ప్రస్తావించింది. వివేకా హత్య గురించి జగన్ కు ప్రపంచానికి తెలియడం కంటే ముందే తెలుసునన్నది తమ అనుమానమని, ఆ విషయాన్ని అవినాష్ రెడ్డే ఆయనకు తెలిపాడని సీబీఐ పేర్కొంది. వివేకా హత్యను మందుగా చూసినట్లుగా చెబుతున్న ఎంవీ కృష్ణారెడ్డి ఆ విషయాన్ని బయటకు వెళ్లడించడానికి ముందే..   హత్య జరిగిందన్న విషయాన్ని అవినాష్ జగన్ కు చెప్పారా అనేది దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ తన అడిషనల్ కౌంటర్ అఫిడవిట్ లో పేర్కొంది.   శుక్రవారం సీబీఐ తప వాదనలు వినిపించలేదు. అవినాష్ రెడ్డి, సునీత తరపు లాయర్లు వాదనల అనంతరం కోర్టు అవినాష్ ముందస్తు బెయిలు విచారణను శనివారం (మే 27)కు వాయిదా వేసింది. దీంతో శనివారం(మే27) సీబీఐ తరపు లాయర్లు వాదనలు వినిపించనున్నారు. ఈ సందర్భంగా వివేకా కేసులో జగన్ అంశంపై మరిన్ని కీలక విషయాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే వివేకా హత్య జరిగిన రోజు తెల్లవారుజామున నాలుగున్నర గంటలకే జగన్  హత్య గురించి.. తనతో పాటు సమావేశంలో ఉన్న వారికి చెప్పారన్న ప్రచారం జరిగింది. ఆ నలుగురిలో ఒకరైన మాజీ సీఎస్, ప్రభుత్వ సలహాదారు కల్లాం అజేయరెడ్డి ఇటీవల మీడియా సమావేశం పెట్టారు. తాను సీబీఐకి వాంగ్మూలం ఇచ్చానని వెల్లడించారు కూడా. అలాగే జగనే తమకు వివేకానందరెడ్డి చనిపోయారని చెప్పారని..అయితే గుండెపోటా కాదా అన్నది మాత్రం చెప్పలేదన్నారు. మరో వైపు ఉదయమే వివేకా హత్య గురించి బయట ప్రపంచానికి తెలియక ముందే అవినాష్ రెడ్డి .. జగన్‌, భారతి పీఏలకు ఫోన్లు చేసి.. మాట్లాడారని గుర్తించిన సీబీఐ గుర్తించి వారినీ విచారించింది. ప్రశ్నించింది. దీంతో శనివారం (మే 28) తెలంగాణ హైకోర్టులో అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్ విచారణలో మరిన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.

ఇలా ఉండగా  సీఎం జగన్మోహన్ రెడ్డి  ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇక  అవినాష్ రెడ్డి తన తల్లిని హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించి అక్కడే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి ముందు సీన్ హైదరాబాద్ ఆస్పత్రి ముందు రిపీట్ అవుతుందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి.  ఇందుకూ కారణాలు లేకపోలేదు.

  వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా కడప ఎంపీ  అవినాష్ రెడ్డికి నోటీసులు ఇస్తే చాలు ఏపీ సీఎం జగన్ తన పర్యటనలను, కార్యక్రమాలను రద్దు చేసేసుకుంటారు. గతంలో   మూడుసార్లు అదే జరిగింది.  అందులో రెండు సార్లు ఆయన హుటాహుటిన హస్తిన బయలుదేరి వెళ్లారు. అలా వెళ్లిన ప్రతి సారీ సీబీఐ దర్యాప్తులో వేగం మందగించింది.  ఇక ఈ నెల 19 నుంచి అవినాష్ సీబీఐతో టామ్ అండ్ జెర్రీ ఆట ఆడుతున్నారు. మే 19న ఆయన సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉండగా తల్లి అనారోగ్యం కారణంతో విచారణకు డుమ్మా కొట్టారు. సరే మే 22న విచారణకు రావాలని సీబీఐ మరో సారి నోటీసులు ఇస్తే వాటినీ ఖాతరు చేయలేదు. సుప్రీం ను ఆశ్రయించి హైకోర్టులో పెండింగ్ లో ఉన్న తన ముందస్తు బెయిలు పిటిషన్ విచారణ పూర్తయ్యే వరకూ సీబీఐ అరెస్టు చేయకుండా ఆదేశించాలని కోరారు.

అరెస్టు చేయకుండా ఆదేశాలు జారీ చేయకుండానే.. ముందస్తు బెయిలు పిటిషన్ విచారించి ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా సుప్రీం కోర్టు తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఈ లోగా అవినాష్ సీబీఐకు రాసిన లేఖలో తల్లి అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేననీ, మే 27 తరువాత ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానంటూ లేఖ రాశారు. ఆ లేఖే మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ఎందుకంటే జగన్ ముందుగా శుక్రవారం( మే26) నుంచి మూడు రోజుల పాటు హస్తిన పర్యటనలో ఉంటారు. అంటే ఆయన హస్తిన పర్యటనకూ అవినాష్ సీబీఐ విచారణకు హాజరు కాకపోవడానికి లింకు ఉందని పరిశీలకులు గత సంఘటనలను ఉటంకిస్తూ విశ్లేషిస్తున్నారు. జగన్ ఏ కారణాలు చెప్పి హస్తిన వెళ్లినా.. ఆయన పర్యటన లక్ష్యం మాత్రం ఎలాగోలా సీబీఐ అరెస్టు నుంచి అవినాష్ ను బయటపడేయడమేనని పరిశీలకులు అంటున్నారు. ఆ పని  జగన్ చేసుకు వస్తారన్న ఆశతోనే మే 27 వరకూ విచారణకు హాజరు కాలేనని అవినాష్ సీబీఐకి లేఖ రాశారని అంటున్నారు.

తండ్రి భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్టు చేసి ఇంత కాలమైనా ఇప్పటి వరకూ ఆయనకు బెయిలు కోసం కనీసం దరఖాస్తు కూడా చేయని అవినాష్ రెడ్డి, జైలులో ఉన్న తండ్రిని ఒక్కసారి కూడా ములాఖత్ ద్వారా కలవని అవినాష్ రెడ్డి.. తన దాకా వచ్చే సరికి మాత్రం  బెంబేలెత్తిపోతున్నారు. జైలులో ఉన్న అవినాష్ రెడ్డి తండ్రి అస్వస్థతకు గురి కావడంతో ఆయనకు ఉస్మానియాలో చికిత్సకు శుక్రవారం (మే26) తీసుకువచ్చి తిరిగి జైలుకు తరలించారు. ఆ సందర్భంగా కూడా అవినాష్ కనీసం ఆయనకు చూడటానికి ఉస్మానియాకు వెళ్లలేదు. ఇవన్నీ చూస్తుంటే అవినాష్ జగన్ హస్తిన పర్యటనపై చాలా ఆశలు పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కానీ ఇప్పుడు సీబీఐ తన అడిషనల్ కౌంటర్ అఫిడవిట్ లో స్వయంగా తన పేరే ప్రస్తావించడంతో జగన్  అవినాష్ ను కాపాడేందుకు ఢిల్లీ పెద్దల వద్ద ఒక వేళ ఏమైనా ప్రయత్నాలు చేసినా అవి ఫలిస్తాయా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. 

By
en-us Political News

  
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.