హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మాజీ ఐపీఎస్ అధికారి ఏ.కే. ఖాన్ కుమారుడు మొహ్సిన్ ఖాన్తో పాటు తబ్రేజ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. సినీ నిర్మాత వెంకట అనీష్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తాను నిర్మిస్తున్న 'మహారాగ్ని' సినిమాకు పెట్టుబడిదారు లను పరిచయం చేస్తామని మొహ్సిన్ ఖాన్, తబ్రేజ్ హామీ ఇచ్చారని బాధితుడు సినీ నిర్మాత పేర్కొన్నారు. ఈ క్రమంలో పెట్టుబడిదారులతో సమావేశాలు ఏర్పాటు చేస్తామని, సినిమా కోసం భారీ పెట్టుబడులు సమకూ రుస్తామని నమ్మబలికి తన నుంచి మొత్తం రూ.50 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు.
ఇందులో మొహ్సిన్ ఖాన్కు రూ.25 లక్షలు, తబ్రేజ్కు మరో రూ.25 లక్షలు మూడు విడతల్లో నగదు రూపంలో అందజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.అయితే డబ్బులు తీసుకున్న తర్వాత పెట్టుబడిదారులను పరిచయం చేయకపోవడం తో పాటు, ప్రతి సారి ఏదో ఒక కారణం చెబుతూ కాలయాపన చేశారని బాధితుడు ఆరోపించాడు. దీంతో అనుమానం వచ్చి డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా, కార్యాలయానికి రావాలని చెప్పి అక్కడ బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో వివరించారు.
తనను బౌన్సర్లతో చుట్టుముట్టించి, ఆయుధాలు చూపిస్తూ భయభ్రాంతులకు గురి చేశారని, డబ్బులు అడుగుతావా... నీకు ఏం జరుగుతుందో చూద్దాం అంటూ మొహ్సిన్ ఖాన్ బెదిరించాడని బాధితుడు ఆరోపించాడు. అంతేకాకుండా తనపై దాడి కూడా జరిగిందని, తబ్రేజ్ ఫోన్ ద్వారా పలుమార్లు బెదిరింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. మొహ్సిన్ ఖాన్, తబ్రేజ్ల నుంచి తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్లు 126(2), 115(2), 352, 351(2), 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆరోపణల్లో వాస్తవాలు ఏ మేరకు ఉన్నాయనే దానిపై ఆధారాలు సేకరిస్తూ అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/case-against-retired-ips-officer-ak-khans-son-36-224871.html
ఈ లీగల్ బ్యాటిల్లో ప్రశ్న రావణ్ తరఫున వాదించడానికి ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ రంగంలోకి దిగారు. రావణ్ పై ఎన్ని కేసులైనా పెట్టుకోండి, అతడిని బెయిలుపై బయటకు తీసుకువస్తానని జడశ్రావణ్ కుమార్ ప్రకటించారు.
వ్యాపార పెట్టుబడుల పేరుతో నమ్మించి, విదేశాల నుంచి మహిళలను రప్పించి, వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఉదంతం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ అమానుష కాండలో పాకిస్థాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి అయిన ఇషాక్ దార్ సమీప బంధువు ప్రధాన నిందితుడిగా ఉండటం పాక్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది.
పోలీస్, జైళ్లు, అగ్నిమాపక శాఖ, అలాగే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వంటి విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం 7వేల పోస్టులలో ఇప్పటికే 5వేల పోస్టుల భర్తీకి సంబంధించిన జీవోలను జారీ చేసింది. మిగిలిన 2వేల పోస్టులకు సంబంధించిన జీవోలు కూడా నేడో రేపో వెలువడనున్నాయని అధికార వర్గాల సమాచారం.
బండ్ల గణేష్, ఆయన తండ్రి, సోదరుడు ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్న శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ వ్యాపార అవసరాల కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి భారీ మొత్తంలో రుణాలు తీసుకుంది. ఈ బ్యాంకు రుణాలకు గ్యారెంటీగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్పేట్లో ఉన్న సుమారు 500 గజాల నివాస భవనాన్ని వారు తాకట్టు పెట్టారు.
ఐపీఎల్ 2026 సీజన్లో అసాధారణ ఆటతీరుతో వెలుగులోకి వచ్చిన ఈ యంగ్ బ్యాటర్ ఇంటర్నేషనల్ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వైభవ్కు తుది జట్టులో చోటు దక్కకపోవడంపై క్రికెట్ దిగ్గజాల విమర్శించడమే కాకుండా, సోషల్ మీడియా వేదికగా కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లక్ష్యంగా నెటిజనులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఇరాన్ మాజీ అత్యున్నత నాయకుడు (సుప్రీం లీడర్) అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల క్రతువుకు సంబంధించి అంతర్జాతీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలోని ప్రముఖ ప్లాట్ఫారమ్ ఇన్స్టాగ్రామ్పై భారత ప్రభుత్వం అత్యంత తీవ్రమైన చర్యకు ఉపక్రమించింది.
రాష్ట్ర పోలీసు శాఖ పని తీరును మరింత ప్రజలకు చేరువ చేసే దిశగా డీజీపీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ జరిగి దశాబ్ద కాలం దాటినా, రాష్ట్రానికి ఒక శాశ్వతమైన, తిరుగులేని రాజధానిని నిర్మించుకోలేకపోవడం తెలుగు జాతి దురదృష్టం.
ఆంధ్రప్రదేశ్లోని మామిడి సాగుదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది.
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ ఏడాది జూన్ నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి.