క్యాంపు ఆఫీసుల్లో కాదు..ప్రజల్లో కనిపించండి..పోలీసులకు డీజీపీ ఆదేశం

Publish Date:Jul 3, 2026

Advertisement

 

రాష్ట్ర పోలీసు శాఖ పని తీరును మరింత ప్రజలకు చేరువ చేసే దిశగా డీజీపీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎస్సై స్థాయి నుంచి పైస్థాయి అధికారుల తో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కింది స్థాయి పోలీసుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, ఇకపై పోలీసింగ్‌లో స్పష్టమైన మార్పు కనిపించాలని ఆదేశించారు. పోలీసులు క్యాంపు కార్యాలయాలు, స్టేషన్‌లకే పరిమితం కాకుండా ఎక్కువ సమ యం ప్రజల మధ్య గడపాలని డీజీపీ స్పష్టం చేశారు. ప్రతి పోలీసు అధికారి తన పరిధిలోని ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవాలని, ఫిర్యాదులు వచ్చిన తర్వాత స్పందించడం మాత్రమే కాకుండా ముందస్తు చర్యలు తీసుకునే విధంగా పనిచేయాలని సూచించారు."

విజిబుల్ పోలీసింగ్" ప్రతి పోలీసు అధికారికి అత్యంత ముఖ్యమైన బాధ్యత అని డీజీపీ పేర్కొన్నారు. ప్రజలకు పోలీసులు కనిపిస్తేనే భద్రతపై నమ్మకం పెరుగుతుందని, నేరాల నియంత్రణలో కూడా అది కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ముఖ్యంగా ఎస్సైలు, సీఐలు, డీఎస్పీలు తమ పరిధిలో తరచూ పర్యటిస్తూ ప్రజలతో ప్రత్య క్షంగా మాట్లాడాలని ఆదేశిం చారు. అధికారులు ప్రజలతో నిరంతరం టచ్‌లో ఉండా లని, వారి సమస్యలను వినడమే కాకుండా వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డీజీపీ సూచించారు. 

ప్రజల నుంచి పోలీసు శాఖపై వచ్చే ఫిర్యా దులను కూడా అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని చెప్పారు. విధుల్లో ప్రతిభ కనబరిచే అధికారులను ప్రత్యేకంగా గుర్తించి రివా ర్డులు, ప్రశంసలు అందిస్తా మని, అదే సమయంలో నిర్లక్ష్యం, బాధ్యతారాహి త్యం లేదా ప్రజలతో అసభ్యంగా ప్రవర్తించే అధికా రులపై మాత్రం ఎలాంటి రాజీ లేకుండా కఠిన శాఖాప రమైన చర్యలు తీసుకుంటా మని డీజీపీ హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రజలకు మరింత చేరువయ్యే, విశ్వాసాన్ని పెంచే, వేగవంతమైన సేవలు అందించే పోలీసింగ్ లక్ష్యం గా ఈ సమీక్ష సమావేశంలో డీజీపీ ఆనంద్ పలు కీలక దిశానిర్దేశాలు చేశారు. ఇకపై ప్రతి పోలీసు అధికారి ఫీల్డ్‌లో చురుకుగా పని చేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా వ్యవహరించా లని స్పష్టం చేశారు.

By
en-us Political News

  
ఈ లీగల్ బ్యాటిల్‌లో ప్రశ్న రావణ్ తరఫున వాదించడానికి ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ రంగంలోకి దిగారు. రావణ్ పై ఎన్ని కేసులైనా పెట్టుకోండి, అతడిని బెయిలుపై బయటకు తీసుకువస్తానని జడశ్రావణ్ కుమార్ ప్రకటించారు.
వ్యాపార పెట్టుబడుల పేరుతో నమ్మించి, విదేశాల నుంచి మహిళలను రప్పించి, వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఉదంతం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ అమానుష కాండలో పాకిస్థాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి అయిన ఇషాక్ దార్ సమీప బంధువు ప్రధాన నిందితుడిగా ఉండటం పాక్ రాజకీయాల్లో దుమారం రేపుతోంది.
పోలీస్, జైళ్లు, అగ్నిమాపక శాఖ, అలాగే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వంటి విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం 7వేల పోస్టులలో ఇప్పటికే 5వేల పోస్టుల భర్తీకి సంబంధించిన జీవోలను జారీ చేసింది. మిగిలిన 2వేల పోస్టులకు సంబంధించిన జీవోలు కూడా నేడో రేపో వెలువడనున్నాయని అధికార వర్గాల సమాచారం.
బండ్ల గణేష్, ఆయన తండ్రి, సోదరుడు ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్న శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ వ్యాపార అవసరాల కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి భారీ మొత్తంలో రుణాలు తీసుకుంది. ఈ బ్యాంకు రుణాలకు గ్యారెంటీగా హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్‌పేట్‌లో ఉన్న సుమారు 500 గజాల నివాస భవనాన్ని వారు తాకట్టు పెట్టారు.
ఐపీఎల్ 2026 సీజన్‌లో అసాధారణ ఆటతీరుతో వెలుగులోకి వచ్చిన ఈ యంగ్ బ్యాటర్ ఇంటర్నేషనల్ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవడంపై క్రికెట్ దిగ్గజాల విమర్శించడమే కాకుండా, సోషల్ మీడియా వేదికగా కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లక్ష్యంగా నెటిజనులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఇరాన్ మాజీ అత్యున్నత నాయకుడు (సుప్రీం లీడర్) అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల క్రతువుకు సంబంధించి అంతర్జాతీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలోని ప్రముఖ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌పై భారత ప్రభుత్వం అత్యంత తీవ్రమైన చర్యకు ఉపక్రమించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ జరిగి దశాబ్ద కాలం దాటినా, రాష్ట్రానికి ఒక శాశ్వతమైన, తిరుగులేని రాజధానిని నిర్మించుకోలేకపోవడం తెలుగు జాతి దురదృష్టం.
ఆంధ్రప్రదేశ్‌లోని మామిడి సాగుదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది.
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ ఏడాది జూన్ నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ రాజకీయ దుమారం రేపుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.