అరెస్టులతో భయపెట్టి యువగళాన్ని ఆపలేరు..లోకేష్

Publish Date:Sep 26, 2023

Advertisement

నాలుగేళ్ల పాలనలో జనం మెచ్చే ఒక్క పనీ చేయలేకపోయిన ముఖ్యమంత్రి జగన్.. వారు తనకు మరో చాన్స్ ఇవ్వరన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చేశారు. మరి ఇప్పుడు వారి అవసరం లేకుండానే అధికారంలోకి రావడానికి అడ్డదారులు వెతుకుతున్నారు. జనం ఎవరినైతే మెచ్చి ఎవరి పర్యటనలకైతే తండోపతండాలుగా వచ్చి మద్దతు తెలుపుతున్నారో వారిని కదలకుండా చేస్తే సగం గెలిచేసినట్లేనన్న భ్రమల్లో ఉన్నారు. అందుకే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్టు చేయించారు.

ఏపీ సీఐడీ ఈ నాలుగేళ్లుగా జగన్ సొంత సంస్థగా మారి ఆయన ఏం చెబితే అది చేయడమే తన కర్తవ్యమన్నట్లుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సంస్థ అడ్డగోలుగా  నిబంధనలను తుంగలో తొక్కి నారా చంద్రబాబునాయుడిని అరెస్టు చేసింది. ఇక ఇప్పుడు యువగళం పాదయాత్రతో రాష్ట్రం మొత్తం చుట్టేస్తున్న లోకేష్ నూ కటకటాల వెనక్కు నెట్టేందుకు చర్యలు ఆరంభించింది. అసలు జరగని పనికి, నిధులే వ్యయం కాని పనిలో అవినీతి జరిగిందంటూ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసంటూ ఒకదానిని తెరపైకి తీసుకువచ్చి.. ఆ కేసులో నారా లోకేష్ ను ఏ14గా చేర్చింది. చంద్రబాబు అరెస్టుతో తాత్కాలికంగా  ఆగిన లోకేష్ పాదయాత్ర ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే తిరిగి ప్రారంభం కాబోతున్న తరుణంలో ఆయన అరెస్టునకూ రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగానే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ ను ఏ14గా చేర్చి ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. వాస్తవానికి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు అంటున్నారు

కానీ... వాస్తవానికి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రణాళిక మాత్రమే. ఇందు కోసం సెంటు భూమిని సేకరించలేదు. సమీకరించలేదు. ఇందు కోసం ఒక్క రూపాయి కూడా వ్యయం చేయలేదు. అయినా ప్రణాళిక రూపొందించడమే మహా నేరమన్నట్లుగా కేసు నమోదు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని ఏ1గా, అప్పటి మంత్రి నారాయణను ఏ2గా చేర్చారు. ఇప్పుడు నారా లోకేష్ ను ఏ14గా చేర్చారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏ2 నారాయణ, మరి కొందరు కోర్టును ఆశ్రయించి బెయిలు పొందారు. అయితే నారా చంద్రబాబునాయుడు ఇప్పటి వరకూ బెయిలు పిటిషన్ కూడా ధాఖలు చేయలేదు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన తరువాత.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆయనపై ఏసీబీ కోర్టులో పిటి వారంట్ దాఖలు చేశాక, చంద్రబాబు ఈ కేసులో బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. 

సరే ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ తనను ఏ14గా చేర్చడంపై స్పందించారు. ఓటమి భయంతో గజగజలాడుతున్న జగన్.. ప్రత్యర్థులందరినీ నిర్బంధించి.. ప్రజలను భయం గుప్పెట్టోని నెట్టేసి ఏదో విధంగా విజయం సాధించి మరోసారి అధికారం చేపట్టగలన్న భ్రమల్లో ఉన్నారని లోకేష్ పేర్కొన్నారు. ప్రజాగ్రహం ఉప్పెనలా ఎగసిపడుతోందని, అందులో జగన్ కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసి, విపక్షాలను నిర్బంధించి అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులను సృష్టించిన జగన్ కు ప్రజా కోర్టులో ఓటమి శిక్ష ఇప్పటికే ఖరారైందని లోకేష్ అన్నారు. 
తనను అరెస్టు చేసి యువగళాన్ని ఆపాలన్న జగన్ ప్రయత్నం ఫలించదన్నారు. జీవో 1 తీసుకువచ్చినా ఆగని యువగళం ఇప్పుడు సీఐడీ ఉడత ఊపులకు బెదురుతుందనుకోవడం భ్రమేనని పేర్కొన్నారు.    ఎన్ని అడ్డంకులు కల్పించినా జన చైతన్యమే యువగళాన్ని వినిపిస్తుందని, తన యాత్ర ఇచ్ఛాపురం వరకు సాగుతుందన్న ధీమా వ్యక్తం చేశారు.   

ఇక లోకేష్ ను ఏ14గా చేర్చిన ఇన్నర్ రింగు రోడ్డు కేసు విషయానికి వస్తే.. ఇన్నర్ రింగు రోడ్డు కోసం ఒక్క రూపాయి కూడా వ్యయం జరగలేదు. అటువంటి ఈ కేసులో ప్రజాధనం దుర్వినియోగం అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని పరిశీలకులు అంటున్నారు.  రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్చి.. అస్మదీయులకు లాభం చేకూర్చరన్నది సీఐడీ అభియోగం.  అయితే అసలు ఇన్న రింగ్ రింగ్ అలైన్ మెంట్  ఖరారే కానప్పుడు అస్మదీయులకైనా, మరెవరికైనా ఎలాంటి ప్రయోజనం, లాభం సిద్ధించే అవకాశమే లేదు.  అలాంటి వ్యవహారంలో కేసు నమోదు చేసి అరెస్టులకు రంగం సిద్ధం చేయడమంటే జగన్ సర్కార్ ఎంతగా బరితెగించేసిందో అర్థమౌతోందని పరిశీలకులు అంటున్నారు. ఇంతకీ ఈ కేసు ఎందుకు నమోదు చేశారంటే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు చేశారని సీఐడీ చెబుతోంది.  జగన్ సర్కార్ తీరుతో ఇప్పటికే ప్రజలకు వ్యవస్థలపై విశ్వాసం సన్నగిల్లింది.  ఇక వైసీపీ నేతలు బాహాటంగా చంద్రబాబుని అరెస్టు చేశాం. లోకేష్ నూ వదలం.. అచ్చెన్నాయుడు.. ఇంకా ఎవరైనా జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా గళమెత్తితే వారినీ అరెస్టు చేసేస్తాం అంటే బాహాటంగా ప్రకటనలు గుప్పిస్తున్నారంటే.. ఎందగా బరితెగించారో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు.

 అయినా అరాచకత్వం, అహంభావం, నియంతృత్వ ధోరణి జనం భయపడినంత కాలమే సాగుతాయనీ, చంద్రబాబు అరెస్టు అనంతరం వెల్లువెత్తుతున్న ఆందోళనలు, ఆగ్రహ జ్వాలలూ చూస్తుంటే జనం భయం వదిలేశారని అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ ను ఓటు ఆయుధంతో శిక్షించేందుకు జనం సిద్ధంగా ఉన్నారనీ, ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు చంద్రబాబుకు పట్టం గట్టి జగన్ ను ఇంటికి సాగనంపేందుకు ఎదురు చూస్తున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.