జగన్ హయాంలో వందల కోట్ల ప్రజాధనాన్నివ్యయం చేసి నిర్మించిన అత్యంత విలాలవంతమైన, అంతకు మించి వివాదాస్పదమైన రిషికొండ ప్యాలెస్ వినియోగంపై ఉత్కంఠకు తెరపడిందా? ఈ విలాసవంతమైన భవనాన్ని ప్రస్తత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా వినియోగించనుందా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది. జగన్ హయాంలో నిబంధనలను తుంగలోకి తొక్కి, పర్యావరణ సమతుల్యతకు భగం వాటిల్లేలా పచ్చటి రుషికొండకు బోడి గుండు కొట్టి మరీ నిర్మించిన ఈ విలాలవంతమైన భవనాన్ని ఎలా వినియోగించుకోవాలన్న విషయంపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఆ సబ్ కమిటీ తాజాగా భేటీ అయ్యింది.
ఈ భేటీలో విశాఖపట్నంలోని వివాదాస్పద రుషికొండ ప్యాలెస్ ను కేవలం ఎగ్జిబిషన్ లా కాకుండా, ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే విధంగా తీర్చిదిద్దాలని కేబినెట్ సబ్ కమిటీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. జగన్ హయాంలో రూ. 400 కోట్లకు పైగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మరీ ఈ ప్యాలెస్ ను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ రుషికొండ ప్యాలెస్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి భారంగా మారింది. గతంలో ఇక్కడ ఉన్న పర్యాటక శాఖ రిసార్ట్స్ ద్వారా ప్రభఉత్వానికి 7 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేది. కానీ వాటిని కూల్చివేసి ఈ ప్యాలెస్ను నిర్మించడంతో ఆ ఆదాయం లేకుండా పోవడమే కాకుండా.. రుషికొండ ప్యాలెస్ నిర్వహణ వ్యయమే నెలకు పాతిక లక్షల రూపాయలకు పెగా ఉంది.
ఈ ఆర్థిక భారాన్ని తగ్గించి రిషికొండ ప్యాలెస్ ను అంతర్జాతీయ హోటల్ చైన్స్కు అప్పగించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. తాజ్ గ్రూప్, లీలా ప్యాలెస్ వంటి దిగ్గజ సంస్థలుఈ దిశగా ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటిని లగ్జరీ హోటళ్లుగా లేదా ప్రపంచస్థాయి రిసార్ట్స్గా మార్చడం ద్వారా అటు పర్యాటకాన్ని అభివృద్ధితో పాటు, ప్రభుత్వానికీ భారీగా ఆదాయం సమకూర్చుకోవచ్చని కమిటీ ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
తాజా భేటీలో కమిటీ చర్చించిన విషయాలపై సమగ్ర నివేదిక రూపొందించి దానిని ప్రభుత్వానికి సాధ్యమైనంత త్వరలో సమర్పించాలని కమిటీ భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ నివేదికపై రాష్ట్ర మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకుంటుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cabinet-subcommittee-onrushikonda-palace-to-submitt-reoprt-36-216855.html
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పట్టణంలో పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్లో ఘనంగా జరిగింది.
కరీంనగర్ నగరంలో ఆదివారం మధ్యాహ్నం సంచలనాత్మక దోపిడీ ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
ఎస్.కె.జిలానీ తన కుమారుడు ఫైసల్తో కలిసి బైక్పై ఎల్బీ నగర్ వైపు వెళ్తుండగా.. . గాయత్రినగర్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఫైసల్కు గాయాలయ్యాయి. కారు డ్రైవర్ను నిలదీసేందుకు జిలానీ కారుకు అడ్డంగా వెళ్లారు. అయితే డ్రైవర్ కారు ఆపకుండా ముందుకు పోనివ్వడంతో జిలానీ కారు బానెట్పై పడి దాన్ని గట్టిగా పట్టుకున్నారు.
ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్కు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో నమన్ ధిర్ 57 పరుగులతో రాణించాడు. మిగిలిన వారు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నెమ్మదిగా ఆడటం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది.
వియత్నాం యుద్ధం తర్వాత అమెరికాలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా 1973లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అధ్యక్షుడు కాంగ్రెస్ను పక్కనబెట్టి ఏక పక్షంగా యుద్ధాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా నియంత్రణలు అవసరమని భావించి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు.
అసలే నష్టాల్లో కూరుకుపోయిన స్పిరిట్ ఎయిర్లైన్స్ యుద్దం కారణంగా ఇంధన ధరలు రెట్టింపు అవ్వడంతో.. ఇక సర్వీసులు నడపలేమని చేతులెత్తేసింది. త్వరలో అన్ని కార్యకలాపాలకూ ఫుల్ స్టాప్ పెడతామని ప్రకటించింది. తమ ప్రయాణికులు ఎయిర్పోర్టులకు వెళ్లవద్దని సూచించింది
నారాయణ్పూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ని మార్చి 31న సాయుధ మావోయిస్టులు లేని రాష్ట్రంగా ప్రకటించారు. సాయుధ మావోలు లేని రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి పేలుడు ఇదే కావడం గమనార్హం.
సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
గత కొద్ది కాలంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడి సైన్స్ సెంటర్లు, ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. పుస్తకాల్లోని జ్ఞానానికి తోడుగా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఆ యాత్ర ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపడం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.