Publish Date:Aug 12, 2026
వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో వైసీపీ నిరసనలు తుస్సుమన్నాయి. నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికీ, జగన్ కు పెట్టని కోటగా ఉన్న పులివెందులలో జగన్ ప్రతిష్ఠ పూర్తిగా మసకబారింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ, విద్యాశాఖ నిర్ణయాలకు వ్యతిరేకంగా వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంా జరుగుతున్న నిరసనలు పులివెందులలో తుస్సు మన్నాయి. జగన్ కు పెట్టని కోట అయిన పులివెందులతో వైసీపీ నిరసనలకు జనం నుంచి స్పందన కరవైంది. అలాగే డీఎస్సీ అభ్యర్థులూ ఈ నిరసనలను పట్టించుకోలేదు. దీంతో జన సమీకరణ కోసం వైసీపీ స్థానిక నేతలు నానా తంటాలూ పడ్డారు. పులివెందులలోని ప్రైవేట్ కాలేజీల విద్యార్థులను బలవంతంగా నిరసన ర్యాలీలకు తరలించారు.
ప్రైవేటు కళాశాలల్లో చదువుకునే విద్యార్థులను రాజకీయ ఆందోళనల్లోకి లాగడంపై తెలుగుదేశం పార్టీ ఖండించింది. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఈ విషయంపై మాట్లాడుతూ... వైసీపీ నిర్వహించిన మెగా డీఎస్సీ వ్యతిరేక నిరసనల కోసం ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ర్యాలీలకు పంపడాన్ని తప్పుపట్టారు. పార్టీ శ్రేణులతో కలిసి సదరు ప్రైవేటు కాలేజీ వద్దకు చేరుకున్న బీటెక్ రవి, కాలేజీ యాజమాన్యాన్ని నేరుగా నిలదీశారు. రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్తో వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసనల్లో ఒకవేళ లాఠీచార్జ్ లేదా ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగి విద్యార్థులకు ఏమైనా ప్రమాదం జరిగితే ఆ బాధ్యత ఎవరిదని నిలదీశారు.
విద్యార్థులను రాజకీయ నిరసనలకు పంపినందుకు యాజమాన్యం తక్షణమే క్షమాపణలు చెప్పాలని, విద్యార్థులను ఆందోళనలకు తీసుకురావాలని ఒత్తిడి చేసిన వైర్సీపీ నేతలపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ 2025కి అనుకూలంగా కాలేజీ ఫ్యాకల్టీతో కలిసి ర్యాలీ నిర్వహించాలన్నారు. వైసీపీకి తిరుగులేని ప్రాబల్యం ఉన్న పులివెందులలో, ఎంపీ అవినాష్ రెడ్డి పర్యవేక్షించే పరిధిలో టీడీపీ నేత బీటెక్ రవి ఈ స్థాయిలో నిలదీయడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
BTech Ravi Pulivendula, YSRCP DSC 2025 protest, Pulivendula TDP viral video, AP DSC controversy 2025, BTech Ravi warning private college, Kadapa Pulivendula politics
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/btech-ravi-pulivendula-39-228744.html
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.