Publish Date:May 18, 2023
బిఆర్ఎస్ దళిత వోట్ల మీద ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఇటీవలె బిఎస్పి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకు యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ముఖ్యఅతిథిగా రావడాన్ని బిఆర్ఎస్ వర్గాలకు నచ్చలేదు. ఎందుకంటే తెలంగాణ రాజధానిలో బిఎస్పి బహింరంగ సభ పెట్టడాన్ని బిఆర్ఎస్ మనసు మీద తీసుకుంది. ఎందుకంటే బిఎస్పి అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ మాజీ ఐపిఎస్ అధికారి. ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో వచ్చిన ధీరుడాయన. తెలంగాణ జిల్లాల్లో ఆయన కలియ తిరుగుతూ కెసిఆర్ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. పరుషంగా కూడా మాట్లాడుతున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ దాడిని బిఆర్ఎస్ శ్రేణులు అంత బలంగా తిప్పి కొట్టలేకపోతున్నాయి. ధర్మ సమాజ్ పార్టీ, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా దళిత పార్టీలే. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఈ దళిత పార్టీలు తమ అభ్యర్థులను రంగంలో దించుతున్నాయి. ఒకప్పుడు దళిత సంఘాలుగా ఉన్న ఈ సంఘాలు రాజకీయ పార్టీలుగా అవతరించాయి. దళిత హక్కుల కోసం ఉద్యమాలు చేసిన సంఘాలు రాజకీయ పార్టీలుగా అవతరించి వోటరు తీర్పును ప్రభావితం చేసే స్థాయికి చేరుకున్నాయి.
దళిత బంధు వంటి పథకాన్ని పరిచయం చేసిన బిఆర్ ఎస్ కూడా ఇటీవలె విమర్శల పాలైంది. పార్టీ అధినేత కేసీఆర్ డైరెక్టుగా తన పార్టీ శాసనసభ్యులే కమీషన్లకు కక్కుర్త పడుతున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలు ప్రతి పక్షాలకు అస్త్రం దొరికినట్టయ్యింది. దళిత వర్గానికి చెందిన ఎంఎల్ఏ ప్రస్తుతం తెలంగాణ పిసిసి శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. కాంగ్రెస్ పార్టీలో పాపులర్ నేత అతను. ఆయన చేపట్టిన పాదయాత్ర రికార్డుల్లో కెక్కింది కూడా. ప్రస్తుతం అస్తిత్వంలో ఉన్న రాజకీయ పార్టీలకు తోడు కొత్తగా వచ్చిన దళిత పార్టీలు బిఆర్ఎస్ ను ఏ మేరకు దెబ్బతీస్తాయో వేచి చూడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/brs-con-centration-on-dalith-votes-25-155525.html
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.