Publish Date:Jul 21, 2022
తండ్రి అనారోగ్యంతో బాధపడుతూంటాడు, కొడుకులూ, కోడళ్లూ వీలునామా మీద సంతకంకోసం ఆయ న్ను ఇబ్బందిపెడుతూంటారు.. ఇది అనాదిగా చాలా కథల్లో, సినిమాల్లో చదివిన, చూసిన దృశ్యం. అయినా కోట్ల రూపాయలు మురుగుతూ పడి ఉంటే పెద్దాయన ఆరోగ్యం గురించి చులకన భావంతోనే వ్యవహరించే కాలంలోనే ఉన్నాం. కానీ సిడ్నీకి చెందిన క్లారా బ్రౌన్ మాత్రం తన తండ్రి ఆనందంగా అంగీ కరిస్తూ ఇస్తేనే కోట్ల ఆస్తి తీసుకుంటానన్నది. నిజానికి ఆమె పరిస్థితిలో ఎవరున్నా పెద్దాయన్ను ఇబ్బంది పెట్టి లాక్కునేవారే. కానీ బ్రౌన్ అలా చేయలేదు. కారణం ఆమెను ముందు మంచి చదువు చదివి మంచి ఉద్యోగం సంపాదించాలని ఆమె తండ్రి కోరిక. అది తీర్చడానికి ఆ సంపద వేపు ఆమె ఆసక్తి చూపడం లేదు.
బ్రౌన్ కి సుమారు 12 మిలియన్ డాలర్ల ఖరీదయిన ఎస్టేట్ వారసురాలిగా దాన్ని స్వాధీనం చేసుకోను అవ కాశం, హక్కూ ఉందని సిడ్నీవాసులే చెబుతున్నారు. తండ్రి తనకు చదువుకునే అవకాశం కల్పించా రు. కనుక మంచి స్థాయిలో ఉన్నానన్నది తండ్రికి తెలిసేలా చేస్తేనే ఆయన కోరిక తీరినట్టు అవుతుది, కనుక బ్రౌన్ కి ఎస్టేట్ రాయించేసుకోవాలని అనిపించలేదు. ఆమె ప్రస్తుతం సిడ్నీ సరిహద్దు ప్రాంతంలో తన ఏడాదిన్నర పిల్లాడితో చిన్న ఇంట్లో ఉంటోంది. అయితే ఆమె ఏమాత్రం ప్రశాంతంగా మాత్రం లేదు. కారణం తండ్రి వద్దకి రోజూ వెళ్లలేకపోతోంది, చేసే ఉద్యోగం అంతంత మాత్రమైనదే. అదేమీ ఆర్ధికంగా ఆమెకు ధైర్యాన్నివ్వడం లేదు. అనారోగ్యంవల్ల అదీ సరిగా చేయలేకపోతోంది. ఆమె చాలారోజులుగా ఆటిజంతో బాధపడుతోంది. ఆమెకు పిల్లాడిని చూసుకోవాలి, ఆస్పత్రి చుట్టూ తిరగా ల్సిన అవసరమూ ఉంది. ఆమెకు నిజానికి ఎంతో డబ్బు అవసరం ఉంది. పిల్లాడిని చూసుకోవడానికి ఒక నర్సును పెట్టుకోవాలి, ఆమె ఇంట లేని సమయంలో పిల్లాడిని జాగ్రత్తగా చూసుకునేవారు దొరకడం ఆమె ఉన్న ప్రాంతంలో చాలా కష్టంట.
క్లారా బ్రౌన్ ప్రస్తుత పరిస్థితులను తెలుసుకున్న ఆమె తండ్రి స్నేహితులు, హితులూ ఆమెను తండ్రి ఎస్టేట్కి తిరిగి వచ్చేయమని చెబుతున్నారు. చాలామంది వచ్చి మరీ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నా రు. కానీ ఆమె మాత్రం తండ్రి నుంచి రమ్మని ఒక్క మాట, ఎలాంటి సమాచారం లేకుండా తాను ఎస్టేట్ స్వాధీనం చేసుకోలేనని అది తన మనసుకు నచ్చదని, తన తండ్రిని మోసం చేసినట్టే అవుతుందని వచ్చిన వారికి సమాధానంగా చెబుతోంది. మరి ఇలాంటి కూతురు ఉన్నందుకు పెద్దాయన గర్వ పడాలా, అంతటి ఎస్టేట్ దూరం చేసుకుంటున్నందుకు క్లారా బ్రౌన్ను దురదృష్టవంతురాలు అనాలా? ఏమ యినా ఆమె మనసు బంగారం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/brownaway-to-crores-estate-39-140230.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.