Publish Date:Jul 21, 2022
తండ్రి అనారోగ్యంతో బాధపడుతూంటాడు, కొడుకులూ, కోడళ్లూ వీలునామా మీద సంతకంకోసం ఆయ న్ను ఇబ్బందిపెడుతూంటారు.. ఇది అనాదిగా చాలా కథల్లో, సినిమాల్లో చదివిన, చూసిన దృశ్యం. అయినా కోట్ల రూపాయలు మురుగుతూ పడి ఉంటే పెద్దాయన ఆరోగ్యం గురించి చులకన భావంతోనే వ్యవహరించే కాలంలోనే ఉన్నాం. కానీ సిడ్నీకి చెందిన క్లారా బ్రౌన్ మాత్రం తన తండ్రి ఆనందంగా అంగీ కరిస్తూ ఇస్తేనే కోట్ల ఆస్తి తీసుకుంటానన్నది. నిజానికి ఆమె పరిస్థితిలో ఎవరున్నా పెద్దాయన్ను ఇబ్బంది పెట్టి లాక్కునేవారే. కానీ బ్రౌన్ అలా చేయలేదు. కారణం ఆమెను ముందు మంచి చదువు చదివి మంచి ఉద్యోగం సంపాదించాలని ఆమె తండ్రి కోరిక. అది తీర్చడానికి ఆ సంపద వేపు ఆమె ఆసక్తి చూపడం లేదు.
బ్రౌన్ కి సుమారు 12 మిలియన్ డాలర్ల ఖరీదయిన ఎస్టేట్ వారసురాలిగా దాన్ని స్వాధీనం చేసుకోను అవ కాశం, హక్కూ ఉందని సిడ్నీవాసులే చెబుతున్నారు. తండ్రి తనకు చదువుకునే అవకాశం కల్పించా రు. కనుక మంచి స్థాయిలో ఉన్నానన్నది తండ్రికి తెలిసేలా చేస్తేనే ఆయన కోరిక తీరినట్టు అవుతుది, కనుక బ్రౌన్ కి ఎస్టేట్ రాయించేసుకోవాలని అనిపించలేదు. ఆమె ప్రస్తుతం సిడ్నీ సరిహద్దు ప్రాంతంలో తన ఏడాదిన్నర పిల్లాడితో చిన్న ఇంట్లో ఉంటోంది. అయితే ఆమె ఏమాత్రం ప్రశాంతంగా మాత్రం లేదు. కారణం తండ్రి వద్దకి రోజూ వెళ్లలేకపోతోంది, చేసే ఉద్యోగం అంతంత మాత్రమైనదే. అదేమీ ఆర్ధికంగా ఆమెకు ధైర్యాన్నివ్వడం లేదు. అనారోగ్యంవల్ల అదీ సరిగా చేయలేకపోతోంది. ఆమె చాలారోజులుగా ఆటిజంతో బాధపడుతోంది. ఆమెకు పిల్లాడిని చూసుకోవాలి, ఆస్పత్రి చుట్టూ తిరగా ల్సిన అవసరమూ ఉంది. ఆమెకు నిజానికి ఎంతో డబ్బు అవసరం ఉంది. పిల్లాడిని చూసుకోవడానికి ఒక నర్సును పెట్టుకోవాలి, ఆమె ఇంట లేని సమయంలో పిల్లాడిని జాగ్రత్తగా చూసుకునేవారు దొరకడం ఆమె ఉన్న ప్రాంతంలో చాలా కష్టంట.
క్లారా బ్రౌన్ ప్రస్తుత పరిస్థితులను తెలుసుకున్న ఆమె తండ్రి స్నేహితులు, హితులూ ఆమెను తండ్రి ఎస్టేట్కి తిరిగి వచ్చేయమని చెబుతున్నారు. చాలామంది వచ్చి మరీ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నా రు. కానీ ఆమె మాత్రం తండ్రి నుంచి రమ్మని ఒక్క మాట, ఎలాంటి సమాచారం లేకుండా తాను ఎస్టేట్ స్వాధీనం చేసుకోలేనని అది తన మనసుకు నచ్చదని, తన తండ్రిని మోసం చేసినట్టే అవుతుందని వచ్చిన వారికి సమాధానంగా చెబుతోంది. మరి ఇలాంటి కూతురు ఉన్నందుకు పెద్దాయన గర్వ పడాలా, అంతటి ఎస్టేట్ దూరం చేసుకుంటున్నందుకు క్లారా బ్రౌన్ను దురదృష్టవంతురాలు అనాలా? ఏమ యినా ఆమె మనసు బంగారం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/brownaway-to-crores-estate-39-140230.html
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
రాయలసీమలో వైసీపీ కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన వారి చూపు ఇప్పుడు జనసేనపై ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో వైసీపీ ఖాళీ అయిపోయినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు.
ఒకవేళ కోర్టులో ఇవి ఎడిటెడ్ వెర్షన్లు అని రుజువైతే.. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని, ఇది ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని హెచ్చరించారు.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ, తాను 2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు.
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవాన్ని తీసుకురావడమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటన ఏపీ యువతకు ఉపాధి అవకాశాల వెల్లువను తీసుకురానుంది. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ అనే మూడు సూత్రాల 3ఎస్ మోడల్ తో పారదర్శక పాలన అందిస్తామని కొరియా దిగ్గజాలకు లోకేష్ భరోసా ఇచ్చారు.
2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్మెన్లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.