వైద్య విద్యార్థుల బాండ్ పాలసీ అమలు కేంద్ర ఆరోగ్య శాఖ కసరత్తు!

Publish Date:Nov 9, 2022

Advertisement

వైద్య విద్య ను అభ్యసించే వైద్య విద్యార్ధులపై ముఖ్యంగా గ్రేడ్యుయేట్,పోస్ట్ గ్రేడ్యు యేట్ విద్యార్ధులపై బ్యాండ్ పోలసీ విధానాన్ని అమలు చేయాలని కసరత్తు చేస్తోంది.కేంద్ర ఆరోగ్య శాఖ బాండ్ పోలసీ ప్రకారం అవసరమైన ఆయా రాష్ట్రాల లోని ఆసుపత్రులు ప్రాంతాలాలో కొంత కాలం వరకు వైద్య సేవలు తప్పనిసరి చేస్తూ నిబందనలు రూపొందిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి.ఒకవేళ ఈ నిబందనను అతిక్రమించే అయారష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు మెడికల్ కలశాలలు నిర్ణయించిన పరిహారం చెల్లించాల్సి ఉంటుందని నిబందనలో పేర్కొన్నారు.ఈమేరకు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ డాక్టర్లకు బాండ్ పాలసీని అమలు చేసేందుకు విధి విధానాలను రూపొందిస్తోంది.బాండ్ పాలసీని వ్యతిరేకిస్తూ దూరంగా వారి పట్ల ఖటిన చర్యలు చేపట్టాలని లేదా వారివద్ద పరిహారం కట్టేవిధంగా చర్యలు చేపట్టే విధానం జాతీయ మెడికల్ కమీషన్ బాండ్ రూపకల్పన లో ప్రభుత్వానికి విధివిధానా లను సూచించిందని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైన మేరకు నిర్దేశించే కాలానికి అండర్ గ్రేడ్యుయెట్, పోస్ట్ గ్రేడ్యుయెట్, సమయం తరువాత పని చేయాల్సి ఉంటుంది. 

ఒక వేళా ఆనిబందన ను అతిక్రమించే ఆయా రాష్ట్రాల్ ఆసుపత్రులు లేదా వైద్య కళాశాలలు జరిమానా చెల్లించాలన్న నిబందన అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.ఆయా రాష్ట్రాలు బాండ్ పోలసీ ని 2౦19 లోనే సుప్రీం కోర్ట్ నిలుపుదల చేసింది. కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఖచ్చితమైన కట్టినమైన నిబందనలు అమలు విధించడాన్ని గుర్తించింది. కేంద్రం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక యునిఫాం ఒకే విదివిధనాన్ని రూపొందించాలని సూచించింది.డాక్టర్లు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాలాలో సేవలు తప్పని సరిగా చేయాలని అదీ ప్రభుత్వ సంస్థలలో శిక్షణ పొందిన ఈ విధానం అన్ని రాష్ట్రాలాలో అమలు కావాలి అని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. సుప్రీం మార్గనిరేదేశం ప్రకారం కేంద్ర ఆరోగ్య శాఖ ఒక కమిటీని నియమించింది. ఈ కమిటి అధ్యక్షునిగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ప్రధాన సలహాదారు డాక్టర్ బి డి అతాని ని నియమించింది. 2౦19 నాటి బాండ్ పోలసీ విధానాన్ని పూర్తిగా సమీక్షించాలని కోరింది ఈమేరకు అతాని నేతృత్వం లోని బృందం 2౦2౦ మే నాటికి కమిటి నివేదికను సమర్పించింది. నివేదిక పై ఎన్ ఎం సి నేషనల్ మెడికల్ కమీషన్ తమ వ్యాఖ్యను పంపాలని కోరింది.

డాక్టర్ బి డి అదాని నేత్రుత్వం లోని బృందం ఇచ్చిన నివేదిక పై అసలు సంప్రదాయమ -విధాణాలను తప్పనిసరిగా బాండ్ పోలసీలో నిబందనలు ఒక్కోరాష్ట్రం ఒక్కో రాష్ట్రం లో ఒక్కో విధానం ఉందని పెర్కొన్నారు.బాండ్ పోలసీమి అయారాష్ట్రాలు ఇప్పటికే మార్పులు చేశాయని దేశంలో వైద్య విద్య అంశాలు మరల పునః సమీక్షించాలని సూచించింది.చాలా ప్రభావ వంతంగా ఉండేవిధంగా రాష్ట్రాలకు నివేదించాలని సూచించారు.నేషనల్ మెడికల్ కమీషన్ కూలంకషంగా పరిశీలించింది. ఇప్పటికే సుప్రీం బోన్ పాలసీని నిలుపుదల చేసిందని బాండ్ ద్వారా అయితే వైద్య విద్యార్ధులు రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారరాదని పేర్కొంది. సహజ న్యాయానికి విరుద్ధంగా ఉందని అధికారులు పేర్కొనడం గమనార్హం.బాండ్ విధానం పై ఉఆరోగ్యశాఖ ఉన్నత స్థాయి సమీక్ష జరుపుతుందని మొత్తంగా బాండ్ పాలసీని పరీక్షించి రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాల అభిప్రాయాలు తెలుసుకోవాలనిసూచించింది.బాండ్ పాలసీపై విధి విధానాలు బాండ్ రూపు రేకలు ఎలాఉండాలి. బాండ్ అమలుకు ముందే ఆయా సమయానికి పోస్టులు ఉన్నాయా ఇంటర్న్ షిప్ పూర్తి చేయాలని అధికారులు వెల్లడించారు.2౦ 19 నిబందనల ప్రకారం బాండ్ చట్టంలేదా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం 19 56 నిబందనల ప్రకారం రూపొందిన్చాలా అన్నది సందిగ్ధం లో ఉంది.

ఆయారాష్ట్రాల పరిదిలో వైద్యసేవలు అందించాల్సి ఉన్నందున ఖాళీ ఉన్నస్థానా లను తక్షణం భర్తీ చేయడం పట్టణ గ్రామీణ ప్రాంతాలలో  నియమించాల్సి ఉన్నందున సి హెచ్ సి.డి హెచ్ సి లు, పి హెచ్ సి లు ఆరోగ్యకేంద్రాలాలో నియమించాలని నిర్ణయించారు.బాండ్ ధరను అయారాష్ట్రాలు నిర్ణయిం చాల సబ్సిడీ పై భోదిస్తున్నందున నిబంధనల నిర్ణయాధికారం  అయారాష్ట్రాలదే.బాండ్ నిబంధనల ప్రకారం జరిమానా 5 లక్షలు రూపాయలు గోవా,రాజస్థాన్ లలో అమలులో ఉందని. ఉత్తరాఖండ్ లో 1 కోటి రూపాయలు. కేరళలో  ఉత్తరాంచల్ లో మహారాష్ట్రాలలో పి జి సూపర్ స్పెషాలిటి2.25 కోట్లు పనిచేసే కాలం సేవలు 1 సంవత్సరం నుండి 5 సంవత్చారాల వరకు అయారాష్ట్రాల కేంద్ర గ్రామీణ పట్టణ ప్రాంతాలలో డాక్టర్ల సేవలు తప్పనిసరి చేస్తూ పరిపాలనా సౌలభ్యం లో భాగామే  బాండ్ నిబందనలుఅమలు చేస్తున్నట్లు చెప్పుకున్నాఆరోగ్యశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఎన్ ఎం సి నిబందనలకు లోబడే ఉండాలాని ఎన్ ఎం సి సూచించింది. పునఃసమీక్ష తరువాతే బాండ్ అమలు చేయాలని నిర్ణయించాయి.

భగ్గుమంటున్న డాక్టర్లు...

ఈమేరకు వైద్య విద్యార్ధులకు ముఖ్యంగా గ్రేడ్యు యెట్,పోస్ట్ గ్రేద్యుయెట్ లకు బాండ్ విధానం అమలు చేయాలన్న నిబంధన అతిక్రమిస్తే   నిబంధనల ప్రకారం జరిమానా కట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని డాక్టర్లు తీవ్రంగా తప్పుపట్టారు. 

బాండ్ పోలసీ కి వ్యతిరేకంగా హర్యానాలో డాక్తర్లసంఘం బ్లాక్ డే పాటించింది...

హర్యానాలో పోలీసులు బాండ్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న డాక్టర్ల పై అమానుషంగా ప్రవర్తించ డాన్ని తీవ్రంగా ఖండించింది.డాక్టర్ల పై బాండ్ చట్టాన్ని బలవంతంగా రుద్దేందుకు  హర్యానా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని తమ పై దాడి చేయడం అనైతికమని దీనిని అంగీక రించబోమని డాక్టర్లు హెచ్చరించారు.హర్యానాలో వివిధ డాక్టర్ల సంఘాలు బ్లాక్ డే ను పాటించాయి. ఎం బి బి ఎస్ అడ్మిషన్ల ప్పుడేబాండ్ ను  అమలు చేయాలన్న నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించాయి.ఫార్డా ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు ఆలిండియా మెడికల్ అసోసియేషన్ విద్యార్ధులకు మద్దతుతేలిపింది.హర్యానా వైద్య విద్యార్ధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషమని ఈ అంశంపై ఫెడెరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మంసూక్ మాండ వీయ కు పోలీసుల తీరుపై ఫిర్యాదు చేస్తూ లేఖ రాసారు.ప్రభుత్వ వైద్యకళాశాలలో ఇటీవలే డాక్టర్ల ఫీజు పెంపుపై హర్యానాలో ఇటీవలే డాక్టర్లు ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న వారిపై దాడికి పాల్పడిందని తీవ్రంగా పరిణమించింది .వైద్య విద్యార్దుల పై వాటర్ కేనన్లు ఈడ్చుకుంటూ వెళ్ళినట్లు తెలిపారు. ఇది వైద్య విద్యపై మరోదాడి.గా అభివర్ణించారు.అనవసరపు ఫీజు పెంపు బాండ్ పోలసీ అమలు పోలీసుల అమాయక విద్యార్ధుల పై దాడి చేయడాన్ని సంఘాలు తీవ్రంగా ఖండించాయి.

కోవిడ్ సమయం లో అత్యవసర సమయం లో డాక్టర్లు అందించిన సేవలు అద్భ్తతమని ప్రభుత్వం విస్మరించరాదని లేఖలో పేర్కొన్నారు.ఫార్డా జాతీయ కార్యదర్శి ఉపాధ్యక్షుడు సర్వేశ్ పాండే హర్యానా పోలీసులతీరును వ్యవహార శైలిని అనాగరిక చాయగా పేర్కొన్నారు.బాండ్ ను హర్యానా ప్రభుత్వం బలవంతంగా అమలు చేయాలని చూస్తోందని ఇది అనైతిక చర్యాగా పేర్కొన్నారు.ఫైమా ముఖ్యసలహాడారు డాక్టర్ మనీష జాం గ్రా రోహ్ తక్ చేరుకొని ప్రదర్శనలో పాల్గొన్నారు.డాక్టర్ జంగ్రా మాట్లాడుతూ 4౦ లక్షల బాండ్ పోలసీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. మేము వైద్య విద్యార్ధులకు అండగా ఉంటామని వారికి మాసంపూర్ణ మద్దత్తు ఉంటుందని పేర్కొన్నారు.

By
en-us Political News

  
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.