Publish Date:Oct 27, 2022
పిల్లలు బాగా చదువుతామని తండ్రికి హామీ యిస్తారు, తప్పకుండా గెలపించాలని అభ్యర్ధులు తమ తమప్రాంతంలోని ఓటర్ల నుంచి హామీ తీసుకుంటారు, కానీ కేసులు లేకుండా చేస్తామని హామీ యివ్వడం మాత్రం బీజేపీవారివల్లే అయింది. ఇది కనీ వినీ ఎరుగని హామీ. టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. ఎఫ్ ఐ ఆర్ లో అంశాలను చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. తమ పార్టీలో చేరండి అన్ని తామే చూసుకుంటామన్న ధీమా వ్యక్తం చేయడం. అందులోనూ వారికి ఎలాంటి క్రిమినల్ నేపథ్యం ఉన్నా తామే చూసుకుంటామనడం. ఇంతకంటే దారుణమైన హామీ ఎవరూ ఇవ్వరు. అంటే తమ పార్టీ బలపడేందుకు, తమ విజయానికి ఎలాంటి వారినయినా గట్టి పట్టున్నవారని తెలిస్తే లాగేసుకోవడానికి ఇంతటి హామీలను ఇచ్చి అక్కున చేర్చుకోవాలనుకోవడం బీజేపీవారి గొప్ప ఆలోచన.
ఈమధ్యవరకూ మా పార్టీలో చేరండి మీకు ఏదో ఒక మేలు చేస్తామన్న ధీమా ఇచ్చేవారు. అంటే సామాన్యంగా అనుకు నేది.. ప్రభుత్వ కార్యాలయాల్లో తమవారికి ఉద్యోగాలో, ఏదో ఒక పథకంలో భాగ స్వామి చేయడమో లేదా ఫ్రాజెక్టు కాంట్రాక్టులు లాంటివే.. కానీ రోజులు మారిపోయాయి. అంతే కోట్ల వ్యవ హారమే. అంతా డబ్బు మయం. కోట్లలో వస్తువుల్ని, భవనాల్ని కొన్నట్టు ఎమ్మెల్యేలను కొనేయడం అనేది కేవలం కమలనాథుల బుర్రలోంచి వచ్చిన గొప్ప ఆలోచన. చిత్రమేమంటే ఇది భయానకమనో, ప్రజలు తమ రహస్యం తెలుసుకుంటే, బండారం బయటపడితే పోయేది తమ పరువేనన్న ఆలోచన, భయం లేకుండా ధైర్యంగా రహస్యంగా వ్యవహారం నడిపేయాలనే చూశారు. కానీ కథ అడ్డం తిరిగింది. ఇపుడు ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొన్న అంశాల్నీ భీజేపీ వారి నీతి నిజాయితీని నాలుగు రోడ్ల జంక్షన్లో పెట్టేసిం ది. నిన్న మొన్నటి వరకూ టీఆర్ ఎస్ పరువు తీయడానికి ఒంటకాలి మీద లేచిన కమలనాథు లంతా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తన వ్యూహం తననే ముంచిందనేది బీజేపీవారే రుజువు చేయడం పెద్ద సినిమా కంటే అతి పెద్ద చిత్రమే చూపింది. ఎరవేయడం నలుగురిని లాక్కనేందుకు వ్యూహ రచన చేసామని జబ్బలు చరుచు కోవడం, మునుగోడు ఉప ఎన్నిక ముందే టీ ఆర్ ఎస్ కొంపముంచేసేమని ఏసీ గదుల్లో కూచుని హాస్య మాడుకోవడం, గట్టిగా నవ్వుకోవడం అంతా ఆ గదులకే పరిమితమై అసలు రంగు బయటపడింది. కాషాయం బాగా వెలిసిపోయి హేమా హేమీ నాయకుల బుర్ర తక్కువ తనం ఆసేతు హిమాచలమూ తెలిసిపోయింది. ఇక తమ పరువును తామే కాపాడుకోవాల్సిన పెద్ద పనిలో పడాల్సిన అగత్యం ఏర్పడిం ది. అధికారంలోకి రావడానికి వేసే వలలు టీ ఆర్ ఎస్ వ్యూహంతో ముక్కలయ్యాయి. చేపలు అను కున్నవారు చేపలు కాదని తమకు భవిష్యత్ అగమ్యగోచరం చేయగల టీ ఆర్ ఎస్ వీరాభిమాను లేనని తేటతెల్లమయింది. ఇపుడు తెలంగాణా అంతా తమదే నని రొమ్ము విరుచుకు ప్రచారం చేసుకుంటున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటివారు కేంద్రంలోని వారి మహా నేతలకు మొహం ఎలా చూపగలరో మరి. వ్యూహానికి, అమలుకి మధ్య చాలా తేడా ఉంటుంది. అందునా టీ ఆర్ ఎస్ వీరాభిమానులను అంత సులువుగా చేపల్లా లాగేసుకునే ఆలోచన బీజేపీ వారికి పెద్ద బూమరాంగ్ అయింది. ఇక తెలంగాణ బీజేపీ మహానేతలు దేశ తెలంగాణా ప్రజలకు, తమని నమ్ముకుని జండా పట్టుకు తిరుగుతున్నవారికీ సమాధానం చెప్పుకోవాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjpbrightness-lost-39-146114.html
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.