జగన్ కోసమే జనసేనతో గ్యాప్! బీజేపీ గ్రేటర్ వ్యూహం ఇదేనా?

Publish Date:Nov 30, 2020

Advertisement

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు గందరగోళంగా సాగింది. అసలు ఆ రెండు పార్టీలు కలిసే ఉన్నాయో లేదో తెలియని పరిస్థితి నెలకొంది.  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో జరిగిన పరిణామాలు చూస్తే జనసేనకు బీజేపీ బైబై చెప్పినట్లే కనిపిస్తోంది. అమిత్ షా రోడ్ షోలో పాల్గొనేందుకు వచ్చిన జనసేన కార్యకర్తలను బీజేపీ నేతలు అడ్డుకోవడం, వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని అరవడం చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రచార రథం దిగి మరీ వచ్చి జన సైనికులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. తమకు మద్దతు తెలిపిన పార్టీ కార్యకర్తలను బీజేపీ ఎందుకు వెళ్లగొట్టిందనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

 

గ్రేటర్ ఎన్నికల్లో జనసేనను బీజేపీ దూరం పెట్టడం వెనక బలమైన కారణాలే ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా జగన్ కోసమే బీజేపీ జనసేనను దూరం పెట్టిందనే చర్చ జరుగుతోంది.  గ్రేటర్ ఎన్నికల్లో సీమాంధ్ర ఓట్లు కీలకం. దాదాపు 40 డివిజన్లలో వారే గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో వైసీపీ పోటీ చేయటం లేదు. టీడీపీ పోటీలో ఉన్నా.. కొన్ని  డివిజన్లలోనే గట్టి పోటీ ఇస్తోంది.  జనసేన ఓట్లతో పోల్చుకొంటే వైసీపీ , టీడీపీ ఓట్లు చాలా అధికం . ప్రతి డివిజన్లో జనసేన ఓట్లు పదులు వందల్లో ఉంటే వైసీపీ , టీడీపీ ఓట్లు వేలల్లో ఉంటాయి . అవే ఫలితాలని తారుమారు చేస్తాయి. వైసీపీ  పోటీ చేయటం లేదు కాబట్టి వాళ్ళంతా  టీఆర్ఎస్,  బీజేపీకి సమానంగా  ఓట్లు వేస్తారని చెబుతున్నారు. అదే  పవన్ కల్యాణ్ బీజేపీ తరపున ప్రచారం చేస్తే వైసీపీ ఓట్లు బీజేపీకి పడే అవకాశమే లేదు.  పవన్ కల్యాణ్ ను  తీవ్రంగా వ్యతిరేకించే వైసీపీ ఓటర్లు పూర్తిగా టీఆర్ఎస్ సైడ్ కు షిప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే జగన్ వర్గ ఓట్ల కోసం జనసేనను తెలంగాణ బీజేపీ దూరం పెట్టిందనే చర్చ జరుగుతోంది. 

 

టీడీపీ పోటీలో ఉంది కాబట్టి ఆ పార్టీ కార్యకర్తలు వాళ్ల అభ్యర్థులకే ఓట్లు వేస్తారు. వైసీపీలో పోటీలో లేదు కాబట్టి.. ఆ వర్గం ఓట్ల కోసమే బీజేపీ పవన్ కల్యాణ్ ను గ్రేటర్ ఎన్నికల్లో దూరం పెట్టిందని చెబుతున్నారు. సీమాంధ్ర ఓట్లు టీఆర్ఎస్  కంటే బీజేపీకే ఎక్కువ పడేటట్లు చేసే ప్లాన్లో భాగంగానే ఇదంతా చేస్తున్నారని సమాచారం. అందుకే  దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై వివాదాస్పద కామెంట్లు చేయగానే బీజేపీ పెద్దలు వెంటనే రియాక్ట్ అయ్యారని తెలుస్తోంది. రఘునందన్ రావుకు అక్షింతలు వేసి వెంటనే మాటలు వెనక్కితీసుకోవాలని సూచించినట్లు సమాచారం. హైకమాండ్ ఆదేశాలతోనే మాట్లాడిన కొన్ని గంటల్లోనే రఘునందన్ రావు రిగ్రెట్ చెప్పినట్లు చెబుతున్నారు. 

 

జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ, జనసేన మధ్య మొదటి నుంచి గందరగోళమే కనిపించింది. సొంతంగానే పోటీ చేస్తామని ముందు  ప్రకటించిన పవన్ కల్యాణ్.. తర్వాత యూ టర్న్ తీసుకున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ చర్చలు జరపడంతో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. బీజేపీ తరపున ప్రచారం కూడా చేస్తానని చెప్పారు. అయితే గ్రేటర్ లో ఆయన  ప్రచారం చేయలేదు. ఇటీవలే  ఢిల్లీ వెళ్లిన జనసేన చీఫ్ .. రెండు రోజుల పాటు అక్కడే ఉండి బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపారు. గ్రేటర్ ఎన్నికలతో పాటు త్వరలో జరగనున్న తిరుపతి లోక్ సభ ఉపఎన్నికపై బీజేపీ హైకమాండ్ తో పవన్ కల్యాణ్ మాట్లాడారనే ప్రచారం జరిగింది. ఢిల్లీ నుంచి రాగానే జీహెచ్ఎంసీలో ప్రచారం చేస్తారని అంతా భావించారు. కాని పవన్ కల్యాణ్ ప్రచారానికి దిగలేదు. జనసేనతో తమకు పొత్తు లేదని, వారే పోటి నుంచి తప్పుకున్నారని బీజేపీ ఎంపీ అర్వింద్ చేసిన ప్రకటన దుమారం రేపింది. అర్వింద్ వ్యాఖ్యలపై సీరియస్ గా స్పందించిన జనసేన వెంటనే  క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అయినా బీజేపీ ఎలాంటి క్షమాపణలు చెప్పలేదు. 

 

గ్రేటర్ ఎన్నికల సందర్భంగా తమతో తెలంగాణ బీజేపీ వ్యవహరించిన తీరుపై జనసేనలో ఆగ్రహం వ్యక్తమవుతుందని తెలుస్తోంది. అమిత్ షా  రోడ్ షాలో పాల్గొనేందుకు వచ్చిన తమను అడ్డుకోవడంపై వారు మండిపడుతున్నారు. వైసీపీ ఓట్ల కోసం తమ నేత పవన్ కల్యాణ్ నూ దూరం పెట్టారన్న ప్రచారంతో జనసేన కార్యకర్తలు మరింత రగిలిపోతున్నారు. వైసీపీ ఓట్లు కావాలనుకున్నప్పుడు తమ మద్దతు ఎందుకు కోరారని నిలదీస్తున్నారు. పవన్ కల్యాణ్ మద్దతు కోసం వచ్చిన కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కు వైసీపీ ఓట్ల విషయం అప్పుడు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు జన సైనికులు. తెలంగాణ బీజేపీ తమను నమ్మించి మోసం చేసిందనే ఆగ్రహం జనసేన కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. తాము పోటీ చేసేందుకు సిద్ధమైన సమయంలో చర్చలు జరిపి మద్దతు కోరారని, నామినేషన్ల పర్వం ముగిశాకా తమను పట్టించుకోవడం మానేశారని జన సైనికులు ఆరోపిస్తున్నారు. 
                 

మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి సిద్దమైనా పవన్ కల్యాణ్ ను దూరం పెట్టిన బీజేపీ.. తిరుపతిలో మాత్రం మరోలా వ్యవహరించే  అవకాశం ఉందని చెబుతున్నారు . పవన్ కల్యాణ్ ను గ్లామర్ ను తిరుపతిలో తమకు అనుకూలంగా మలుచుకునే  అవకాశం ఉందంటున్నారు. తిరుపతిలో పవన్ సామాజిక వర్గం ఓట్లు భారీగానే ఉన్నాయి. పవన్ ప్రచారం చేస్తే ఆ ఓట్లు బీజేపీకి పడే అవకాశం ఉంది. సాధారణంగా రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో  పవన్ సామాజికవర్గం ఎక్కువగా టీడీపీకి సాంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉంది . పవన్ బీజేపీ తరుపున ప్రచారం చేస్తే ఆ మేరకు టీడీపీకి గండిపడే అవకాశమే ఎక్కువగా ఉంది. అందుకే తిరుపతిలో పవన్ తో బీజేపీ పూర్తిస్థాయిలో ప్రచారం చేయించుకునే అవకాశం ఉంది. మొత్తంగా జనసేన, బీజేపీ తీరు.. గ్రేటర్ లో జరిగిన పరిణామాలతో పవన్ కల్యాణ్ ను తమ అవసరానికి అనుగుణంగా బీజేపీ వాడుకుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.