Publish Date:Feb 18, 2021
దేశమంతా కాషాయ జెండా ఎగరేయడమే బీజేపీ ఎజెండా. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ తిరుగులేని పట్టు సాధించింది. దక్షిణాదిపై ఎప్పటి నుంచో గురి పెట్టింది. అయితే.. కర్ణాటక మినహా సదరన్ స్టేట్స్ అంత ఈజీగా కాషాయ పరం కావటం లేదు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటమే ఇందుకు కారణం. అందుకే, జాతీయ పార్టీల కూటమిల ఆధిపత్యం ఉన్న కేరళపై కన్నేసింది కమలదళం. అందుకు, కేరళపై బీజేపీ వదల బోతున్న రామబాణం మెట్రో మ్యాన్ శ్రీధరన్.
దేశవ్యాప్తంగా కామ్రేడ్ల ప్రభ కనుమరుగవుతోంది. బెంగాల్, త్రిపురలో ఎర్రదండు తోక ముడిచింది. ఒక్క కేరళలోనే సీపీఐ(ఎమ్) అధికారంలో ఉంది. అక్కడ కమ్యూనిష్టులను గద్దె దింపితే.. ఇక ఇండియా మ్యాప్ నుంచి వామపక్ష అధికారాన్ని తొలగించినట్టే. అయితే.. అది అంత ఈజీగా జరిగే పని కాదని బీజేపీకీ తెలుసు. కేరళలో ఆ పార్టీ ఖాతా తెరవడమే కష్టంగా మారింది. ఢిల్లీలో రైతుల ఆందోళనతో మోదీ గ్రాఫ్ దారుణంగా పడిపోతోంది. డీజిల్, పెట్రోల్ ధర సెంచరీ వైపు పరుగులు పెడుతుండటం, సామాన్యుడిపై గ్యాస్ గుదిబండగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో కేరళలో మళ్లీ ఎల్.డి.ఎఫ్ అధికారంలోకి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. పంజాబ్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినట్టే.. త్వరలో జరగబోవు కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్ లో వామపక్షాలకు లేదంటే కాంగ్రెస్.. ఆ ఇద్దరిలో ఒకరికి అధికారం దక్కుతుందని తేల్చి చెబుతున్నారు. పరిస్థితులు ఇంత వ్యతిరేకంగా ఉన్నా.. కమలనాథులు కేరళపై ఏమాత్రం ఆశ వదులుకోవడం లేదు.
కేరళలో కమ్యూనిస్టుల పాలనను అంతం చేసేందుకు బీజేపీ రామబాణం సిద్ధం చేస్తోంది. ఢిల్లీ మెట్రో రూపకర్త, మెట్రో మ్యాన్ గా పేరున్న కేరళకు చెందిన శ్రీధరన్ ను బీజేపీలో చేర్చుకునేలా సన్నాహాలు చేస్తోంది. శ్రీధరన్ తమ పార్టీలో చేరుతున్నారంటూ కేరళ రాష్ట్ర బీజేపీ ప్రకటించింది. ఈ నెల 21న కేరళలో బీజేపీ ‘విజయ యాత్ర’ నిర్వహించనుందని. ఆ సందర్భంగా శ్రీధరన్ బీజేపీలో చేరుతారని కేరళ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సురేంద్రన్ ప్రకటించారు. కేరళలో బీజేపీ అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతుందని, బీజేపీ ఒప్పుకుంటే తాను ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధంగానే ఉన్నానని శ్రీధరన్ గతంలోనే ప్రకటించారు. ఆయనొస్తే.. పార్టీ ఇమేజ్ మరింత పెరుగుతుందని.. విద్యావంతులు అధికంగా ఉండే కేరళలో శ్రీధరన్ కు చాలా క్రేజ్ ఉంటుందని అంచనా వేస్తోంది. అయితే.. ఎలాంటి రాజకీయ, పాలనా అనుభవం లేని శ్రీధరన్ ఇమేజ్ బీజేపీకి ఏమేరకు కలిసొస్తుందో చూడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-rama-bhanam-metro-sridaran--39-110292.html
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.